ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. నిపుణులైన వైద్యులు రోగులకు పరీక్షలు చేసి అవసరమైన సలహాలు ఇచ్చారు.