NRML: నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలోనీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. భారత సైనికులకు ఆత్మ స్థైర్యం నింపాలని ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మండల, గ్రామ కేంద్రాల్లో గల ఆలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కృష్ణా: వత్సవాయి మండలం మక్కపేటలో కొలువైన లక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: విడదల రజినీ మహిళ అని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలన్న విషయంపై దృష్టి పెట్టిందన్నారు.
SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖయ్యుం మరణించగా ఆదివారం జరిగిన ఆయన అంత్యక్రియలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ధైర్యం చెప్పి పరామర్శించారు. మంచి నాయకుడిని కోల్పోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
KMM: తాను బతికి ఉండగానే మరణ ధ్రువీకరణ పత్రంతో తన భూమిని రెవెన్యూ అధికారులు మరొకరి పేర పట్టా చేశారని ఓ వ్యక్తి పోలీసులను ఆదివారం ఆశ్రయించాడు. ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన సాయిల వీర వెంకయ్య అనే వృద్ధుడికి చెందిన 2.11 ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ పట్టా చేయించుకుంది.
కోనసీమ: ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు విలువ కట్టలేమని, ఆ ప్రేమ అపూర్వమైనదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రపంచ మాతృ దినోత్సవ సందర్భంగా ఆదివారం రామచంద్రపురం మండలం చింతకుంట చెరువులోని చంద్రబాబు నగర్కు చెందిన వెంగళ సత్యవతి, మంగ, పలువురు మహిళలను మంత్రి పూలమాల, దుశ్శాలువతో సత్కరించి, వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
SRD: నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలోని భూ లక్ష్మమ్మ తల్లి దేవాలయం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకలతో పాటు పూజా కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుమలలో రాష్ట్రస్థాయి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్(FSSAI) ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కాగా తిరుపతిలో నిర్మించే ల్యాబ్ ఏర్పాటుకు సుమారు రూ.19.84 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అధికారులు పేర్కొన్నారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో ఆత్మకూరు వీధిలో వెలసిన దశభుజ వినాయకుడిని రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆకుల శ్రీ వెంకట శేష సాయి దంపతులు దర్శించుకున్నారు. వారికి ప్రధాన అర్చక పురోహితులు శంకర్ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ అర్చకులు దశభుజ వినాయకుడి చిత్రపటాన్ని రిటైర్డ్ జడ్జికి అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోనసీమ: రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కంకణ బద్దులై కృషి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం పెద్ద హరిజనపేటలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందించేందుకు 96.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్(వాటర్ ట్యాంక్)ను ప్రారంభించారు.
ఎన్టీఆర్: డీసీసీబీ ఛైర్మన్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం రఘురాం నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించి, కొండపల్లి బొమ్మను బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సారే సమర్పించారు. ఆమెకు ఆలయం వద్ద అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె సారే సమర్పించి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
MBNR: జిల్లాలో గరిష్ఠ వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నవాబుపేటలో 40.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భూత్పుర్ మండలం కొత్తమొల్గర 42.2 డిగ్రీలు, దేవరకద్ర 40.0 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 39.9 డిగ్రీలు, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
TPT: చిట్టమూరు మండల పరిధిలోని కొత్త గుంట సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలవ్వగా.. ఆటో మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్కు తరలించారు.
KMM: 35 బీఎన్ఎస్ఎస్/41ఏ సీఆర్పీసీ, అడ్వకేట్ అమెండమెంట్ డ్రాఫ్ట్ బిల్ సవరణ చేయాలని కోరుతూ ఖమ్మం వచ్చిన పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు సహస్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వాహకులు, అడ్వకేట్ తాళ్లూరి దిలీప్ చౌదరి వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ నోటరీలో తెలంగాణకు చెందిన 1,900 మంది నిరీక్షణలో ఉన్నారని, వారందరికీ అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.