WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ట్రాఫిక్ CI సుజాత ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది నిందితులను పట్టుకున్నారు. అదే సమయంలో లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 8 మందికి రూ. 5,400 పెనాల్టీ విధించినట్లు ట్రాఫిక్ సీఐ సుజాత తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని అన్నారు.
NLG: ఎన్జీ కాలేజీలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో జనవరి 30న ‘తెలుగు భాషా వికాసం–వివిధ వైఖరులు’ అంశంపై ఒక్కరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్, తెలుగు శాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు.
SRCL: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాజన్న ఆలయంలో నిర్మాణంలో ఉన్న (Raft Foundation) పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్దేశిత గడువులోపు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఎప్పుడు ఏం జరుగుతుందో చూసేందుకు ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. రాత్రి సమయంలో గాల్లో ఎగిరే డ్రోన్కు బిగించిన స్క్రీన్పై జాతరలో ఏం జరుగుతుందో డ్రోన్ కెమెరాతో లైవ్గా వీక్షించే వీలు కల్పించారు. పోలీసులు, జిల్లా అధికారులు భక్తులకు సూచనలు, ప్రకటనలు చేయడానికి ఈ అద్భుత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
VKB: తాండూరు మండలం సంగెంకలన్ గ్రామానికి చెందిన అరవింద్ (16) అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించనున్న ఒగ్గుడోలు ప్రదర్శనకు ఇతడు ఎంపికయ్యాడు. ఇంత చిన్న వయసులో జాతీయ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడంపై అరవింద్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ అవార్డు గ్రహీత ఒగ్గు రవికి ధన్యవాదాలు తెలిపారు.
HYD: అమీన్పూర్ పెద్దచెరువు FTL, బఫర్ జోన్ హద్దులను వెంటనే నిర్ధారించాలని బాధితులు హైడ్రాను కోరారు. సోమవారం జరిగిన ‘ప్రజావాణి’లో కమిషనర్ ఏవీ రంగనాథ్కు 43 ఫిర్యాదులు అందాయి. చెరువు నీటిమట్టం పెరుగుతుండటంతో తమ ఇళ్లు, ప్లాట్లు మునుగుతున్నాయని, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని వారు వాపోయారు.
KNR: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రైవేట్ అధ్యాపకులను ఎక్స్టెర్నల్స్గా నియమించాలని కోరుతూ టీఎల్ఎఫ్ నాయకులు డీఐఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గతేడాది కేవలం ప్రభుత్వ అధ్యాపకులకే విధులు కేటాయించారని రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ అధ్యాపకులకు కూడా అవకాశం కల్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు ఆలయానికి వచ్చి అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ప్రాతఃకాల దర్శనంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అంబారిపేట గ్రామంలో ఎర్ర చిన్న బుచ్చయ్య ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా ఆ గ్రామానికి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఊహించని రీతిలో అతనికి చెస్ట్ పెయిన్ రావడం జరిగిందని స్థానికులు తెలిపారు.
MBNR: కార్పొరేషన్ ఎన్నికలలో డివిజన్ల కేటాయింపులో ఎస్టీలకు అన్యాయం జరిగిందని గిరిజన విద్యార్థి, సేవా సంఘం నేతలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం కల్పించిన 10% రిజర్వేషన్ల ప్రకారం 6 స్థానాలు కేటాయించాల్సింది 2 స్థానాలనే కేటాయించారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటీషన్ దాఖలుచేసిన వారిలో రవి రాథోడ్, రమేష్ నాయక్, కిషన్ పవర్లు ఉన్నారు.
KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. చలి తగ్గుముఖం పట్టగా జుక్కల్ 12.8°C, లచ్చపేట 13.3, రామలక్ష్మణపల్లి 13.4, తాడ్వాయి 14.1, ఎల్పుగొండ 14.2, భిక్కనూరు 14.7, నాగిరెడ్డిపేట 14.9, దోమకొండ, డోంగ్లి 15°Cల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
MDK: కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన దేశాయిపేట గణేష్ శర్మ (28) నిన్న బాత్రూంలో పడి మృతి చెందాడు. హైదరాబాదులో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న గణేష్ శర్మ అక్కడే ఉంటున్నాడు. సోమవారం బాత్రూంలో పడగా, ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గణేష్ శర్మ మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. గణేష్ శర్మ అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MBNR: కాంగ్రెస్ యువజన విభాగం మాజీ ఉపాధ్యక్షుడు అవైజ్ అలీ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
NZB: నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 21న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం 10.30 గంటలకు శివాజీనగర్లోని ఉపాధికల్పన కార్యాలయానికి రావాలని సూచించారు.