• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భూ సేకరణ వేగంగా జరగాలి: కలెక్టర్

VZM: ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూ సేకరణ వేగంగా జరగాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూసేకరణ‌పై రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షించారు. సుజల శ్రవంతి ప్రాజెక్ట్‌కు సేకరిస్తున్న భూమి గ్రామం వారీగా, సర్వే నెంబర్ వారీగా ప్రభుత్వ భూమి, డీ పట్టా, అసైన్డ్ భూమి వివరాలను సమర్పించాలన్నారు.

January 9, 2026 / 12:48 PM IST

ముగ్గులు వేసిన చిన్నారులు

NRPT: మరికల్ మండల కేంద్రంలో రెయిన్ బో ఉన్నత పాఠశాలల నిర్వహించిన రంగవల్లి ఆకట్టుకుంది. చిన్నారులు రంగురంగుల ముగ్గులు వేశారు. చిన్నారులు పతంగులు ఎగురవేసి సంక్రాత్రి సంబరాలను జరుపుకున్నారు. ఉత్తమంగా ముగ్గులు వేసిన చిన్నారులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో కరస్పాండెంట్ షఫీ, ప్రిన్సిపల్ సదా పాల్గొన్నారు.

January 9, 2026 / 12:47 PM IST

రాయవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

అన్నమయ్య: రాయవరం గ్రామ పంచాయితీ సర్పంచ్ షరీఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమాదేవి ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది సర్పంచ్ షరీఫ్‌ను శాలువాతో సన్మానించారు. మారుమూల గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.

January 9, 2026 / 12:46 PM IST

పల్లె దవాఖానాను తనిఖీ చేసిన సర్పంచ్

NZB: చందూర్ పల్లె దవాఖానాను శుక్రవారం మద్దూరి సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలతో వచ్చే పేద రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

January 9, 2026 / 12:46 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం’

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు నుంచి పల సమస్యల‌పై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు. ఈ వినతులను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

January 9, 2026 / 12:45 PM IST

కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్

NDL: బేతంచెర్ల పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీలోచాలా రోజులుగా ఉన్న వీధిలైట్ల సమస్యను పరిష్కరిద్దామని కాలనీకి వస్తే కమిషనర్ సిబ్బంది గాని రాలేదని మున్సిపల్ ఛైర్మన్ చలంరెడ్డి ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అంటే నగర పంచాయతీ కమిషనర్, సిబ్బంది లెక్కలేదంటే ప్రజల సమస్యలను మీరు ఏ విధంగాపరిష్కరిస్తారని అన్నారు కమిషనర్ సిబ్బంది పైరీజనల్ డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.

January 9, 2026 / 12:45 PM IST

లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మీ’ చెక్కుల పంపిణీ

KMM: మధిర మండలం మాటూరు పేట గ్రామానికి చెందిన మొండెం విజయకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కును ఇవాళ బీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, వైస్ ఎంపీపీ రావూరి శివ నాగ కుమారి కలిసి రూ. 1,11,116 విలువైన చెక్కును బాధితురాలికి అందజేశారు.

January 9, 2026 / 12:44 PM IST

ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భాను శ్రీ, క్లస్టర్ ఇంచార్జీలు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

January 9, 2026 / 12:43 PM IST

‘అర్హులందరికీ ఇండ్లు అందేలా కృషి చేస్తా’

ADB: నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తానని ఎవరు అదైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

January 9, 2026 / 12:43 PM IST

కవ్వాల్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీలు

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినిలకు ముగ్గుల పోటీలను, బాలురకు పతంగుల పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యమని ఉపాధ్యాయుడు తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఉపాధ్యాయుడు బిక్కు బహుమతులు అందజేశారు. ముగ్గులతో పండగ వాతావరణం నెలకొంది.

January 9, 2026 / 12:42 PM IST

సంక్రాంతి వేళ కదిరి పోలీసుల సూచనలు

సత్యసాయి: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి సూచించారు. ఇంట్లో నగదు, బంగారం ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. ఇంటికి సీసీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 డయల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

January 9, 2026 / 12:42 PM IST

విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు అలవర్చుకోవాలి: టీజీ

KRNL: విద్యార్థి దశ నుంచే సాహిత్యం, కళలపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. సదస్సులో ఆయన విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు అలవర్చుకోవాలని సూచించారు. కాలేజీలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందిర శాంతి పాల్గొన్నారు.

January 9, 2026 / 12:41 PM IST

‘చైనా మాంజా వాడకుండా, న్యాచురల్ దారాలు వాడాలి’

ADB: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పిల్లలు చైనా మాంజ వాడకుండా, న్యాచురల్ దారాలను వాడాలని జీడీపల్లె FSO ముంతాజ్, FBO రాధే శ్యామ్ అన్నారు. శుక్రవారం సోనాల మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో చైనా మాంజాపై అవగాహన కల్పించారు. చైనా మాంజా కారణంగా బైక్‌పై ప్రయాణించే వ్యక్తులకు, పక్షులకు కలిగే దుష్పరినామాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉన్నారు.

January 9, 2026 / 12:41 PM IST

‘వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా జరిగాయి’

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా జరిపినట్లు తెలిపారు. టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు. పది రోజుల్లో 7.83 లక్షలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని.. పదిరోజుల్లో హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు వచ్చినట్లు చెప్పారు.

January 9, 2026 / 12:41 PM IST

బాధితుడికి ఛైర్మన్ కేశవరెడ్డి ఆర్థిక సాయం

ATP: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద బోయ నల్లప్పకు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. గార్లదిన్నె మండలం ముంటిమడుగు గ్రామంలోని బాధితుని పరిస్థితి తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం కోసం ఈ మొత్తం అందించారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం సంతోషంగా ఉందని కేశవరెడ్డి పేర్కొన్నారు.

January 9, 2026 / 12:40 PM IST