PPM: గిరిజన విద్యా సంస్థల్లో అన్ని బాగుంటే గిరిజన విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయో గిరిజన శాఖ అధికారులు ప్రభుత్వం సమాధానం చెప్పాలని గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాల సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. 45 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని అన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులను కలిసి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ELR: ఏలూరు నియోజకవర్గంలోని 4, 5, 35, 40వ డివిజన్లో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
VZM: తెర్లాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్.ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ రాంబాబు, ఎమ్మార్వో హేమంత్ కుమార్, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు పాల్గొన్నారు.
CTR: కుప్పం మున్సిపాలిటీ వైసీపీ అధ్యక్షుడిగా హఫీజ్ నిమితులయ్యారు. ప్రస్తుతం కుప్పం మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ గా ఉన్న హఫీజు పార్టీ మున్సిపల్ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పంలో పార్టీ అభ్యున్నతికి పార్టీ శ్రేణులతో కలిసి కలిసికట్టుగా కృషి చేస్తానని హఫీజ్ పేర్కొన్నారు.
ELR: ఉంగుటూరు మండలం కాగుపాడులో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులను, స్థానిక వైధ్యశాలలో వైధ్యులను, సిబ్బందిని పట్టభద్రులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.
WNP: ఆత్మకూరు, మదనాపురం మండాలాల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో 3 రోజుల్లోనే 450 కోళ్లకు పైగా మృతి చెందాయి. సమాచారం మేరకు జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డును పరిశీలించారు. కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారించే అవకాశం ఉందన్నారు.
SRCL: చెత్త అంటుపెడుతూ ఓ మహిళ మంటల్లో చిక్కుకొని మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం చిన్ని అంజవ్వ(52) చెత్తను కాల్చివేస్తుండగా, మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. మృతురాలికి భర్త బాల్ రెడ్డి, ఇద్దరు కూతుళ్ళు భాగ్య, భవానిలు ఉన్నారు.
SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్త మార్కండేయ మహా దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డిలకు ఇవాళ ఖేడ్లో పద్మశాలి సంఘం, కుల పెద్దలు, వైదిక పురోహితులు గురురాజు శర్మ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. 3 మంచి ఆరో తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు.
NRPT: జిల్లాలోని 3 గ్రామాల ప్రజలు సీఎం మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటకొండ, గార్లపహాడ్, కానుకుర్తీలను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఇంఛార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి ఇటీవల పర్యటనలో సీఎం నోటి వెంట కొత్త మండలాల ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చారు.
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం నాగలాపురం మూడవ సెగ్మెంట్ లోని ఈస్ట్ హరిజనవాడలో రూ.5 లక్షల అంచనాతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం వడ్లకుప్పం గ్రామంలో రూ.13.5 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.
SRD: కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టుల కోసం సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, వహిద్ పాషాలు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.
JGL: జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో బాక్స్ క్రికెట్ చిల్డ్రన్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడప: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గంలో వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పులివెందుల పట్టణానికి చెందిన పోరెడ్డి జశ్వంత్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాజీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
JGL: గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జగిత్యాల నియోజకవర్గ బీజేపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా గెలిపించాలో చర్చించారు. ఈ సమీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.