• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం’

KNR: సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మానకొండూకర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఆయన 181 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను అన్ని వర్గాల ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు.

April 6, 2026 / 07:18 PM IST

‘ప్రజావాణి దరఖాస్తుల్లో అలసత్వం సహించేది లేదు’

BHPL: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను హెచ్చరించారు. సోమవారం IDOC కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 80 దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేశారు. ఈ సందర్భంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఉన్నారు.

April 6, 2026 / 07:14 PM IST

పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

WNP: రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా మంజూరు చేసిన అభివృద్ధి పనులను 100% గ్రౌండింగ్ చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమక్షించారు. ముఖ్యమంత్రి రూ.879.80 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలిపారు.

April 6, 2026 / 07:14 PM IST

‘ఇంజనీరింగ్ పనులు వేగవంతం చేయాలి’

BDK: కొత్తగూడెంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ పనులపై కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు. మంజూరైన పనుల్లో ఆలస్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీరు, రోడ్లు, అంగన్వాడీ, పాఠశాలలు వంటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. శాఖల సమన్వయంతో పనులు గడువులో పూర్తిచేయాలని సూచించారు.

April 6, 2026 / 07:12 PM IST

‘డేవిల్ ఫిష్‌లతో జీవనోపాధికి దెబ్బ’

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువులో మత్స్యకారులు చేపల వేట కొనసాగించి సుమారు 5 టన్నుల డెవిల్ ఫిష్‌లను పట్టుకున్నారు. కాల్వల ద్వారా చేరిన ఈ విదేశీ చేపలు చెరువులోని ఇతర చేపలను తినేస్తుండటంతో, తమ జీవనోపాధి దెబ్బతింటోందని గ్రామంలోని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వీటిని తొలగించి తమను ఆదుకోవాలని కోరారు.

April 6, 2026 / 07:09 PM IST

‘డేవిడ్ ఫిష్ లతో జీవనోపాధికి దెబ్బ’

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువులో మత్స్యకారులు చేపల వేట కొనసాగించి సుమారు 5 టన్నుల డెవిల్ ఫిష్‌లను పట్టుకున్నారు. కాల్వల ద్వారా చేరిన ఈ విదేశీ చేపలు చెరువులోని ఇతర చేపలను తినేస్తుండటంతో, తమ జీవనోపాధి దెబ్బతింటోందని గ్రామంలోని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వీటిని తొలగించి తమను ఆదుకోవాలని కోరారు.

April 6, 2026 / 07:09 PM IST

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అదనపు కలెక్టర్

WGL:జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ సహకారంతో ఖిల్లా వరంగల్ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, MLA KR నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటకు సరైన ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

April 6, 2026 / 07:08 PM IST

ప్రజావాణిలో 98 దరఖాస్తుల స్వీకరణ

MDK: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో ఎల్లయ్యలతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 98 దరఖాస్తులు స్వీకరించారు.

April 6, 2026 / 07:06 PM IST

రేపు పరిగికి హరీశ్ రావు

VKB: పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి రేపు ఉదయం 9 గంటలకు మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా 1200 ఎకరాల భూమిని కోల్పోతున్న కాడ్లాపూర్, రాపోల్ గ్రామ రైతులను ఆయన పరామర్శించనున్నారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.

April 6, 2026 / 07:05 PM IST

ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు: కలెక్టర్

KMM: ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించి, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఉద్యోగుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులను సన్మానించారు.

April 6, 2026 / 07:02 PM IST

‘పేదల సమస్యల పరిష్కారమే సీపీఐ లక్ష్యం’

MDCL: నిరుపేద ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. అల్వాల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో యాప్రాల్, కౌకూర్, మచ్చబొల్లారం ప్రాంతాల్లో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు.

April 6, 2026 / 07:00 PM IST

EVM గోడౌన్ ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

HNK: రాష్ట్రంలో EVMల భద్రతను మరింత బలోపేతం చేయడానికి నూతన గోడౌన్ నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవాళ సుబేదారి ప్రాంతంలోని రెడ్ క్రాస్ సమీపంలో EVM, VVPAT యంత్రాలను భద్రపరిచేందుకు నిర్మించిన నూతన గోడౌన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 06:52 PM IST

మండల స్థాయి సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

NZB: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే మండల స్థాయి సభలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈమేరకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామ సభలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు

April 6, 2026 / 06:52 PM IST

చిన్నారిని రక్షించిన యువకుడిని అభినందించిన సీపీ

HYD: ఆపదలో ఉన్న చిన్నారిని తన సమయస్ఫూర్తితో రక్షించిన మహ్మద్ ఫిరోజ్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. బషీర్ బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఫిరోజ్‌ను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

April 6, 2026 / 06:49 PM IST

‘సూరవీడులో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు చేయాలి’

MLG: జిల్లా సూరవీడు పంచాయతీలో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు చేయాలని సర్పంచ్ ఇర్ఫా మురళి అధికారులకు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వోలను కలిసి గ్రామ సమస్యలను వివరించారు. సూరవీడు, కాలనీలలో కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మించాలని కోరారు. కె.కొండాపురంలో కొత్త పాఠశాల భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

April 6, 2026 / 06:46 PM IST