VSP: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) వీగిపోవడంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వర్మ హర్షం వ్యక్తం చేశారు. శనివారం జగదంబ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతతో అధర్మం ఓడి ధర్మం గెలిచిందన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో విపక్షాల ఏకతాటిపైకి రావడం చారిత్రాత్మకమన్నారు.