ATP: ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామ రైతులు మంగళవారం అమరావతి సచివాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. ప్రభుత్వం హంద్రీనీవా లైనింగ్ పనులు చేపట్టడంతో రైతులు నష్టపోతారని ఆయనకు వివరించారు. అదేవిధంగా రంగంపేట, తూముచెర్ల మధ్య బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ATP: గుంతకల్లోని మెయిన్ రోడ్డు పాత బస్టాండ్, కసాపురం రోడ్డులో బుధవారం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను మున్సిపల్ కమిషనర్ నయూమ్ అహ్మద్ పరిశీలించారు. రోడ్లు డ్రైనేజీ కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ అధికారులు ఆదేశించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
NDL: గతంలో ఇంటి నిర్మాణాలను మొదలుపెట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసినట్లు బుధవారం అవుకు మండల ఎంపీడీవో వెంగన్న పేర్కొన్నారు. గతంలో ఇంటి నిర్మాణానికి యూనిట్ ధర రూ.1,80,000 ఉండగా.. ఎస్సీ, బీసీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు అదనంగా రూ.75,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ప్రకాశం: ఒంగోలు-1వ పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కిలో రూ.280 ధర పలికింది. చిలంకూరు క్లస్టర్ పరిధి నుంచి 36 బేళ్లను వేలానికి అనుమతించగా మూడు బేళ్లను తిరస్కరించారు. పొగాకు కిలో కనిష్ఠ ధర రూ.270, సరాసరి రూ. 277.82 ధర పలికినట్లు వేలంకేంద్రం నిర్వహణాధికారి రవికాంత్ చెప్పారు. రైతులు నాణ్యమైన పొగాకును వేలాన్ని తీసుకురావాలని ఆయన చెప్పారు
ప్రకాశం: గిద్దలూరు రైల్వే రక్షక దళం ఇన్స్పెక్టర్ నాగభూషణం ఆదేశాల మేరకు.. మండలంలోని కేఎస్ పల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, పశువుల కాపరులకు మంగళవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రైలు పట్టాల వెంబడి పశువులను మేతకు ఎవరు తోలుకొని వెళ్లవద్దని,ఆయన అన్నారు.
ప్రకాశం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఏఎన్ఎం గ్రేడ్-3లకు ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఉద్యోగోన్నతుల కౌన్సె లింగ్ను వాయిదా వేశామని డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు చెప్పారు. కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తామన్నారు. తేదీ మార్పును అభ్యర్థులు అందరూ గమనించాలని ఆయన సూచించారు.
BDK: నకిలీ మొక్కలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ఫామ్ రైతులు ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డికి, ఇంఛార్జ్ డీ.ఓ నాయుడు రాధా క్రిష్ణకు మంగళవారం వినతిపత్రం అందించారు. 2016 నుంచి 2022 మధ్య కాలంలో ఆయిల్ఫామ్ తోటలు నాటిన వాటిల్లో దాదాపుగా 50 శాతం పైగా కాపు రాలేదని తెలిపారు.
KNR: జిల్లాలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు మూడు రోజుల బంద్కు పిలుపునిచ్చినట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. GST పెంపు ధరలు, ముడి సరుకులు, ట్రాన్స్ఫోర్ట్ ధర పెరగడం వలన పాత ధరల్లో తాము పనులు చేయలేకపోతున్నామన్నారు. ఒక ధరను నిర్ణయించి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 12, 13, 14వ తేదీల్లో బంద్ నిర్వహిస్తున్నామన్నారు.
NTR: కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచిందని సీపీఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి రమణారావు అన్నారు. మంగళవారం విజయవాడ ఎక్సెల్ ప్లాంట్లో ఉన్న జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ బిల్లులు ట్రూ ఆఫ్ ఛార్జీలతో ప్రజలపై పెనుభారం మోపారని విమర్శించారు.
కడప: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని హోటల్స్లో ఎట్టి పరిస్థితులలో ప్లాస్టిక్ వాడరాదని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రజారోగ్యం ఇబ్బందితో కలిసి పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న పలు హోటళ్లను తనిఖీ చేశారు. ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
JGL: ఎండపల్లి(M) పాతగూడూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన జాతీయస్థాయి అండర్-14 విభాగంలో పాతగూడూర్కు చెందిన విద్యార్థులు సిహెచ్. సంజన, వై. రేఖ, సిహెచ్. వైష్ణవిలు గోల్డ్ మెడల్ సాధించారు. కరాటే మాస్టర్ చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను మంగళవారం అభినందించారు.
WPL లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన RCB 3 వికెట్ల నష్టానికి199 పరుగులు చేసింది. ఛేసింగ్లో ఛేసింగ్లో చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు 188 పరుగులకే ముంబైని కట్టడి చేశారు. దీంతో RCB 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ ఫామ్హౌజ్పై డ్రోన్ ఎగరేశారంటూ 2020 మార్చిలో రేవంత్పై కేసు నమోదైంది. తప్పుడు కేసులు బనాయించి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారని రేవంత్ న్యాయవాది పేర్కొన్నారు. పీపీకి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.
MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభ చూపారు. వ్యక్తిగత విభాగంలో దీక్షిక నేహా ద్వితీయ బహుమతి, అలాగే సామూహిక విభాగంలో అక్షయ్, దివిజేంద్రలకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ శ్రీనివాస్ చౌదరి సైన్స్ అధ్యాపకులు ప్రశంసించారు.
ASR: జిల్లాలో పీఎంఎవై, పీఎం జన్ మన్ పథకాల కింద చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలు వేగవంతమయ్యేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం ఆదేశించారు. సాంకేతిక కారణాలు చూపించి ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.