యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నా.. భారత మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. FEBలో ఈక్విటీ ఫండ్లలోకి నికరంగా రూ.25,978 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరితో పోలిస్తే ఈ మొత్తం 8 శాతం అధికమని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం తెలిపింది. అదే సమయంలో SIPలో జనవరిలో రూ.31 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. ఫిబ్రవరిలో రూ.29,845 కోట్లకే పరిమితమయ్యాయి.