ATP: అనంతపురంలోని నేషనల్ పార్కులో పర్యటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అక్కడ పనిచేసే సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. సామాన్య కార్మికులతో కలిసి టిఫిన్ చేస్తూ వారి కుటుంబ యోగక్షేమాలను, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి తమను ఇలా గుర్తించలేదని, ఎమ్మెల్యే స్వయంగా తమతో కలవడంపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.