JN: జిల్లాలో ట్రాన్స్జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్జెండర్లకు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ.2.25 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు పునరావాస పథకం కింద 100 శాతం సబ్సిడీతో అందించినట్లు పేర్కొన్నారు
BHPL: జిల్లాలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర తెలిపారు. BC, EBC విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే స్కాలర్షిప్ జమ కాదని స్పష్టం చేశారు. ఆధార్ సీడింగ్ త్వరగా చేసుకోవాలన్నారు.
GDWL: జిల్లాకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆదివారం రానున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్ నాయక్ కూడా హాజరవుతారని జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు.
VZM: పట్టణంలో స్దానిక కోట వద్ద ఆదివారం ఉదయం 6.30 నుండి 8.30 వరకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ సహాయ కమీషనర్ కిల్లాన అప్పలరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవితంతో సతమతమవుతున్న ప్రజానీకానికి మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన దేవాదుల ప్రాజెక్ట్ను సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం, మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
HNK: భీమదేవరపల్లి మండల ప్రజల కోసం స్థానిక మోడల్ స్కూల్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షల కౌంటర్లు, జనరల్ ఫిజీషియన్ విభాగం, ఎముకల శస్త్ర చికిత్స విభాగాల్లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్లను కోరారు.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం కప్ 2025-26 రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అర్చరీ విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.
వరంగల్ పట్టణ కేంద్రంలోని కొత్తవాడ, BT బజార్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంత దారుణంగా చెత్త పేరుకుపోతే ఏం చేస్తున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏమీ చేయట్లేదా?” అని మండిపడ్డారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు.
సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ATP: మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తుంగభద్రా నదీతీరంలో వెలసిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు.
AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు తూ.గో. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, NTR, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
W.G: ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం పిలుపునిచ్చారు. శనివారం ఆకివీడులోని సీపీఎం ఏరియా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా స్థాయిలో పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జపాన్లో జరుగుతున్న ఆసియా క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో భారత్ నాలుగు పతకాలు సాధించింది. 10 కిలో మీటర్ల పరుగు పోటీలో హర్మన్జ్యోత్ రజతం గెలుచుకున్నాడు. టీమ్ పోటీల్లో భారత్ మూడు పతకాలు కైవసం చేసుకుంది. అండర్-20లో మహిళలు, పురుషుల జట్లు కాంస్యం గెలిచాయి. మహిళల 10 కిలోమీటర్ల టీమ్ విభాగంలో భారత బృందం కంచు నెగ్గింది.
SKLM: గ్రామాల పరిశుభ్రతలో, మౌలిక సదుపాయాల నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన హీరోలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు .
AKP: మునగపాక మండలం నాగులపల్లి పీఏసీఎస్ సభ్యుడు రంగాల గురువు నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కుటుంబానికి రూ. రెండు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ వై. వెంకట భాస్కరరావు మాట్లాడుతూ.. సభ్యులందరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. సీఈవో మల్ల స్వామి పాల్గొన్నారు.