BDK: ఇల్లందు మండలం ఇందిరానగర్ గ్రామ పంచాయతీలో ప్రజా ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పేదలందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారితోపాటు స్థానిక నూతన పాలకవర్గం పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలో శుక్రవారం పలువురు లబ్దిదారుల ఇళ్లకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి తెలిపారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని. ముందుకురాని లబ్దిదారుల కోసం ప్రైవేట్ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
KDP: అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు త్వరితగన పూర్తి చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో అలగనూరు రిజర్వాయర్ గురించి ప్రస్తావించారు. ఆరు నియోజకవర్గాల్లో 92 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందన్నారు.
NDL: గోస్పాడు మండలంలో ఇవాళ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. నెహ్రు నగర్ గ్రామంలో వైసీపీ కార్యకర్త వివాహ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలను తెలియజేశారు.
SRCL: వేములవాడ రూరల్ మండలం హనుమక్కపల్లిలో చిరుతపులి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.
RR: షాద్నగర్ మున్సిపల్ ఛైర్మన్గా బస్వం, వైస్ ఛైర్మన్గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
RR: షాద్నగర్ మున్సిపల్ ఛైర్మన్గా బస్వం, వైస్ ఛైర్మన్గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
RR: షాద్నగర్ మున్సిపల్ ఛైర్మన్గా బస్వం, వైస్ ఛైర్మన్గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
AP: శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. వైసీపీ నేతలు ఆందోళనలతో ఇప్పటివకే పలుమార్లు సభ వాయిదా పడగా.. చివరికి సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. కాగా హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల అంశంపై చర్చ జరపాల్సిందేనని వైసీపీ నేతలు పట్టుబడుతూ మండలిలోకి శ్రీవారి ఫొటోలతో రాగా.. చెప్పులతో రావడమేంటని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
KKD: ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటాలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని MEO గీతాదేవి సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి అన్ని పత్రాలు సమర్పించాలన్నారు.
TPT: వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల అనుమానాస్పద కదలికలు పెరగడంతో రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో సమాచారం పంచుకోవద్దని, వాహనాలు వెలుతురు ఉన్న ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని చెప్పారు. అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ 9440900725 కు సమాచారం ఇవ్వాలన్నారు.
JN: పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ మాతృమూర్తి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు మాజీ మంత్రి, శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ తెలిపారు.
స్ట్రాబెర్రీలు తక్కువ కేలరీలు, అధిక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగిన అద్భుతమైన పండ్లు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. బరువు తగ్గడంలో తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు కొన్ని పండ్లు తింటే మెదడును చురుగ్గా ఉంచుతాయి. శరీరంలో వాపు తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.
SRD: రామచంద్రాపురంలో సంత్ గురు రావిదాస్ బోధనలు సమాజంలో సమానత్వం, ప్రేమ పెంపొందించాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం భారతి నగర్ బొంబాయి కాలనీలో గురు రవిదాస్ 649వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోచి కులస్తుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
VSP: భీమిలి నియోజకవర్గంలోని శ్రీ నవశక్తి దేవతల ఆలయముల సముదాయం పునఃప్రారంభ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 4వ వార్డ్ కార్పొరేటర్ దవులపల్లి కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరమ్మ హాజరయ్యారు.