AKP: నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా నక్కపల్లిలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఎలా శంకుస్థాపన చేస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా శంకుస్థాపన చేయవద్దని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీఎంకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లేఖ ప్రతులను ప్రదర్శించారు.