• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాత్రి 10 గంటల వరకు పాన్ షాపులు బంద్ చేయాలి: ఏసీపీ

PDPL: పట్టణంలోని పాన్ షాపు యజమానులతో ACP జి. కృష్ణ బుధవారం సమావేశం నిర్వహించారు. రాత్రి వేళలో తిరుగుతున్న ఆకతాయిలు, యువకులకు అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యంతో పట్టణంలో ఉన్న పాన్ షాప్లను రాత్రి 10లోపే మూసివేయాలని పాన్ షాప్ యాజమానులను ఆదేశించారు. అలాగే ఎలాంటి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మడం, హుక్కా పాయింట్లు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 12, 2024 / 04:17 AM IST

సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన రాష్ట్ర చీఫ్ విప్

GNTR: వినుకొండ పట్టణంలో ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. పేదల అభ్యున్నతికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జీవి పేర్కొన్నారు. వినుకొండ పాస్టర్స్ కాలనీ ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.

December 12, 2024 / 04:17 AM IST

“బీర్ల ఐలయ్యపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు’

నల్గొండ: బీర్ల ఐలయ్యపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ అన్నారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏజాజ్ పాల్గొన్నారు.

December 12, 2024 / 04:16 AM IST

దేశంలో ఏ పార్టీకి దక్కని ఘనత టీడీపీకి దక్కింది: ఎమ్మెల్యే సౌమ్య

ఎన్టీఆర్: 70 లక్షల సభ్యత్వాలతో దేశంలో ఏ పార్టీకి దక్కని ఘనత టీడీపీకి దక్కిందని ఎమ్మెల్యే సౌమ్య తంగిరాల బుధవారం తన అధికారిక FB ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో గత 8 రోజులలోనే 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని ఆమె తెలిపారు. కేవలం రూ.100 సభ్యత్వ రుసుముతో టీడీపీ తన కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాదబీమా సౌకర్యం అందిస్తోందని సౌమ్య స్పష్టం చేశారు.

December 12, 2024 / 04:15 AM IST

రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ

VZM: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు బుధవారం ఎస్‌.కోట మండలం పెద ఖండేపల్లి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 45 రోజుల్లో భూ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ అరుణ్‌ కుమారి తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

December 12, 2024 / 04:15 AM IST

‘ఈనెల 15 లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలి’

KDP: రైతులు ఈనెల 15లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు అన్నారు. చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గలపల్లె, బోడెద్దులపల్లె గ్రామాల్లో బుధవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి పంటకు ఈనెల 31 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుటకు అవకాశం ఉందని, మిగిలిన పంటలకు 15 లోపు ప్రీమియం చెల్లించాలన్నారు.

December 12, 2024 / 04:14 AM IST

కాలనీలలో బోర్లు మోటారు ఏర్పాటు

NLR: వింజమూరు మండలం శాతనవారిపాలెం ఎస్సీ కాలనీ, జిబి కేఆర్ కాలనీలలో పంచాయతీ నిధులతో బోర్లు వేసి మోటార్లను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి కాలనీ వాసులు సర్పంచ్ నల్గొండ సృజనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా కాలనీలో ఏర్పడిన నీటి సమస్యకు పరిష్కారం చూపించమన్నారు. తాగునీటి పైపులైన్ల పనులు కూడా వేగవంతం చేసినట్లు తెలిపారు.

December 12, 2024 / 04:14 AM IST

వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన 5 నెలల చిన్నారి

JGL: కోరుట్లకు చెందిన శీలం శ్రీకృతి అనే 5 నెలల చిన్నారి 3 నెలల వయసు నుండే పండ్లు, కూరగాయలు, జంతువుల బొమ్మలను గుర్తుపట్టి “నోబుల్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్” సాధించింది. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులు వంశీ కృష్ణ, పావని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్‌ను కలెక్టర్ చాంబర్‌లో బుధవారం కలువగా.. కలెక్టర్ చిన్నారిని అభినందించారు.

December 12, 2024 / 04:13 AM IST

‘మహిళా మీ కోసం.. కార్యక్రమం వినియోగించుకోండి’

GNTR: మహిళల సంరక్షణ కోసం గుంటూరు జిల్లా పోలీస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని తాడికొండ మండల పరిధిలోని మహిళలు వినియోగించుకోవాలని సీఐ వాసు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాత్రి వేళల్లో మహిళలు ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వారిని గమ్యస్థానానికి చేర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు.

December 12, 2024 / 04:12 AM IST

పాల వ్యాన్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: పాల వ్యాన్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన చక్రినాయక్ బుధవారం రాయచోటి పెద్దబిడికిలో జరిగిన తన అన్నపెళ్లికి వెళ్ళాడు. సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు టోల్ ప్లాజా వద్ద పాలవ్యాను బైకును ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన...

December 12, 2024 / 04:11 AM IST

REF రాష్ట్ర మహిళా కార్యదర్శిగా సాయి ప్రసూన

NLR: ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (REF)లో వాకాడు మండలం కల్లూరు పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీ సాయి ప్రసూన రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర యూనియన్ సభ్యులతో కలసి తీర్మానించి ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు.

December 12, 2024 / 04:10 AM IST

జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిరసన

KDP: ‘నువ్వు మనిషివేనా..మోహన్ బాబు’ అని టీజేఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుండుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై నటుడు మంచు మోహన్ బాబు దాడిని టీజేఎఫ్ నేతలు ఖండించారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చెయ్యాలన్నారు.

December 12, 2024 / 04:09 AM IST

రెవెన్యూ సదస్సులో పాల్గొన్న డిప్యూటీ కలెక్టర్

GNTR: వినుకొండ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మండలంలోని నరగాయపాలెంలో బుధవారం రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు. గ్రామంలోని రైతులు, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

December 12, 2024 / 04:09 AM IST

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని SPR హిల్స్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆద్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. మంత్రి… క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

December 12, 2024 / 04:08 AM IST

‘అన్నదాతకు అండగా వైసీపీ’

KDP: రాష్ట్రంలో రైతులకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 13న చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి కడపలోని వైసీపీ కార్యాలయంలో పోస్టర్‌ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరసనలు చేపడుతున్నామన్నారు.

December 12, 2024 / 04:08 AM IST