HYD: సైబరాబాద్ పరిధిలోని గుట్టా, కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో, నకిలీపోలీసు వేషధారణతో కిడ్నాప్లు, దందాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠాలోని మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుల నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ASF: ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్కి చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ నేషనల్ క్రికెట్ లీగ్కు ఎంపికయ్యాడు. హైదరాబాద్లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అండర్-16 క్రికెట్ క్రీడాకారుల కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అతను ప్రతిభ కనబర్చాడు. బాదావత్ శివప్రసాద్, రజిత దంపతుల చిన్న కుమారుడైన శ్రీ చంద్ నాయక్ ఎంపికతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ASF: ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్కి చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ నేషనల్ క్రికెట్ లీగ్కు ఎంపికయ్యాడు. హైదరాబాద్లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అండర్-16 క్రికెట్ క్రీడాకారుల కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అతను ప్రతిభ కనబర్చాడు. బాదావత్ శివప్రసాద్, రజిత దంపతుల చిన్న కుమారుడైన శ్రీ చంద్ నాయక్ ఎంపికతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
HYD: హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలు, మరణాల తగ్గింపుకు పటిష్ట చర్యలు చేపట్టాలని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, జీబ్రా క్రాసింగ్లు, గార్డ్ రైలింగ్లు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. శాఖల సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
ADB: ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ప్రవేశాల లక్ష్యంగా బడి బాటను విజయవంతం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితా రాణా అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలను బలోపేతం చేయడం, నూతన డిజిటల్ విద్యా విధానాల అమలుపై చర్చించినట్లు పేర్కొన్నారు.
KNR: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రోజున జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ను ఈ సందర్భంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.28,76,141 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.11,55,210, వీఐపీ దర్శనాలతో రూ.4,18,650, కార్ పార్కింగ్ రూ.4,63,000, బ్రేక్ దర్శనాలు రూ.2,20,200, ప్రధాన బుకింగ్లతో రూ.1,49,350 చొప్పున ఆదాయం సమకూరింది. నిత్య ఖజానాకు వివిధ విభాగాల నుండి ఈ నిధులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
MLG: మంగపేట మండలం మల్లూరు గ్రామంలో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కోడలి తిరుపతమ్మ కుటుంబాన్ని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంఛార్జ్ బడే నాగజ్యోతి-జగదీష్ బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
RR: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎల్బీ స్టేడియంలో శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి ఆవిష్కరించారు. ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన తెలిపారు.
BDK: దుమ్ముగూడెం మండలం లింగాపురం బీట్లో అటవీ శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. రూ. 1,86,712 విలువ గల టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకుని భద్రాచలం డిపోకు తరలించారు. ఈ దాడుల్లో పర్ణశాల FSO అన్నపూర్ణ, FBO ఎస్కే రహీం, లింగంపల్లి బీట్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు.
SRCL: బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీసం 10 శాతం మేర విద్యార్థుల నమోదును పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, డీఈఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
సిద్దిపేట జిల్లాలో నూతనంగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వీ.శాస్త్రిని STU సంఘం సిద్దిపేట జిల్లా పక్షాన బుధవారం ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాడ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి పట్నం భూపాల్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మట్టపల్లి రంగారావు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పాల్గొన్నారు.
JGL: బీర్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రభుత్వ పాఠశాల విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా బడిబాటకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన సాగుతుందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఎంఈఓ నాగభూషణం, సర్పంచ్ హరీష్ పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.
HNK: దామెర మండలం ఊరుగొండ గ్రామంలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7,500 నగదు, ఆరు సెల్ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు దామెర ఎస్సై కొంకా అశోక్ తెలిపారు. పేకాట, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.