VKB: తాండూరు పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఒక సంస్థ ద్వారా కేవలం మైనార్టీ వర్గానికి మాత్రమే ఇళ్లను కేటాయించడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని పేర్కొన్నారు. సదరు సంస్థను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు.
MNCL: జన్నారం మండలంలోని పొన్కల్, రెండ్లగూడ, మొర్రిగూడ, దండేపల్లి మండల కేంద్రంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రాములు మంగళవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు నిబంధనల ప్రకారం తాలు, తప్ప, తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని తెలిపారు.
BDK: టెన్త్ ఫలితాలపై డీఈవో నాగలక్ష్మి మంగళవారం పాల్వంచలో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 12,727 మంది పరీక్షకు హాజరుకాగా 11,506 మంది ఉత్తీర్ణులై 90.58% ఫలితాలు సాధించడం, తక్కువ మార్కులు వచ్చిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలు 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.
VKB: పరిగి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన కొండల్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.
NLG: ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం దిగుమతిలో మిల్లర్ల మోసాలను అరికట్టాలని కోరుతూ రైతు సంఘం నాయకులు కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. తాలు, తరుగు పేరుతో అదనపు కటింగులు చేస్తూ మిల్లర్లు రైతులను నిలువునా ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
JN: ఈ నెల 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. రఘునాథపల్లిలో బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని, బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ASF: కౌటాలలోని రైతు వేదికలో బుధవారం ఉదయం 9 గంటలకు రైతు వారోత్సవాల సభ నిర్వహించనున్నట్లు AO ప్రేమల మంగళవారం తెలిపారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. PACS, సహకార బ్యాంకు ద్వారా లభించే స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NRML: బాసర ఐఐఐటీను మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించారు. విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక బోధన పద్ధతులు అమలు చేసి, ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ క్యాంపస్లో వసతి, ఆహారం, త్రాగునీటి వంటి సదుపాయాలు మెరుగుపరచాలని తెలిపారు.
HYD: సికింద్రాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును రైల్వే పోలీసులు రట్టు చేశారు. ఒడిశా నుంచి పూణేకు 14 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, రూ. 7.16 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో ట్రిప్కు రూ.7 వేల ఒప్పందంతో నిందితుడు ఈ అక్రమ రవాణాకు పాల్పడగా, ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
JGL: కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలకు వచ్చిన వారి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
RR: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం మంగళవారం మూసాపేటలో మెరుపు దాడి చేసింది. ఒక గదిలో నిల్వ ఉంచిన 6.43 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
GDWL: ప్రముఖ తత్వవేత్త, శాస్త్రీయ సోషలిజం పితామహుడు కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం గద్వాల ప్రజాసంఘాల నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్త కార్మిక వర్గ విముక్తికి మార్క్స్ సిద్ధాంతాలే దిక్సూచి అని కొనియాడారు. ఆయన ప్రపంచాన్ని విముక్తిని వైపు మళ్ళించారన్నారు.
KMM: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన భూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నేలకొండపల్లి మండలం మంగళగూడెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
WGL: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇవాళ కమిషనరేట్ కార్యాలయంలో గో రక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, వాహనాలను వెంబడించడం ప్రమాదకరమని తెలిపారు.
SRD: మంబాపూర్ గ్రామంలో ముదిరాజ్ మత్స్యశాఖ నూతన కమిటీ ఎన్నికైంది. ఎన్నికైన సభ్యులకు జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ ప్రోసీడింగ్ కాపీలు అందజేశారు. అధ్యక్షుడిగా మద్దూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా రొయ్యపల్లి ప్రశాంత్, కార్యదర్శిగా యాట రమేష్ ఎన్నికయ్యారు. సలహాదారుడిగా మద్దూరి సత్యనారాయణతో పాటు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు.