BPT: లోక్ అదాలత్లో రాజీమార్గంలో ఎక్కువ కేసులు పరిష్కరించిన కర్లపాలెం ఎస్సై రవీంద్రను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్సై రవీంద్రకు ప్రశంసా పత్రాన్ని ఎస్పీ అందజేశారు. బాధితులు కోర్టులు చుట్టూ తిరగకుండా వారి సమయాన్ని వృధా చేయకుండా రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు.
BPT: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని అధికారులకు సూచించారు. దొంగతనాలు, నేరాలు జరగకుండా రాత్రి వేళలో పటిష్టమైన గస్తీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు ఉన్నారు.
GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పలు అంశాలపై చర్చించారు. నేరాల పరిశోధన, నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా నేర సమీక్ష నిర్వహణ ప్రత్యేక అధికారి IG హరికృష్ణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను CCTNS ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉండాలన్నారు.
KDP: గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ , సెక్షన్ 144 అమల్లో ఉందని శుక్రవారం డీఎస్పీ భావన తెలిపారు. ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడిన, ఎలాంటి సమావేశం ఏర్పాటు చేసిన, ర్యాలీలు గాని ధర్నాలు గాని చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు కూడా విఘాతం కలిగించరాదని అన్నారు.
KDP: గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా కోసం నేడు కలెక్టర్ను అధికార పార్టీ ఉపయోగించుకుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. అరఅడుగు దూరంలో ప్రతిపక్ష పార్టీకి విజయం ఉందంటే ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుందన్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని విధాలుగా భయపెట్టినా వార్డు సభ్యులు ధైర్యం అభినందనీయం అన్నారు.
TG: రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ జరగడం లేదని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అంటున్నారు.. వాటిని పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ కొత్తగా లేదని అభిప్రాయపడ్డారు. విద్యా రంగానికి 14 శాతం నిధులు అడిగితే.. 8 శాతం మాత్రమే కేటాయించారని అన్నారు.
TG: సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, MLAలు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు గ్రౌండింగ్ వేగవంతం చేయాలని పొంగులేటి ఆదేశించారు. బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణమే చెల్లింపులు జరపాలని సూచించారు. జూన్ చివరి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి కావాలన్నారు.
CTR: చిత్తూరు నగరంలోని రామ్ నగర్ కాలనీ వద్ద ఉన్న ఆర్టీసీ డిపోను జిల్లా ఇంఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. డిపో ప్రాంగణంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. చిత్తూరు డిపోకు సంబంధించిన వివరాలను ఆర్ఎం జగదీశ్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్ పర్సన్ కటారి హేమలత పాల్గొన్నారు.
KMR: విద్యార్థులు వేసవి సెలవులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల విద్యాలయంలో కళాబృందం కళను ప్రదర్శించారు. వేసవి సెలవులలో ఇంటికి వెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులతో (గుడ్ టచ్ బాడ్ టచ్) విషయంలో జాగ్రత్తగా వుండాలని అన్నారు.
SRPT: ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్కు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం సభా ఏర్పాట్లను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగనాడు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి సీఎం వస్తున్నారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
SRPT: మాదక ద్రవ్యాలు వాడటం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. డ్రగ్స్ వద్దు ప్రాణం ముద్దు అని నినాదంతో ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ సంతలో కరపత్రాలు పంచి పుర్రె ఎముకలు గూడు చిత్రాలు కలిగిన నల్లని దుస్తులను ధరించి మైక్ పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ASR: రాజవొమ్మంగిలో ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఉపాధి APO రెడ్డిబాబు శుక్రవారం తెలిపారు. టెన్త్ ఆపై చదివిన, 18 -35 లోపు వయసు కలిగిన యువతీ యువకులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. ఉపాధి పనులు 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
VZM: ఈ నెల 30వ తేదీ ఉగాది రోజున విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పి4 కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ రంగాల ప్రతినిధులు హాజరు కానున్నారు. దీనికోసం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తన ఛాంబర్లో సమావేశామాయ్యారు.
NZB: అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు.
CTR: చిత్తూరు నగరంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మహాత్మ జ్యోతిరావు ఫూలే భవనంలో రూ. 53 లక్షలతో నిర్మించిన అదనపు వసతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.