• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం

MNCL: బెల్లంపల్లి మండలం పెద్ద బూదకు చెందిన మహేష్ (21) అనే యువకుడు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు అతడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అతడిని 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటీ రాకేష్, పైలట్ సంపత్ తెలిపారు.

April 11, 2026 / 06:00 PM IST

కోడవటంచ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర

BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల సమగ్రాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో భూపాలపల్లి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

April 11, 2026 / 05:55 PM IST

జన జాగరణ యాత్రకు పోస్టర్ విడుదల

NLG: యాదగిరిగుట్టలో జన జాగరణ కన్వీనర్ అంకం రాజు ఆధ్వర్యంలో జన జాగరణ యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 19న హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగబోయే జాతరకు బీసీ కులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

April 11, 2026 / 05:54 PM IST

‘కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం’

ADB: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదవాడి సొంతింటి కలలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ గంగన్న తదితరులున్నారు.

April 11, 2026 / 05:50 PM IST

నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేత

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే కుడి కాల్వకు అధికారులు శనివారం ఉదయం నీటి విడుదలను నిలిపివేశారు. ఆంధ్ర ప్రాంతంలో యాసంగి సీజన్ పంటలు పూర్తయిన నేపథ్యంలో కుడికాలువకు డ్యామ్ అధికారులు నీటిని నిలిపివేశారు. కాగా ఇదిలా ఉంటే సాగర్ ఎడమకాల్వకు కూడా మరో రెండు రోజుల్లో నీటి విడుదలను నిలిపి వేసే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు.

April 11, 2026 / 05:46 PM IST

పనులను పరిశీలించిన చైర్‌పర్సన్

MHBD: మరిపెడ శివారులో మాకుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ జాతర, పారువేట సందర్బంగా పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న మరమ్మతు పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 

April 11, 2026 / 05:45 PM IST

‘ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి’

WGL: అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓంకార్ భవన్‌లో AIFDS జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్య హక్కు చట్టాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు.

April 11, 2026 / 05:45 PM IST

పాపను ఢీకొని పారిపోయిన యువకులు

MLG: తాడ్వాయి (M) మేడారంలో ఓ చిన్నారిని బైక్‌తో ఢీకొని ఇద్దరు యువకులు పరారైన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లోని CC కెమెరాలను పరిశీలించగా, నిందితులు బైక్‌పై వాటర్ క్యాన్ తీసుకుని వెళ్లిన దృశ్యాలు లభించాయి. ప్రమాదంలో చిన్నారి కాలు విరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువకులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.

April 11, 2026 / 05:45 PM IST

ఇమాంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఇమాంపేట్ సంఘబంధం 1,2 ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు.

April 11, 2026 / 05:44 PM IST

‘కేంద్ర నిధులతో మధిర అభివృద్ధి జరుగుతుంది’

KMM: మధిరలో రైల్వే అండర్పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం రూ.34 కోట్లు కేటాయించడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం పట్టణ అధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రామిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాలతో మధిర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

April 11, 2026 / 05:40 PM IST

అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేరళ మోడల్‌లో నిర్మితమవుతున్న ఈ భవనం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తుంది.

April 11, 2026 / 05:39 PM IST

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ

PDPL: పెద్దపల్లి పట్టణంలోని మిని ట్యాంక్ బండ్ ఎల్లమ్మ చెరువు సమీపంలో శనివారం ఉదయం పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ పట్టణ వాసులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్ కుమార్, సుబ్బారెడ్డి, పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

April 11, 2026 / 05:38 PM IST

‘హెల్ప్ లైన్ నెంబర్ పనిచేయడం లేదు’

NRML: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అక్రిడేషన్ అప్లై కొరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు సమర్పించే సమయంలో తప్పిదాలు దొర్లుతున్నాయి. దీంతో వాటిని సరిదిద్దడానికి హెల్ప్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేస్తే అవి పనిచేయడం లేదు. దీంతో జర్నలిస్టులు గందరగోళానికి గురవుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని జర్నలిస్టులు వాపోతున్నారు.

April 11, 2026 / 05:38 PM IST

సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వేషధారణలో విద్యార్థులు

NZB: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాల్కొండ మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సిందూజ (జ్యోతిరావు పూలే), శ్రీనిత్య (సావిత్రిబాయి పూలే) వేషధారణలో అలరించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పూలే దంపతులు సమాజం కోసం చేసిన త్యాగాలను, విద్యారంగంలో వారు చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు.

April 11, 2026 / 05:37 PM IST

BRS పార్టీలో చేరిన టేకుమట్ల గ్రామస్తులు

MNCL: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు శనివారం BRS పార్టీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మళ్లీ KCR సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావించి ఇతర పార్టీల నుంచి BRSలో చేరుతున్నారన్నారని సుమన్ తెలిపారు.

April 11, 2026 / 05:32 PM IST