PDPL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 98 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4829 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 4735 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 94 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.