GNTR: పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిని విశాఖపట్నం స్పెషల్ హోమ్కు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేసును సమర్థంగా విచారించి శిక్ష పడేలా పనిచేసిన దర్యాప్తు, కోర్టు సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు.