BPT: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందాలని కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల యువకులు ఏప్రిల్ 10వ తేదీలోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. నియామక వివరాలను పై వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ATP: గుత్తి పట్టణంలోని చెంబుల భావి వీధిలో డ్రైనేజీ కాలువలో చెత్త చెదారం ఉండడంతో మురుగునీరు ముందుకు కదలగా దుర్వాసనతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలో ఉన్న చెత్తను తొలగించి దోమల నివారణ మందును పిచికారి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
GNTR: కూటమి ప్రభుత్వ హయాంలో కొల్లిపర మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం కొల్లిపర గ్రామంలో KW కాల్వ మీద హైలెవల్ వంతెన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. రూ. 4 కోట్ల 19 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
కృష్ణా: నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థులకు ఆదివారం దంత సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా దంత ధావనం చేయాలన్నారు. దంత ధావనం చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపారు. దంతాలు, చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు అశ్రద్ధ చేయవద్దన్నారు.
MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాధ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామ శివారులో పాడైన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.
W.G: భగత్ సింగ్ ఆశయాల సాధనకు విద్యార్థులు యువత కృషి చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి అన్నారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం తణుకు వేల్పూరు రోడ్డులో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి భగత్ సింగ్ చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు.
కృష్ణా: ఆగిరిపల్లి గ్రామంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత సత్తుకోటేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో త్యాగదనులు త్రుణప్రాయంగా ప్రాణార్పణ చేసి భారత స్వతంత్రానికి వన్నెతెచ్చినట్లు చెప్పారు. వారి స్ఫూర్తితో దేశభక్తి పెంపొందాలన్నారు.
W.G: శెట్టిబలిజ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బర్మా కేసరి దొమ్మేటి వెంకటరెడ్డి 172వ జయంతి వేడుకలు ఆదివారం అత్తిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, శెట్టిబలిజ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్లు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘RC-16’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ‘పెద్ది’ అని టైటిల్ పెట్టినట్లు పలు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథనాయికగా నటిస్తుండగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
GNTR: పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
TG: హైదరాబాద్లోని చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్, ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిపోయిన ముడిపదార్థాలతో యథేచ్చగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్నారు. తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. కల్తీ అల్లం పేస్ట్ను అధికారులు మూసీలో పారబోశారు.
కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కెనడా పార్లమెంట్లో మొత్తం 338 స్థానాలు ఉండగా.. వాటికి ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
GNTR: IPL క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్న పల్నాడు జిల్లా SP శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
KDP: ఖాజీపేటలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ ఎం.వి. రమణారెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రతి షాప్ను సందర్శించి, ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.