• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం: కలెక్టర్

BHPL: ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.  మంగళవారం టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మాతా-శిశు మరణాలు తగ్గించాలని స్పష్టం చేశారు. తనిఖీ సమయంలో MRO స్వరూప రాణి ఉన్నారు.

April 7, 2026 / 03:08 PM IST

వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు

KNR: అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వాణి(29)కి దామెర గ్రామానికి చెందిన కుమార్తె వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధింపులు పెరగడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వరంగల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

April 7, 2026 / 03:07 PM IST

సిసి రోడ్డు పనుల ప్రారంభం

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి 2వ వార్డులో CC రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పాలకవర్గ సభ్యులు పనులు ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పరిశుభ్రతతో పాటు, రాకపోకల మెరుగుదలకు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వల్ల గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ అనిల్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

April 7, 2026 / 03:06 PM IST

నగరంలో CPRపై అవగాహన కార్యక్రమం

HNK: జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్‌డ్ సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ రెడ్ క్రాస్ ఛైర్మన్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరూ శాస్త్రీయ పద్ధతులను అనుసరించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డా. రామక శ్రీనివాస్, జి. శివ కుమార్, శ్రీధర్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 03:05 PM IST

PHC సందర్శించిన ఎంపీడీవో

MDK: మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో కృష్ణమూర్తి సందర్శించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక -99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎంపీడీవో సూచించారు. వైద్యాధికారి జ్యోత్స్న, డాక్టర్ సమత, CHO బాల నరసయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

April 7, 2026 / 03:05 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

KMM: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక వెంకటేశ్వర నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ల్యాబ్‌ను పరిశీలించారు.

April 7, 2026 / 03:03 PM IST

BJP కార్పోరేటర్‌పై FIR నమోదు

నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్‌పై 5వ టౌన్ పోలీసులు FIR నమోదు చేశారు. నగరంలోని లలితానగర్‌కు చెందిన గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ FIR నమోదైంది. అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు నిర్మిస్తుంటే కార్పొరేటర్ మఠం పవన్, అతని అనుచరుడు వినోద్ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేయగా FIR నమోదైంది.

April 7, 2026 / 03:01 PM IST

ధర్నాలు, ర్యాలీలకు పోలీసు అనుమతి తప్పనిసరి: SI

SDPT: బెజ్జంకి మండలంలో బుధవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్సై సౌజన్య తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంద్ పేరుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను బలవంతంగా మూసివేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.

April 7, 2026 / 03:01 PM IST

‘బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి’

WNP: ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా ‘బడిబాట’ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని AMO మహానంది తెలిపారు. పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు అందిస్తామన్నారు.

April 7, 2026 / 03:01 PM IST

వైద్య సేవల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

NGKL: ఉప్పునుంతల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ల్యాబ్, ఫార్మసీ సేవలను సమీక్షించి, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి శుభ్రత, మందుల లభ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.

April 7, 2026 / 03:01 PM IST

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NLG: త్రిపురారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతీ సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ కేంద్రాల ఏర్పాటు ఊరటనిస్తుందన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

April 7, 2026 / 03:01 PM IST

‘మహాసభలను జయప్రదం చేయండి’

MBNR: మే చివరి వారంలో మహబూబ్ నగర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. వాటిని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇవాళ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 900 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో నేతలు ఏ. రాములు, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 03:01 PM IST

అంచనూర్‌లో వైకుంఠ రథం ఏర్పాటు

KMR: దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఈ రథాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ జనగామ నరేష్, ఉపసర్పంచ్ కందుకూరు ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

April 7, 2026 / 03:01 PM IST

మద్దూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య

NRPT: మద్దూర్ పాత బస్టాండ్ వద్ద రోడ్డు వెడల్పు చేసినా సమస్యలు కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. రోడ్డు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు పార్క్ చేయడంతో పెద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. దీంతో బాటసారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు మున్సిపల్ అధికారుల నో పార్కింగ్ జోన్ల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

April 7, 2026 / 03:01 PM IST

పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

GDWL: విశ్వభారతి టెక్నో పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని ఆయన స్పష్టం చేశారు.

April 7, 2026 / 03:01 PM IST