అన్మమయ్య: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సూచించారు. సెలవుల్లో దొంగతనాలు జరగకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్ మరింత పటిష్టం చేయాలని కూడా ఆదేశించారు.