• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం

ADB: ఆదిలాబాద్‌లోని ఓ ఛానెల్లో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన కంచు సుభాష్ కుటుంబానికి జర్నలిస్ట్ JAC ఆర్థిక సాయం అందించింది. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవడానికి జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ కలిసి రూ.52,100 నగదు జమచేసి వాటిని గురువారం సుభాష్ భార్యకు అందించారు.

February 20, 2025 / 12:47 PM IST

పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డిఇఓ

NRML: లక్ష్మణ్చందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డిఇఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పది పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు.

February 20, 2025 / 12:25 PM IST

డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలి

MNCL: బెల్లంపల్లి పట్టణం పోచమ్మ గడ్డ వద్ద కొనసాగుతున్న చెత్త డంపింగ్ యార్డ్ వెంటనే తరలించాలని లేనిపక్షంలో ఆటో డ్రైవర్లందరం రహదారిపై బైఠాయించి ధర్నా చేపడతామని ఆటో యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ గురువారం హెచ్చరించారు. వారు మాట్లాడుతూ.. నిత్యం వేలాదిమంది ప్రజలు, విద్యార్థులు ప్రయాణిస్తుంటారని దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

February 20, 2025 / 12:25 PM IST

తిరుమల ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు

TPT: తిరుమలలో మరోసారి విమానం కలకలం సృష్టించింది. ఆలయ గాలిగోపురం మీది నుంచి ఫ్లైట్ వెళ్లడంతో అధికారులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇది ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. కాగా ఇటీవల కూడా తిరుమల ఆలయం పైన విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తరచూ విమానాల రాకపోకలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

February 20, 2025 / 11:26 AM IST

‘ఛావా’కు పన్ను మినహాయింపు.. ఎక్కడంటే?

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది.

February 20, 2025 / 11:24 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి

PDPL: సింగరేణి సంస్థ ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికుడు ఊరగొండ రాజకుమార్ గురువారం ఉదయం కలవచర్ల గ్రామంలోని భోక్కల వాగు బ్రిడ్జిలో పడి మరణించాడు. పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిలో ఈ దుర్ఘటన జరిగినది. మంథని సీఐ రాజు, ఎస్సై దివ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

February 20, 2025 / 11:22 AM IST

కొత్త సీఎం రేఖా గుప్తాకు నాలుగు సవాళ్లు

ఢిల్లీ నూతన సీఎంగా నేడు రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె సీఎం అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త సీఎంపైనే ఉండనుంది. మహిళల ఖాతాల్లోకి రూ.2500, యమునా నది శుద్ధి, పథకాలకు నిధులు, రోడ్ల మరమ్మతు-చెత్త కుప్పల నుంచి విముక్తి వంటి నాలుగు పెద్ద సవాళ్లను ఎదుర్కోనున్నారు.

February 20, 2025 / 11:18 AM IST

రేపు గూడూరులో జాబ్ మేళా

TPT: గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఈనెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 20, 2025 / 11:14 AM IST

త్వరలో సహాయ ఉపకరణాలు పంపిణీ

MNCL: దివ్యాంగులకు త్వరలో సహాయ ఉపకారణాలను పంపిణీ చేయనున్నామని వైద్య అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ రైతు వేదికలో దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకారణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. వారి సదరం సర్టిఫికెట్లను వైద్యులు పరిశీలించారు.

February 20, 2025 / 11:12 AM IST

కురవి ఆలయంలో హీరో గోపీచంద్ పూజలు

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయాన్ని ప్రముఖ సిని హీరో గోపిచంద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గోపిచంద్‌కు ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, దర్మకర్త చిన్నం గణేష్‌లు అందజేశారు. కాగా, ఆయన అభిమానులు, స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు.

February 20, 2025 / 11:06 AM IST

గన్నవరం మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గురువారం వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో వల్లభనేని వంశీ ఏ71 ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

February 20, 2025 / 11:01 AM IST

కాణిపాకం ఆలయానికి విరాళం

CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు దాత విరాళమందించారు. విజయవాడకు చెందిన కళ్యాణ వెంకట గణపతి రూ. లక్ష నగదును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు.

February 20, 2025 / 10:47 AM IST

శునకాలకు కుటుంబ నియంత్రణకు చర్యలు

CTR: చిత్తూరు మున్సిపల్ షెడ్డులో నూతనంగా నిర్మించిన శునకాల కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జిల్లాలో 7వేల శునకాలు ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ చేయడమే లక్ష్యమన్నారు. గతంలో ఈ ప్రక్రియకు తిరుపతికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం చిత్తూరులోని కేంద్రం ప్రారంభించామన్నారు.

February 20, 2025 / 10:43 AM IST

అధికారులు తిట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.

February 20, 2025 / 10:34 AM IST

ప్రజల భద్రత వారి చేతుల్లోనే: ఎస్సై

CTR: ప్రజల ఇంటి భద్రత ఇప్పుడు వారి చేతిల్లోనే ఉందని కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో సీసీ కెమెరాలు నేర నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. రూ.2000లకు కూడా కెమెరాలు అందుబాటులో వున్నాయని ఎవరైనా సీసీ కెమెరాలు అమర్చుకోవాంటే తమను సంప్రదించాలని కోరారు.

February 20, 2025 / 10:30 AM IST