MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ గడువు సమీపిస్తుండటంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని AEO వరలక్ష్మి సూచించారు. ఆధార్ భూ యాజమాన్య పాస్బుక్, బ్యాంక్ వివరాలతో సమీప మీసేవ కేంద్రాల్లో నమోదు చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 28 చివరి తేదీగా ఉండటంతో గడువులోపు నమోదు పూర్తి చేయాలని కోరారు.
W.G: మొగల్తూరు డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదవ రోజుకు చేరుకుంది. ఉద్యోగుల జీతాల పెంపు వల్ల ప్రభుత్వానికి పైసా భారం ఉండదని, సహకార సంఘాల లాభాల నుంచే చెల్లింపులు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
W.G: పెనుగొండ మండలం సిద్ధాంతంలో వశిష్ఠ గోదావరి నది ఒడ్డున రూ. 3 కోట్లతో గోదావరి మోక్షధామం స్మశాన వాటిక నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజమండ్రి తర్వాత గోదావరి జిల్లాల్లో ఈ తరహా స్మశాన వాటిక నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరుగుతుందని, అత్యాధునిక హంగులతో స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ ఎంపీ నిధుల నుంచి స్మశాన వాటిక అభివృద్ధికి ఇటీవల రూ. 20 లక్షలు కేటాయించారు. స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిన అనంతరం శుక్రవారం స్మశాన వాటిక అభివృద్ధి పనులను కూటమి నాయకులు పరిశీలించారు. అలాగే పనులు చాలా నాణ్యతగా జరగాలని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.
BDK: ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు సత్వర న్యాయం అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇల్లందు డిఎస్పీగా నూతనంగా నియమితులైన వెంకన్న బాబు శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన డీఎస్పీనీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లందు ప్రాంతంలో శాంతిభద్రతలపై ఇరువురు చర్చించారు.
KMM: నవసకం ఆధ్వర్యంలో మధిర మండలం సిరిపురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. వారితోపాటు గ్రామీణ వైద్యులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
2008 ముంబై దాడుల తర్వాత 2009 నుంచి IPLలో పాక్ ప్లేయర్లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్-‘ది హండ్రెడ్’లో కూడా పాక్ ప్లేయర్లను తీసుకునేందుకు 8 ఫ్రాంచైజీలలో 4 నిరాకరిస్తున్నాయట. ఈ MSG, MI లండన్, సథరన్ బ్రేవ్(క్యాపిటల్స్), సన్రైజర్స్ లీడ్స్లకు ఓనర్స్ IPL ఫ్రాంచైజీలే కావడం ఇందుకు కారణం. అందుకే SA20లోనూ నసీం షా, మహ్మద్ నవాజ్ మినహా ఎవరూ ఆడలేదు.
GDWL: అమరవాయి గ్రామ వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల అందుబాటును సులభతరం చేయడానికి సర్పంచ్ పి. హుస్సేన్ పంచాయతీలోనే పంపిణీ చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ని కలసి వినతిపత్రం అందజేశారు. అధికారి సానుకూల స్పందన తెలిపినట్లు సర్పంచ్ తెలిపారు.
JGL: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జగిత్యాల జిల్లాలో తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు.
కర్నూలు కలెక్టరేట్లో JC నూరుల్ ఖమర్ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇళ్ల స్థలం, ఇతర ప్రయోజనాలను త్వరగా మంజూరు చేయాలని సూచించారు.
W.G: అంతర్జాతీయ మల్టీ టాలెంటెడ్ పురస్కారం, నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డ్, నంది అవార్డు అందుకున్న ఆకివీడుకు చెందిన ఘంటా షైనీని శుక్రవారం సన్మానించారు. ఆకివీడులోని స్థానిక ప్రైవేట్ స్కూల్ ఛైర్మన్ ఉండ్రమట్ల సాంబశివరావు సన్మానించి పదివేల రూపాయలు చెక్కును అందజేశారు. ఆకివీడు ఖ్యాతిని షైనీ దశదిశలా విస్తరింప చేస్తుందన్నారు.
BHNG: బీబీనగర్ మండలం ప్రాథమిక పాఠశాల వెంకిర్యాలలో విద్యార్థులందరికీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చెవి, ముక్కు, గొంతు, కళ్ళ, సైకియాట్రిస్ట్ డాక్టర్లు వ్యక్తిగతంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. అవసరమైన విద్యార్థులకు ఇయర్ డ్రాప్స్ అందించారు. విద్యార్థులకు కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేస్తానన్నారు.
కోనసీమ: ఈనెల 22న మంగళగిరి లో ఆదివారం జరగనున్న బీసీ సింహగర్జనను జయప్రదం చేయాలని ఆ సభకు వేలాదిగా బీసీలు తరలి వెళ్లాలని రాష్ట్ర బీసీవై ఎగ్జిక్యూటివ్ మట్ట వీరబాబు గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కొత్తపేటలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ సభలో బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరారు.
MDK: చిన్నశంకరంపేట(మం) కామారం రెండో వార్డులో శుక్రవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గడ్డం సుజాత, ఉప సర్పంచ్ సుధాకర్ ప్రారంభించారు. జీపీ నిధులతో ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ సైట్ ఇంజినీర్ మహేందర్, గ్రామ కార్యదర్శి సుమలత, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
NRPT: మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్ పర్సన్ రాధా అరుణ్, కౌన్సిలర్లు శుక్రవారం మక్తల్లో స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతరం మంత్రి వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీని కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.