మంచిర్యాల జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ చంద్రయ్య తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతాయని, గతంలో ఫెయిలైన 317 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.