ELR: భీమడోలు మండలం పూళ్ళు గ్రామంలో పలు ప్రాంతాల్లో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. భీమడోలు ఇన్స్పెక్టర్ యు జే విల్సన్ మాట్లాడుతూ.. జూదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతాయని, ప్రజలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. కోడి పందేల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బరిలను ధ్వంసం చేశారు.