జగిత్యాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సత్యప్రసాద్ పరీక్షలపై దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వారిని ఎలాంటి స్ట్రెస్కు గురి కావద్దని, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలకు సన్నద్ధం కావాలని జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, మంచి ఆహారం తీసుకోవాలని, ఫోన్లు, టీవీలకు దూరంగా మంచిగా ప్రిపేర్ కావాలన్నారు.