MNCL: చదువే మనిషికి జీవం కావాలని, విద్యను ఇష్టపడుతూ చదవాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రేరణాత్మక వక్త, రాష్ట్రపతి అంతర్జాతీయ అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అన్నారు. మంగళవారం జైపూర్ మండలం టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం “చదువు.. బడి.. తల్లిదండ్రులు.. పరీక్షలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ASF: జిల్లా అభివృద్ధికి సీపీఎం జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించమని కలెక్టర్ హరితకు వినతి పత్రం సమర్పించారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి రంగాల్లో సమస్యలపై దృష్టి సారించి పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ, సైన్స్ సెంటర్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
ASF: జిల్లా అభివృద్ధికి సీపీఎం జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించమని కలెక్టర్ హరితకు వినతి పత్రం సమర్పించారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి రంగాల్లో సమస్యలపై దృష్టి సారించి పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ, సైన్స్ సెంటర్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
VKB: జిల్లా వ్యాప్తంగా 8వ విడత ఉచిత గాలికుంట వ్యాధి నివారణ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. వికారాబాద్ పశువైద్య సిబ్బంది ఇప్పటివరకు 110 గేదెలకు, 15 ఆవులకు టీకాలు వేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జడ్పి సీఈవో ఎల్లయ్య పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠాలతో పాటు మత ప్రచారం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయులు మత ప్రచారం నిర్వహించడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని DEO స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
NZB: అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకాంక్షించారు. మంగళవారం సాయంత్రం బోధన్ పరిధిలోని ఆచన్పల్లిలో ముఫీ అతిక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ, ఇది ఆత్మపరిశీలన చేసుకునే సమయమని పేర్కొన్నారు.
GDWL: అయిజ మండలం చిన్నతాండ్రపాడు యువకుడు భరత్ కుమార్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా భరత్ కుమార్ పురుగుమందు తాగాడు. ఆ విషయాన్ని గుర్తించిన వెంటనే అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు.
BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఈనెల 12న నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కోసం కొత్తగూడెం క్లబ్లో జరగనుంది. ఈ ఏర్పాట్లను కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
MHBD: నర్సింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీచేసారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. అలాగే పలువురు విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.
నల్లగొండలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శేఖర్ ఈవోగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్లో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నాడు. ఆ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తోపాటు పలువురు అభినందించారు.
SRPT: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై సైదులు అనే యువ రైతు మృతి చెందాడు. మంగళవారం చివ్యెంల మండలం వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సైదులు, కరెంట్ సరఫరాను సరిచేసే క్రమంలో ప్రాణాలు వదలడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
HYD: మహిళా సాధికారతలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భూమిపూజ చేశారు. నగరంలో మంజూరైన 4 హాస్టళ్లలో భాగంగా దీనిని నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు, ఉద్యోగినులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
SRD: నారాయణఖేడ్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్ వారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం గ్రామపంచాయతీలో రోడ్లు శుభ్రత, మురికి కాలువల్లో పూడిక, చెత్తాచెదారం తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగాయి. మండలంలోని లింగాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి పనులను పర్యవేక్షించారు. గ్రామ స్వచ్ఛత కోసం ప్రజలు సహకరించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని KGBV, మూకమామిడి ఏకలవ్య పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, భోజన నాణ్యత, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. లక్ష్య సాధన కోసం కష్టపడి చదివి రాబోయే పరీక్షల్లో విజయం సాధించాలని ప్రోత్సహించారు.