ప్రకాశం: కనిగిరి పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చిలకపాటి లక్ష్మయ్య అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి వైద్యశాలలో లక్ష్మయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు.
ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. బెజ్జి, చింతగుప్ప అటవీప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: లింగపాలెం మండల విద్యాశాఖ అధికారిగా కె. వెంకట దుర్గారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన రామారావు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో వెంకట దుర్గారావు చేరారు. నూతన విద్యాశాఖాధికారికి ఎంఈవో 2 రవీంద్ర సాదర స్వాగతం పలికారు. విద్యాభివృద్ధికి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
ADB: ఈనెల 25, 26వ తేదీల్లో జిల్లా కేంద్రంలో CITU రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. శనివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు.
NGKL: అచ్చంపేట పట్టణంలో నేడు ఆదివారం బీకే ఫంక్షన్ హాల్లో 63 జంటల సామూహిక వివాహాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని కౌన్సిలర్ శివ తెలిపారు. ఒకే వేదికపై 63 జంటలు ఒక్కటి కానున్నాయని ఆయన పేర్కొన్నారు.
KNR: కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికిగానూ పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రో.డి. వరలక్ష్మి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఎంకాం, ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను కళాశాలలో ఈ నెల 17వ తేదీ సా. 5గం.లలోపు అందజేయాలన్నారు.
MNCL: తమకు పక్కా పాఠశాల, హాస్టల్ భవనం నిర్మించి తమను సిర్పూర్కి పంపించాలని బెల్లంపల్లి COE ఎదుట బైఠాయించి సిర్పూర్ గురుకుల విద్యార్థులు ఆదివారం ధర్నా చేశారు. తమ పాఠశాల భవనం శిథిలావస్తలో ఉందని తమను బెల్లంపల్లి COE కి పంపించారన్నారు. 5నెలలు గడిచిన తమను సిర్పూర్ పంపించకపోవడంతో తాము ఇక్కడ ఉండలేమంటూ విద్యార్థులు ధర్నా చేశారు.
KDP: నగర శివారులోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 17వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ 31 రోజులు బ్యూటీ పార్లర్ 35 రోజులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.
ADB: పోలీసులు ప్రజల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం బోథ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
SRPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం కలిగిన, ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి (ఏఈ) మల్లారెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. నిన్న సాయంత్రం నూతనకల్ మండలంలోని ఎర్రపహాడ్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆయన తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు 17 శాతం లోపు తేమ ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు.
ADB: బజార్హత్నూర్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ శనివారం రాత్రి పర్యటించారు. గ్రామానికి చెందిన చెవుల రత్నాభాయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న MP నగేశ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు. ఎంపీ వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ATP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న రాప్తాడు నియోజకవర్గానికి రానున్నారు. స్థానిక వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి వారి కుటుంబంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెలిప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు నుంచి రాప్తాడుకు రానున్నారు.
NZB: నవీపేట్(M) నాలేశ్వర్లో గోదావరిలో మునిగి వ్యక్తి మృతి చెందినట్లు నవీపేట్ ఎస్సై తిరుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. ముత్యంపల్లి గ్రామానికి చెందిన చిన్న సాయిలు తల్వేదలో శుక్రవారం పెళ్లికి వెళ్లాడు. శనివారం ఉదయం లేచి కాలకృత్యాలకు గోదావరి వైపు వెళ్లి కాలుజారి పడి నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు.