MDCL: బాచుపల్లి మండల పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసుల పోరాటం ఫలించింది. సర్వే నంబర్ 186లో హిందూ స్మశాన వాటిక కోసం 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఓ బాలిక మృతి చెందగా, దహన సంస్కారాలకు స్థలం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
RR: మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో మోడల్గా నిర్మిస్తూ అభివృద్ధి చేసిన తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బృందం తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.
పార్వతీపురంలో గత కొన్నేళ్లుగా పార్సిల్ గోడౌన్ కళాసిలుగా పనిచేస్తున్న తమను అన్యాయంగా తొలగించడానికి కొందరు కుట్ర చేస్తున్నారంటూ పలువురు కళాసిలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను కలిశారు. మంగళవారం ఎమ్మెల్యేను కలిసి అక్కడ జరుగుతున్న పరిస్థితిని వివరించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
AP: కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం చక్రం కిందపడి ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
KRNL: కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఏ.సిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ విశ్వనాథ్ను నందికొట్కూరుకు, కర్నూలు ఆర్డీవోను గూడూరుకు బదిలీ చేశారు. ఆదోనికి జాయింట్ కలెక్టర్, ఎమ్మిగనూరుకు స్థానిక ఆర్డీవోను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.
ADB: యువత ప్రభుత్వంతోపాటు ప్రవేటు రంగ సంస్థలు కల్పించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన జాబ్ మేళాలో SP అఖిల్ మహాజన్తో సమావేశమై మాట్లాడారు. జాబ్ మేళాకు యువత తరలిరావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
PDPL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 98 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4829 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 4735 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 94 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
JGL: వేంపేట గ్రామానికి చెందిన లింగారెడ్డి జిల్లా రైతు సలహా కమిటీ సభ్యుడిగా నియమితులవ్వడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. నియామకానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన లింగారెడ్డి, రైతుల సంక్షేమం కోసం పని చేస్తానన్నారు.
KMM: నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ పశువులకు గాలికుంటు నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాహిత్య మాట్లాడుతూ.. పశువులకు వచ్చే ప్రాణాంతక వ్యాధులను అరికట్టేందుకు రైతులు ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించారు. పశుపోషకులు తమ పశువుల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
టీ. నర్సాపురం మండలం బొర్రంపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.వైద్యాధికారి డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో బాలికలకు ,మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలను పంపిణీ చేశారు.భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని అన్నారు.
వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వివేకనంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను మంగళవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేనరెడ్డి కలిసి క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారిస్తే ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చన్నారు.
ASR: డుంబ్రిగూడ మండలం కొర్రాయి గ్రామంలో మంగళవారం తహసీల్దార్ త్రివేణి ప్రభుత్వ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు ఆఫ్ రైట్, సర్వే నివేదికలు, పబ్లిక్ గ్రీవెన్స్, సివిల్ సప్లయ్, పెన్షన్లు, అంగన్వాడీ టేక్ హోమ్ రేషన్ వంటి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రతిష్ట, కలశ స్థాపన మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, అఖండ దీపారాధన తదితర విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్లతో సమావేశమయ్యారు. పార్టీ నాయకులు ప్రజలకు అండగా ఉంటేనే పదవులు వస్తాయని ఆయన సూచించారు. విభేదాలు వీడి సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో పనిచేస్తే వచ్చే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
NLG: మిర్యాలగూడలోని హనుమాన్ దేవాలయాన్ని శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ నెల 26న జరిగే శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహణ కోసం వారు భక్తులతో కలిసి పట్టణంలో బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగ విశిష్టతను చాటిచెప్పారు.