• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైతులు అధిక నిలబడులను పొందాలి: MLA

HNK: రైతులు సాంకేతికతను ఉపయోగించుకొని ఆధునిక వ్యవసాయ పరికరాలను వినియోగించి అధిక దిగుబడులను పొందాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సుబేదారి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో రైతు మేళాను ఎమ్మెల్యే సందర్శించి ఆధునిక వరి నాటు యంత్రం పని తీరును ఎమ్మెల్యే అడిగి తెలుసుకుని కాసేపు డ్రైవర్ సీట్లో కూర్చొని అందరికీ చేశారు.

May 5, 2026 / 06:45 PM IST

సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి: కలెక్టర్

SRPT: జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన రైతువారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పంటల మార్పిడితో ఆయిల్ ఫామ్ సాగుచేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు.

May 5, 2026 / 06:43 PM IST

పంటలకు బయోపెస్టిసైడ్స్‌ వాడాలి – కీటక శాస్త్రవేత్త

NZB: పంటలకు పురుగు మందులను అవసరమైన మోతాదు మేరకు వినియోగించాలని కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ సూచించారు. ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సమన్వయంతో మెండోరా రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. వేపనూనె, అజాడిరక్తిన్ వంటి బయోపెస్టిసైడ్స్‌ను ప్రారంభ దశలో ఉపయోగించాలన్నారు.

May 5, 2026 / 06:42 PM IST

ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

వికారాబాద్ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. MPC, BiPC, CEC, MEC గ్రూపుల్లో తలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ బ్యూల తెలిపారు. 10వ తరగతి మార్కుల ఆధారంగానే విద్యార్థుల ఎంపిక ఉంటుందని, ఆసక్తి గల వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

May 5, 2026 / 06:40 PM IST

జడ్చర్లలో ఉద్యాన శాఖ అవగాహన సదస్సు

MBNR: జడ్చర్లలో ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్‌లో నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఛైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పందిరి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచించారు. శాస్త్రవేత్త డాక్టర్ స్వామి శంకర్ కూరగాయల సాగు, మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు.

May 5, 2026 / 06:40 PM IST

‘అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి’

MNCL: చెన్నూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

May 5, 2026 / 06:38 PM IST

రవాణా సౌకర్యం లేక రైతులకు ఇబ్బందులు

NLG: గట్టుప్పల్ కొనుగోలు కేంద్రంలో ట్రాన్స్‌ఫర్ట్ కొరతతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతు సంఘం నాయకుడు బండ శ్రీశైలం తెలిపారు. 247 రాసులు ఉండగా, కేవలం 44 మంది రైతులకే కాంటా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 15 లారీలే ధాన్యం తరలించాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి రవాణా సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

May 5, 2026 / 06:37 PM IST

‘రెండో వార్డులో సమస్యలు పరిష్కరించాలి’

WNP: ఆత్మకూరు మున్సిపాలిటీలోని రెండో వార్డులో సమస్యలు పరిష్కరించాలని ఏఐఎంఐఎం నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్ శశిధర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వార్డులో మంచినీటి సరఫరా సమస్య ఉందని, వీధుల్లో పందులు, కుక్కలు అధికంగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. రహదారులు దెబ్బతిన్నాయి మరమ్మతులు నిర్వహించాలని జావేద్ కోరారు.

May 5, 2026 / 06:36 PM IST

బత్తిని సురేష్ కి సన్మానం, శుభాకాంక్షలు

WGL: రెండు తెలుగు (తెలంగాణ, ఏపీ) రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్‌గా బత్తిని సురేష్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా 2 రాష్ట్రాల టాక్స్ బార్ అసోసియేషన్ బాధ్యులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాల గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు.

May 5, 2026 / 06:36 PM IST

‘విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి’

SRPT: విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సీఐ లిక్కి కృష్ణంరాజు పిలుపునిచ్చారు. మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో ఆయన మాట్లాడారు. ఇటువంటి శిబిరాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు.

May 5, 2026 / 06:35 PM IST

వైరా సొసైటీ అధ్యక్షుడిగా రాజశేఖర్‌ బాధ్యతలు

KMM: హైకోర్టు ఆదేశాల మేరకు వైరా ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా బొర్రా రాజశేఖర్‌ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. గతంలో పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం కొట్టివేయడంతో ఆయన పదవిని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

May 5, 2026 / 06:35 PM IST

నానక్ రాంగూడ వెళ్లే మార్గంలో వాహనం బ్రేక్ డౌన్

RR: ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా నార్సింగి నుంచి నానక్‌రామ్‌గూడ వెళ్లే మార్గంలో ఓ వాహనం బ్రేక్ డౌన్ అయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, లేదా ప్రత్యామ్యాయ మార్గాలను ఎంచుకొని గమ్యస్థానానికి చేరుకోవాలని కోరారు.

May 5, 2026 / 06:34 PM IST

‘మే డే ర్యాలీ, బహిరంగ సభ విజయవంతం చేయాలి’

BHNG: మేడే వారోత్సవాల సందర్భంగా ఈనెల 7న భువనగిరిలో నిర్వహించనున్న భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మార్కెట్ యార్డుల్లో హమాలీ కార్మికులతో కలిసి మే డే వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

May 5, 2026 / 06:33 PM IST

‘అందుబాటులో ఉండి సేవలు అందిస్తాం’

SRCL: రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని సిరిసిల్ల PACS ఛైర్మన్ బండి దేవదాస్ అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేవదాసు మాట్లాడుతూ.. రైతులకు ఏ సమస్య ఉన్న మమ్ములను నేరుగా సంప్రదించాలన్నారు. వైస్ ఛైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, సభ్యులు ఉన్నారు.

May 5, 2026 / 06:33 PM IST

దేవరకొండ ఆర్డీవో మిర్యాలగూడకు బదిలీ

NLG: దేవరకొండ రెవిన్యూ డివిజన్‌కు ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఎస్. రమణారెడ్డి మిర్యాలగూడకు బదిలీ అయ్యారు. HMDA హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. పద్మ ప్రియ దేవరకొండ ఆర్డీవో‌గా నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవరకొండ ఆర్డీవోగా రమణారెడ్డి ఉత్తమ సేవలు అందించినట్లు డివిజన్ ప్రజలు గుర్తుచేశారు.

May 5, 2026 / 06:32 PM IST