KNR: రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హితవు పలికారు. బుధవారం మానకొండూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన ప్రత్యేక సమవేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలకు పరిమితం కావాలన్నారు.