ADB: ప్రభుత్వ నిషేధిత గంజాయితో యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉట్నూర్ మండలంలోని రాముగూడలో దాడులు నిర్వహించి కుమ్ర సోనేరావు ఇంటి వెనుకాల ఉన్న అరటి పెరడిలో సుమారు 20 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. రైతుపై కేసు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వ పథకాలు రాకుండా కలెక్టర్ ప్రతిపాదించారు.
WGL: గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఓ యువతిపై అదే తండాకు చెందిన బదావత్ రవి సోమవారం లైంగిక దాడి చేయబోయినట్లు సీఐ మహేందర్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. విషయం తెలుసుకున్న యవతి కుటుంబ సభ్యులు రవి, అతడి భార్య, తల్లిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
VSP: నగరంలోని పెదవాల్తేరులో గల కరకచెట్టు పాలమాంబను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి పండుగ సందర్భంగా సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయతో రాష్ట్ర, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.
VSP: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తాత్కాలిక పదోన్నతుల సీనియార్టీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఓ కార్యాలయం నోటీస్ బోర్డ్లో కూడా ఈ లిస్ట్ ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే ఈనెల 18లోపు తెలియపరచాలని ఆయన కోరారు.
ప్రకాశం: కొమరోలు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశానికి అంగన్వాడి కార్యకర్తలు కూడా హాజరుకావాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం పై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
సమయానికి తినకపోవటం, పోషకాహార లోపం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మనం తీసుకునే కొన్ని ఆహారాలు ఆ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పికి అరటిపండు, మలబద్ధకం-బొప్పాయి, యాపిల్ తీసుకోవాలి. వికారం, వాంతులు- అల్లం, హైబీపీ-బీట్ రూట్, కీళ్లనొప్పి- అనాస, డీహైడ్రేషన్-తర్బూజ, నిద్రలేమి-చెర్రీలు, కండరాల అలసటకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి.
NTR: 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్-18 కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, మల్కబ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఈనెల 16వ తేదీన ఎంపిక చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) వీసీ ఎండీ గిరీషా పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయన్నారు.
KRNL: పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన ఉపాధికూలీ అడవి లక్ష్మన్న(58) సోమవారం కూలిపనిలో పాల్గొన్న సమయంలో ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురి కాగా చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ప్రాంతాల్లో శ్రమికులకు తగిన నీరు, మజ్జిగ వంటి సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగింధన్నారు.
KRNL: జిల్లాలో నాటుసారాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం ఆదోని పట్టణం శివారు కొండల్లోని నాటుసారా స్థావరాలను ప్రోహిబిషన్, ఎక్సైజ్ సీఐ సైదుల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, 365 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: వెల్దుర్తి సమీపంలోని లిమ్రాస్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం రుషిబాబు (14) మృతి చెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం తమ్ముడితో కలిసి పాలు పంపిణీకి బయలుదేరిన బాలుడు, కంటైనర్ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వారి బైక్ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడు విక్కీబాబు తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రకాశం: తాళ్లురులోని గుంటి గంగమ్మ జాతర తిరుణాల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి పరిశీలించారు. తిరుణాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిష్ఠ బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు ఎస్పీ సూచించారు.
MBNR: మరికల్ మండలంలో పాలమూరు ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కన్మనూరులో జెండా ఆవిష్కరణ చేసి మరికల్ మండల కేంద్రంలో వాల్మీకీ సంఘం సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మండలంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
IPL 2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నోపై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది.
AP: తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్లకు పోస్టింగ్ ఇచ్చారు. అంజనీ కుమార్కు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్గా, అభిలాష బిస్ట్కు ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్గా నియామకం చేసింది. ప్రస్తుతం చైల్డ్ కేర్ లీవ్లో అభిలాష బిస్ట్ ఉన్నారు.