ఏపీ జెన్కో 6,610 మెగావాట్ల రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి సాధించడం పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. జెన్కో అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ జీవితకాల రికార్డు సాధనలో పాలుపంచుకున్న ప్రతి ఇంజినీర్, అధికారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేవలం అధికారుల, ఇంజినీర్ల కృషితోనే ఈ అరుదైన ఘటన సాధ్యమైందని ఆయన ప్రశంసించారు.
MLG: మంగపేట (M)మొట్లాగూడెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పై AEO మహేష్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. AEO మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందులకు బదులుగా జీవామృతం, పంచామృతం, అగ్నీ అస్త్రం, నీమాస్త్రం వంటి సహజ ఎరువులను స్వయంగా తయారు చేసుకుని వాడాలని సూచించారు. ఈ పద్ధతులతో భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు.
AP: స్వామీజీలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రాష్ట్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఎవరు తప్పు చేసినా ఖండిస్తామని చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డిలా తకుకు ఆస్తులపై కోరికలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
NLR: ASపేట ఎంపీడీవో కార్యాలయానికి జిల్లా పంచాయతీ అధికారిణి డి.వసుమతి గురువారం వచ్చారు. పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. పొదుపు మహిళలు, అంగన్వాడీ సిబ్బందిని సమన్వయం చేసుకుని మార్చి 20వ తేదీ లోపు 100% ఇంటి పన్నుల వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ప్రసన్నకుమారి, డిప్యూటీ ఎంపీడీవో మునిరత్నం, కార్యదర్శులు పాల్గొన్నారు.
ATP: అనారోగ్యంతో అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
AKP: జనసేన పార్టీ ఆశయాలను కార్యకర్తలు, నాయకులు ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాంబిల్లి మండలం వెంకటాపురం పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 14న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగురవేయాలని అన్నారు.
ASR: అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో అరకులోయ మండలంలో 8933 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంఏవో ఫణిరాజ్ వర్మ గురువారం తెలిపారు. 8933 మంది రైతులకి అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో రూ. 4000, 22వ విడత పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతుందన్నారు.
KMR: కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి అడిషనల్ వైద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిడ్నీ పనితీరుపై ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ పనితీరును ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ సెంటర్ మేనేజర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
GNTR: ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను రూపుమాపేందుకు ప్రభుత్వం చేపట్టిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం తెనాలిలో ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెల 9 నుంచి పట్టణ, రూరల్ పరిధిలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 14ఏళ్ల వయసున్న బాలికలకు వైద్యులు వ్యాక్సిన్ వేస్తున్నారు. గురువారం టీచర్స్ కాలనీ శివారులోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ చేపట్టారు.
GNTR: ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను రూపుమాపేందుకు ప్రభుత్వం చేపట్టిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం తెనాలిలో ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెల 9 నుంచి పట్టణ, రూరల్ పరిధిలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 14ఏళ్ల వయసున్న బాలికలకు వైద్యులు వ్యాక్సిన్ వేస్తున్నారు. గురువారం టీచర్స్ కాలనీ శివారులోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ చేపట్టారు.
MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లకు నీటి సరఫరా సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని వార్డు మెంబర్ మధు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సొంత ఖర్చుతో మోటార్ మరమ్మతులు చేయించి బోరు బావిలో దింపించారు. దీంతో నీటి సమస్య పరిష్కారమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
MDCL: అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి డివిజన్ పరిధి హకీంపేట్ సమీపంలోని రైల్ నగర్ కాలనీ సబ్లైన్లలో రూ.28 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రారంభించారు. అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తమిళ హీరో ధనుష్ వరుస మూవీలతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో ‘D55’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. మమ్ముట్టి త్వరలోనే భాగం కానున్నాడు. ఈ మూవీని SEP వరకు పూర్తి చేసి.. మారి సెల్వరాజ్తో ‘D56’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తమిళరసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో ‘D57’ సినిమా చేయనున్నట్లు, 2027లో ఇది స్టార్ట్ క...
CTR: గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, ధరలు భారీగా పెరిగాయని నిరాధార వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. వాస్తవాలు నిర్ధారించకుండా తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయడం, షేర్ చేయడం కూడా నేరమని తెలిపారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ఎస్పీ సూచించారు.
CTR: గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, ధరలు భారీగా పెరిగాయని నిరాధార వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. వాస్తవాలు నిర్ధారించకుండా తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయడం, షేర్ చేయడం కూడా నేరమని తెలిపారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ఎస్పీ సూచించారు.