W.G: జిల్లాలో నీటి కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా చెరువుల వ్యర్థ జలాలను డ్రైన్లు, కాలువల్లోకి నేరుగా వదలకుండా నిరంతర నిఘా ఉంచాలన్నారు.