• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించారు. ఈ సందర్భంగా పిచ్చాటూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నూతన యూనిఫామ్ దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

June 13, 2025 / 12:54 PM IST

గుంతలమయంగా రోడ్డు.. వాహనాదారుల ఇక్కట్లు

ATP: గుత్తిలోని పలు సర్కిల్‌లో రోడ్డు గుంతల మయమైంది. గత వారం రోజుల క్రితం గుత్తిలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు గుంతలు పడ్డ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే, గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్డు కోతకు గురై గుంతల మయం కావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

June 13, 2025 / 12:30 PM IST

రోడ్డు ప్రమాదంలో బస్సు ధ్వంసం

CTR: చిత్తూరు-బెంగళూరు RTC బస్సు ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం ధాటికి బస్సు ఓ వైపు పూర్తిగా ధ్వంసం అయింది. సీట్లు చెల్లా చెదురుగా మారాయి. రక్తపు మరకలతో ఆ ప్రాంతం విషాదకరంగా మారింది. ఈ ఘటనలో గాయపడ్డ 16 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

June 13, 2025 / 12:29 PM IST

మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ పట్టణ, మండల కార్యదర్శిలు రాము, రామదాసు మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని డ్రైనేజీ కాలువలో చెత్తచెదారం పేరుకుపోయిన దోమల బెడద, దుర్వాసన వస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్‌మియాకు వినతి పత్రం అందజేశారు.

June 13, 2025 / 12:15 PM IST

ఆ రోజున ‘జన నాయగన్’ గ్లింప్స్ రిలీజ్!

తమిళ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో H. వినోద్ దర్శకత్వంలో ‘జన నాయగన్’ మూవీ రాబోతుంది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రాబోతుంది. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న స్పెషల్ వీడియోను షేర్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

June 13, 2025 / 11:20 AM IST

విజృభిస్తున్న విషజ్వరాలు.. నివారణ చర్యలెక్కడ?

KMM: జిల్లాలో వాతావరణం మారడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర, బోనకల్, ఏన్కూరు తదితర మండలాల్లో విష జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని స్థానికులు తెలిపారు. విషజ్వరాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

June 13, 2025 / 11:14 AM IST

ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ASR: డుంబ్రిగుడ మండలంలోని ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన కొండలరావు కుటుంబానికి యూటీఎఫ్ నాయకులు పరామర్శించారు. వారి కుటుంబానికి రూ.24వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వారి కుటుంబానికి, ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ యూటీఎఫ్ అండగా ఉంటుందని అన్నారు.

June 13, 2025 / 11:13 AM IST

అర్జీలను స్వీకరించిన అధికారులు

MNCL: భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి సదస్సులని దండేపల్లి తహసీల్దార్ రోహిత్, డీటీ మాధవి అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేటలో తహసీల్దార్, చింతలపల్లిలో డీటీ రెవెన్యూ సదస్సులలో పాల్గొన్నారు. ప్రజలు, రైతుల నుండి భూ సమస్యలపైన అర్జీలను స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

June 13, 2025 / 11:10 AM IST

కిలిమాంజరో పర్వతాన్ని అధిరోహించిన నిర్మల్ వాసి

NRML: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాయి ప్రసాద్ ఆఫ్రికా లోని ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించారు. గతంలో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన సాయి ప్రసాద్, కిలిమంజారో శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శుక్రవారం వారిని ప్రత్యేకంగా అభినందించారు.

June 13, 2025 / 11:05 AM IST

ఎలమంచిలిలో తాగునీటిలో క్లోరిన్ శాతం పరిశీలన

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో చినగొల్లలపాలెంలో సరఫరా అవుతున్న తాగునీటిలో క్లోరిన్ శాతాన్ని శుక్రవారం ఉదయం స్థానిక మున్సిపల్ తాగునీటి విభాగం ఏఈ గణపతిరావు పరిశీలించారు. నీటిలో ఉండవలసిన పరిమాణం (0.50 ఎంఎం)లోనే క్లోరిన్ ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

June 13, 2025 / 11:01 AM IST

అనకాపల్లిలో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

అనకాపల్లి జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.108.35గా ఉంది. నిన్నటితో పొల్చితే 22 పైసలు తగ్గింది. పది రోజుల నుంచి పెట్రోల్ ధర రూ.108.35-108.69 మధ్యలో ఉంటోంది. అదేవిధంగా డీజిల్ లీటర్ రూ.96.22 కాగా నిన్నటితో పోల్చితే కొంతమేర తగ్గింది. పది రోజుల నుంచి డీజల్ రేటు 96.22-96.54 మధ్యలో ఉంటోంది.

June 13, 2025 / 10:58 AM IST

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

SRD: బస్సు పాస్ చార్జీల పెంపకం నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ బస్ పాస్ చార్జీల పెంపు వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతారని చెప్పారు. చార్జీలు తగ్గించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

June 13, 2025 / 10:56 AM IST

వాడపల్లి వెంకన్న అన్నదాన భవన నిర్మాణానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి అమలాపురం వాస్తవ్యులు వరద శరన్ కుమార్, అమృత దంపతులు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దాతలకు ఆలయ సిబ్బంది స్వామి చిత్ర పటం అందజేశారు.

June 13, 2025 / 10:45 AM IST

విత్తన దుకాణాలు అకస్మిక తనిఖీ చేసిన ఏవో

ప్రకాశం: తాళ్లూరు మండలంలోని పలు విత్తన దుకాణాలను వ్యవసాయాధికారి ప్రసాద రావు శుక్రవారం అకస్మిక తనిఖీ నిర్వహించారు. తాళ్లూరు, తూర్పుగంగవరంలలో పలు దుకాణాలు పరిశీలించి శ్యాంపిల్స్ తీసారు. పరీక్షల నిమిత్తం రీజనల్ కోడింగ్ కేంద్రానికి పంపనున్నట్లు చెప్పారు. డీలర్లు బాధ్యతాయుతంగా విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు అందించాలని తెలిపారు.

June 13, 2025 / 10:36 AM IST

శ్రీకాళహస్తిలో షర్మిల నేటి పర్యటన రద్దు

TPT: శ్రీకాళహస్తిలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన రద్దు అయంది. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఆమె పర్యటన రద్దు అయినట్లు పట్టణంలోని ఆ పార్టీ నాయకులు తెలిపారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు.

June 13, 2025 / 10:35 AM IST