MDCL: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్గా వచ్చిన ఎం.వెంకట నర్సింహా రెడ్డిని మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కలిశారు. తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్ శాలువా కప్పి సత్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు.
WGL: రాయపర్తి మండలం ఏకే తండాలో యువతిపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో వంచన చేసి గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
ఖమ్మంలో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సామాన్యుల హక్కుల కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు మద్దతు ధర, నిరుద్యోగ నిర్మూలనపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PDPL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్.ఎస్.సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి జి.శారద శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 20-27 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు www.telanganaopenschool.org లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా హాల్ టికెట్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
MLG: ఏటూరునాగారం అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలపై జిల్లా కలెక్టర్ దివాకరకి వినతిపత్రం సమర్పించినట్లు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత – లక్ష్మణ్ బాబులు తెలిపారు. ఏటూరునాగారంలో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ను ప్రస్తుతమున్న స్థలంలో మధ్య భాగంలో కాకుండా ఒక పక్కకు (సైడ్ కు) నిర్మించాలని కోరామన్నారు. అలాగే ఇతర సమస్యల గురించి చర్చించామని తెలిపారు.
KNR: మానకొండూరు నియోజకవర్గం గూడెం గ్రామంలోని 35 మంది దళితులకు సంబంధించిన భూసమస్య పరిష్కారానికి మానకొండూర్ MLA కవ్వంపల్లి సత్యనారాయణ ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామ పరిధిలో గల 63.18 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి 35 మంది లబ్ధిదారులకు భూమి రిజిస్ట్రేషన్ చేశారు. 8 ఏళ్లుగా మ్యుటేషన్ కాక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
JGL: మెట్పల్లి పట్టణ ప్రజలు ఈ నెల 30లోపు ఇంటి పన్ను చెల్లిస్తే 5% రాయితీ లభిస్తుందని మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువులోగా పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు.
SRCL: సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు బస్సులు పెంచాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలోని బస్ డిపోలో డిపో మేనేజర్ ప్రకాష్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్కు సరిపోయే అన్ని బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ASF: వాంకిడి మండలం దొడ్డిగూడ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పెళ్లికి వెళ్తుండగా రోడ్డుపైకి వచ్చిన ఆవును తప్పించబోయి బైక్ అదుపుతప్పి పడడంతో అతని తలకు తీవ్ర గాయం కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు.
MHBD: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గార్ల(M )పెద్ద కిష్టాపురం గ్రామంలో సర్పంచ్ గంగావత్ రామ్ సింగ్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తీవ్రత పెరగడంతో మూగజీవాలు, పక్షులు దాహార్తితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గ్రామ పరిధిలోని మూడు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. సర్పంచ్ నిర్ణయం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ కేంద్రం అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.
BHPL: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాల కీర్తిరెడ్డి, అధికార ప్రతినిధి వెంకటరమణ అన్నారు. భూపాలపల్లి పార్టీ ఆఫీస్లో మీడియాతో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు.
JN: రైతులు మక్కలు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లిలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి గ్రామానికి గోదావరి జలాలు తీసుకురావడంతో పంటల దిగుబడి, నాణ్యత పెరిగిందని, రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని ఎమ్మెల్యే అన్నారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తెలియజేశారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్మికులతో సమావేశమై ఆమె మాట్లాడారు. చెత్తను తొలగించే జవాన్లు, డ్రైవర్లు సమయానికి ముందే వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లిపోవడం పట్ల వారిపై చైర్ పర్సన్ బండారి అనూష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.