WG: జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.