SRD: కంది తహసీల్దార్ కార్యాలయాన్ని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.