అన్నమయ్య: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని DRO మధుసూదన్ రావు గురువారం స్పష్టం చేశారు. మదనపల్లిలో గ్యాస్ ఏజెన్సీలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు, కడప, అనంతపురం డిపోల నుంచి సిలిండర్లు నిరంతరంగా సరఫరా అవుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.