MBNR: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని TGUTAF జిల్లా అధ్యక్షులు రవికుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యుటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల మహాసభలు నిర్వహించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
NZB: సాలూర మండలంలోని ఖాజాపూర్ వాగుపై గల వంతెన రైలింగ్ దెబ్బతినడంతో ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ఏమాత్రం ఏమరుపాటుగా వాహనాలు నడిపినా ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ఎలాంటి ప్రమాదం జరగకముందే దెబ్బతిన్న రైలింగ్ను పునర్నిర్మించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని SI మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా సిద్ధవటంలో శుక్రవారం రాత్రి ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహంలో వస్తుండగా మద్యం సేవించినట్లు నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసామన్నారు.
NRML: భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను అలాగే కేసుల పురోగతిని తెలుసుకొన్నారు. అనంతరం పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. గ్రామాలలో గస్తీ, పెట్రోలింగ్ చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
MNCL: PM మోదీ రైతుల సంక్షేమార్థం రూ.42 వేల కోట్ల లాభదాయక పథకాలను ప్రారంభించడం జరిగిందని బెల్లంపల్లి KVK సమన్వయకర్త ప్రసూన తెలిపారు. శనివారం PM ధన ధాన్య కృషి యోజన కార్యక్రమం రైతులకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. రైతులు KVK కేంద్రం అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన సేవలు అందిపుచ్చుకోవాలన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండించి లాభాలు సాధించలన్నారు.
AP: PPP విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయంపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలేజీల నిర్మాణం పూర్తైతే 180 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే పేదవారికి మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. కాగా గడిచిన 16 నెలల్లో చేసింది ప్రారంభం మాత్రమేనని, చేయాల్సింది చాలా ఉందని తెలిపారు.
KDP: శనివారం కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన సారా ఇర్ఫాన్ మూడు సిల్వర్ మెడల్స్ సాధించింది. దీంతో విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు సారా ఇర్ఫాన్ ఎంపికయ్యారు. అండర్-14 ఇన్ లైన్ విభాగంలో రోడ్-1, రింగ్-3, రింగ్-4 కేటగిరిలో ప్రతిభను సాధించింది.
VZM: స్థానిక మ్యూజిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ – కం – సేల్స్ కు వినియోగదారుల నుండి విశేష స్పందన లభించిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మల జ్యోతి పేర్కొన్నారు. శుక్ర, శనివారాలలో 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రూ. 25,000 పైగా లబ్ధి పొందినట్లు ఆమె తెలిపారు. జీఎస్టీ చెల్లింపుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నమన్నారు.
BDK: పాల్వంచ సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం సందర్శించారు. రైతుల వద్ద నుంచి పాల సేకరణ కేంద్రం, విజయ డైరీ ద్వారా కేంద్ర ఏర్పాటు, సొసైటీ భవన పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తోపాటు పాలకవర్గం సభ్యులు రైతు సమస్యలపై కలెక్టర్కు వివరించారు.
KDP: అసలుకు నకిలీకి ఏ మాత్రం తేడా లేకుండా పచ్చ బ్యాచ్ నకిలీ మద్యం మార్కెట్లోకి తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మద్యం బాటిళ్లు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇందులో అసలు ఏదో, నకిలీ ఏదో పట్టుకుంటే రూ.పది లక్షలు ఇస్తామని సవాల్ చేశారు.
SKLM: ప్రజలు అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికి ఎంపీటీసీలకు గత 16 నెలల నుంచి వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న వాళ్లకు వేతనాలు ఇప్పించాలని మండల వైస్ ఎంపీపీ గునుపురం రామారావు కోరారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికలు వచ్చిన నోటిఫికేషన్ నుంచి ఎంపీటీసీలకు కనీసం రాజ్యాంగం ప్రకారము ఇవ్వవలసిన వేతనాలు కూటమి ప్రభుత్వం అందించలేదన్నారు.
KDP: కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షురాలు ఎన్.డీ విజయ జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ సెక్రెటరీ కుమార్ హాజరయ్యారు. రాబోయే లోకల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందించాలని వారు సూచించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ మొదలవలస చిరంజీవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.5 లక్షల మండల పరిషత్ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
WGL: సమాచార హక్కు చట్టంపై ప్రతీఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ICDS వరంగల్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి అన్నారు. GWMC 42వ డివిజన్ రంగశాయిపేటలోని అంగన్వాడీ కేంద్రాలలో సమాచార హక్కు చట్టంపై పిల్లల తల్లిదండ్రులకు శనివారం ఆమె అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు వినీత, యశోద, హైమావతి, ఆశ కార్యకర్తలు, తదితరులున్నారు
KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెంలో కంటే లక్ష్మి శనివారం ఉదయం కళ్లు తిరిగి పడిపోయింది. 108కి సమాచారం అందించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.