కర్నూల్ జిల్లాలో ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పరిపాలన కొనసాగుతోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. గురువారం నందమూరి తారక రామారావు జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.
VZM: ఆంధ్రుల ఆరాధ్యదైవం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కొత్తవలస కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. సమాజమే దేవాలయం అంటూ ప్రజల్లోకి వెళ్లిన ఘనత ఎన్టీఆర్ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం ట్రస్టు బోర్డు సభ్యుడు నవీన్, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.
HNK: హనుమకొండలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్స్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికీ మాజీ ఖాదీ, చిన్న పరిశ్రమల డైరెక్టర్ ఈగ మల్లేశం, నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. నటుడిగానే కాకుండా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే చరిత్ర సృష్టించిన రాజకీయ దిగ్గజం ఎన్టీఆర్ అని మల్లేశం అన్నారు.
AKP: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్పై ఈడీ దాడులను నిరసిస్తూ అనకాపల్లిలో సీపీఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జీ.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి జరుగుతున్న చర్యలను ప్రజాస్వామ్య శక్తులంతా తిప్పికొట్టాలన్నారు.
మాస్ మేనరిజమ్స్తో కోట్లాది మందిని అలరించే సూపర్స్టార్ రజినీకాంత్ పాత ఐడీ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన బెంగళూరులో బస్సు కండక్టర్గా పనిచేసిన రోజుల నాటి ఈ బ్లాక్ అండ్ వైట్ కార్డుపై రజినీ అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ అని ఉంది. సాధారణ జీవితం నుంచి అసాధారణ స్టార్డమ్కు చేరిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.
SKLM: మాజీ ముఖ్యమంత్రి, CPM పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు చేయడాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తీవ్రంగా ఖండించారు. గురువారం శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పినరయి విజియన్ నివాసంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం ఇటువంటి చర్యలు తీసుకోవడం సరి కాదన్నారు.
ATP: తాడిపత్రిలోని YCP కార్యాలయంలో పెద్దపప్పూరు మండల బూత్ లెవల్ ఏజెంట్ల (SIR-2026) సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గోపినాథ్ బూత్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి పరిశీలనపై అవగాహన కల్పించారు.
GNTR: మాజీ సీఎం వైఎస్ జగన్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, మానవత్వానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరిలో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని కోరారు. కాగా, తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
MHBD: కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా రాత్రి, పగలు యంత్రాలతో మట్టిని తవ్వించి తరలిస్తున్నారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
HNK: గునిపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయిన తాటి వనమును ఎక్సైజ్ అధికారులు సంఘం సభ్యులతో కలిసి గురువారం సందర్శించారు. ఈ ఘటనపై ప్రత్యేక నివేదికను తయారుచేసి గీత కార్మికులకు ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
SKLM: ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తాగునీరు అవసరమని శుద్ధ జలాన్ని ఆర్వో ప్లాంట్ ద్వారా ప్రజలకి అందించడం అభినందనీయమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గురువారం మండల కేంద్రం సార్వకోటలో ఎన్టీ రామారావు జన్మదిన సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ కమిటీ కన్వీనర్ ధర్మాన తేజ్ కుమార్ ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు.
AKP: కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ విజయకృష్ణన్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజానికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
NTR: దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి అలంకరణకు, కానుకగా వచ్చే చీరల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఏడాదికి రూ.10 కోట్లకు చీరల విక్రయ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చీరలు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ ID కార్డులు ఇచ్చి తన మనుషులను గర్భగుడిలో పెట్టడంపై బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. EO మౌనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కడప: సిద్ధవటం(M)మాచుపల్లి గ్రామ పరిధిలోని పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ప్రమాదకరంగా మారాయి. పలుచోట్ల స్తంభాలు వంగిపోయి,విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన మైనార్టీ సోదరులు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.