VKB: తాండూర్ నియోజకవర్గంలో మండలాల అధ్యక్షులను నియమిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దేముల్ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి, బషీరాబాద్ అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డి, యాలాల అధ్యక్షుడిగా కురువ మహిపాల్, తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నాగరాజ్లను నియమించారు. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ ధర్నాతో కొనుగోళ్లపై చలనం వచ్చిందని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల తీరుపై మండిపడ్డారు. జిల్లాలో కేవలం 20 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని విమర్శించారు. రైతులు రోడ్డెక్కటానికి ప్రభుత్వమే కారణమన్నారు. మొక్కజొన్న కొనడం లేదని ఆరోపించారు. రైతు బంధు, రుణమాఫీ అమలులో విఫలమైందన్నారు.
SRCL: రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బయోస్ట్రాటమ్ టెక్నాలజిస్ ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడాలన్నారు. దేశంలో 20 శాతం గ్యాస్ ఉత్పత్తి చేయాలని దానికి అనుగుణంగా ఈ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
MBNR: విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, లక్ష్య సాధన కోసం కృషి చేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన 12 రోజుల వేసవి శిక్షణా శిబిరం ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోన్లకు బానిసలైతే సృజనాత్మకత దెబ్బతింటుందని అన్నారు.
SDPT: హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియపై అధికారులు, రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యార్డులో మొక్కజొన్న నిల్వకు మాత్రమే స్థలం ఉండగా, వరి ధాన్యానికి సౌకర్యం లేదని తెలిపారు. అందువల్ల రైతులు సమీప ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు.
MNCL: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండలం పొలంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
RR: కొండాపూర్ పరిధిలోని ఆనంద్ నగర్, ప్రశాంత్ నగర్ కాలనీల్లో HMWSSB అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా పైప్లైన్లకు అమర్చిన 22 వాటర్ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. మోటార్లు వాడితే జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నీటి సరఫరా సమస్యలు ఉంటే 155313 నంబర్కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
ADB: ఈనెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమై మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పాయల్ శంకర్ పేర్కొన్నారు.
SRPT: అనంతగిరి మండలం,శాంతినగర్ లోని పాఠశాలలో పశువుల ఆసుపత్రి నిర్మాణం చేపట్టవద్దని సీపీఐ నాయకులు బద్దం కృష్ణారెడ్డి, సర్పంచ్ ఉమా వ్యతిరేకించారు. పాఠశాలలో ఆసుపత్రి నిర్మాణం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక అధికారులు దీనికి అంగీకరించారని, అయితే ఇప్పుడు మరొక చోట నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.
ASF: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10న తెలంగాణలో పర్యటించనున్నట్లు సిర్పూర్ MLA హరీష్ బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు.మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వస్తున్న మోదీ, సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని MLA వెల్లడించారు.
MLG: ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించి మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP రవీందర్ తెలిపారు. సీసీటీవీ ఆధారంగా గుర్తించిన నిందితుల వద్ద నుంచి20.691 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు,జనవరిలో జరిగిన ఈ చోరీలో మొత్తం రూ. 2.40 లక్షల ఆస్తి అపహరణకు గురైందని వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.
RR: రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు పాండు యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోదీజీ సభ ఇంఛార్జ్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందన్నారు. మే 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు తరలి రావాలన్నారు.
PDPL: జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పీడియాట్రిస్ట్)- 2, అసిస్టెంట్ సివిల్ సర్జన్ MBBS- 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన వారు సర్టిఫికెట్స్తో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
BDK: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం ములకలపల్లి మండలం రైతు వేదికలో మండలంలో రైతు వారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ములకలపల్లిలో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నూతన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సంతోషకరమన్నారు.
NRML: జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యలు ఎదురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.