NGKL: జిల్లా కేంద్రంలోని మంతటి ఎక్స్ రోడ్ దగ్గర గల కన్వెన్షన్ హల్లో జరిగిన బీజేపీ సన్నాహక సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోడీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు జిల్లా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
NRML: ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం నిర్మల్లో ‘రైతు వారోత్సవాలు’ నిర్వహించారు. రెండో రోజున ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన అధికారిణి అలియా ఫాతిమ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సుదీర్ఘకాలం ఆదాయం ఇచ్చే పంట అని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.
SRD: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా యువ కార్మికులు ఉద్య మించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలోని కేకే భవన్లో నిర్వహించిన యువ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న యువతకు యాజమాన్యాలు తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆరోపించారు.
JN: జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సక్సెషన్, మ్యుటేషన్, డేటా సవరణ వంటి అంశాల్లో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.
MBNR: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైనచర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ పడకూడదని ఎస్పీ జానకి పోలీసులను ఆదేశించారు. రూరల్ పోలీస్లకు నిర్వహించిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు పోలీస్ సిబ్బంది చురుకుగా పనిచేయాలని ,పోలీసులు ప్రజలకు రోల్ మోడల్గా నిలవాలని ఆమె సూచించారు.
ASF: జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి నిర్వహించే మానవ హక్కుల షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మంగళవారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల వారు జూన్ 30లోపు తమ ఎంట్రీలను గూగుల్ డ్రైవ్ ద్వారా hhrcshortfilm@gmail.com పంపాలని సూచించారు. విజేతలకు రూ.2 లక్షల నగదు అందిస్తారన్నారు.
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని చింతలపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి వేళ నడిరోడ్డుపై కారు నిలపడంతో అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కారును పక్కకు తీయమన్న పట్టించుకోని పరిస్థితి. పోలీసులు తక్షణమే స్పందించి రోడ్డుపై నిలిపిన కారు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలానికి చెందిన విష్ణు షాట్ పుట్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ శివ గౌడ్ తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ నిర్వహించారు. విద్యార్థులందరూ సమ్మర్ అథ్లెటిక్స్లో పాల్గొనాలని సూచించారు.
BDK: సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండల కేంద్రంలోని ఓ గార్డెన్స్లో మంగళవారం ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల విభిన్నీకరణ, ప్రత్యామ్నాయ సాగు అవసరమన్నారు. నీటి సంరక్షణతో సాగు ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయని అన్నారు.
NLG: భువనగిరిలోని వివేరా హోటల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలను చర్చించారు.
SDPT: తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత మంగళవారం జగదేవపూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో నూతనంగా వెలసిన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెద్దమ్మ తల్లి దయతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల దీవెనలే తమ పార్టీకి అసలైన బలమని అన్నారు.
MLG: ఏటూరునాగారం మండలం కొండాయి, చిన్నబోయినపల్లి గ్రామాల్లో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ తెలిపారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు కొండాయి, 10 గంటలకు చిన్నబోయినపల్లిలో జరగనుంది. ప్రజలు తమ సమస్యలు, పథకాల విన్నపాలు సమర్పించాలని సూచించారు. అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
JGL: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత అన్నారు. కోరుట్ల (M) మోహన్ రావు పేట, వెల్లుల్ల, జగ్గాసాగర్, బండ లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆర్డీఓ నరసింహారావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
SRCL: టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని మండల వైద్యాధికారి వేణుమాధవ్ అన్నారు. మండలంలోని ఎనగల్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం చందుర్తి పీహెచ్సీ వైద్య సిబ్బంది టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభారాణి, ఎంఎల్ హెచ్పీ నవ్య జ్యోతి ఉన్నారు.
MDK: వానాకాలం పంటల సాగులో నకిలీ విత్తనాలు అమ్మకం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై యాదగిరి, ఏవో గంగమల్లు హెచ్చరించారు. తన కార్యాలయంలో విత్తన డీలర్ల సమావేశం నిర్వహించారు. విత్తనాల దుకాణాలను మండల స్థాయిలో తనిఖీలు చేయడం జరుగుతుందని వివరించారు. సీజన్కు సరిపడా నాణ్యమైన విత్తనాలను సిద్ధం చేయాలన్నారు.