సత్యసాయి: సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటరమణప్ప (70) అనారోగ్యంతో మరణించారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ వెంకటేష్, టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ, తదితరులు వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల, టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.