AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు తూ.గో. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, NTR, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.