PLD: దాచేపల్లి (M) సారంగపల్లి అగ్రహారంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైర్లను దొంగతనం చేశారు. గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లే లక్ష్యంగా దుండగులు ఈ పని చేసినట్లు స్థానికులు, రైతులు చెప్పుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విదేశీ పర్యటనకు ఎట్టకేలకు కోర్టు షరతులతో అనుమతి లభించింది. మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు జామీను, పర్యటన పూర్తి వివరాలు ముందుగా సమర్పించాలని ఆదేశించింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఆన్లో ఉంచి, జూలై 15లోపు భారత్కు రావాలని సూచించింది. తిరిగి వచ్చిన వారం రోజుల్లో కోర్టులో హాజరు కావాలని పేర్కొంది.
NLG: ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరవేయడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాల మండలం వెలిమినేడులో ఆదివారం జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. యువతే పార్టీకి బలమని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
రాత్రి CSK vs DCలో అజేయ సెంచరీ(115)తో రాణించిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన సంగతి తెలిసిందే. అవార్డ్ అందుకుంటున్న సందర్భంగా మాట్లాడుతూ.. చివరి 3 మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ తనపై నమ్మకముంచిన CSK ఫ్రాంచైజీ, టీమ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్కు శాంసన్ ధన్యవాదాలు తెలిపాడు. తనను ప్రోత్సహించిన కోచ్కు ఈ సెంచరీని అంకితం చేస్తున్నానని వెల్లడించాడు.
AP: ప్రముఖ సింగర్ ఆశాభోస్లే మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆశాభోస్లే మరణ వార్త విని బాధపడ్డా. అత్యధిక పాటలు పాడి చరిత్ర సృష్టించారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు మ్యూజిక్ ఇండస్ట్రీకి సేవలందించారు. భారతీయ సంగీత జగత్తులో ఆమె పాటలు తరతరాలపాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆశా కుటుంబానికి, ఆమె అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
BPT: పిట్టలవానిపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు అంటున్నారు. పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని, ఇసుక వాహనాలు అతి వేగంతో, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MNCL: లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ రమ కళ్యాణి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 74 మంది, ద్వితీయ రెండో సంవత్సరంలో 65 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారందరూ పాసయ్యారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో విద్యార్థిని సాయి త్రిణిత 468/470 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘గోపీచంద్ 33’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్కు టైం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 13 ఉదయం 11:17 గంటలకు గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి ‘భారత వర్ష’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కడప నగరంలో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ATP: ఐపీఎల్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లపై నిఘా పెంచినట్లు SP జగదీష్ హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రూపాల్లో బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తున్నాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేసి, ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని పేర్కొన్నారు.
KMR: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో మొత్తం 3,945 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 2,372 మంది ఉత్తీర్ణత సాధించి 60.13% ఫలితాలను సాధించారు. బాలుర విషయానికి వస్తే, 3,286 మందిలో కేవలం 1,200 మంది మాత్రమే పాస్ అయ్యి 36.52% ఉత్తీర్ణతకే పరిమితమయ్యారు. ఇక్కడ బాలికలు బాలుర కంటే దాదాపు 23% మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
ప్రకాశం: 2010కి ముందు నియమితులైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురంలోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ.. KGBV ఉపాధ్యాయులకు MTS వర్తింపజేయాలని, కరోనా సమయంలో మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
MBNR: ఇంటర్ ఫలితాల్లో జడ్చర్ల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని జేబా ఫిర్టోస్ అద్భుత ప్రతిభకనబరిచారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఆమె 1000కి 991 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం 87%, ప్రథమ సంవత్సరం 74% ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రిన్సిపల్ రాధా తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థినిని ఘనంగా అభినందించారు.
NLR: అల్లూరు మండలం ఇస్కపల్లి (చంద్రబాబు నగర్)లో కాపుల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. మత్స్యకారుల ఆహ్వానం మేరకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కాపులను అభినందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
NLG: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో చండూరుకు చెందిన భూతరాజు చంద్రస్మిత అద్భుత ప్రతిభ కనబరిచింది. చౌటుప్పల్ టీజీఆర్ఎస్ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఆమె 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి సత్తా చాటింది. ఈ సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఘనంగా అభినందించారు.