TPT: సూళ్లూరుపేటలో ఇవాల్టి నుంచి జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ మొదటి ఘట్టం శోభాయాత్రకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవలతో కలిసి ఆయన ర్యాలీగా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ వరకు వెళ్లారు. ఈ శోభాయాత్రలో మహిళలు, అధికారులు పాల్గొన్నారు.