NRML: కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అధిష్టానం గుర్తిస్తుందని, సమయం వచ్చినప్పుడు పదవులు తప్పకుండా వరిస్తాయన్నారు.