సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా మిగిలిన సరిహద్దు దేశాల FDIల విషయంలో ఉన్న నిబంధనలను సులభతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘ముందస్తు అనుమతి’ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. తాజాగా దీన్ని తొలగించారు.