• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శాసనమండలి చీఫ్ విప్‌ను కలిసిన ఆర్టీవో

RR: చేవెళ్ల ఆర్టీవోగా ఇటీవల నియమితులైన పార్థ సింహారెడ్డి సోమవారం శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్బంగా పటిష్టమైన ప్రజా పాలనకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.

April 20, 2026 / 05:30 PM IST

‘మే డే వారోత్సవాలను జయప్రదం చేయాలి’

NLG: ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీమ్ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం దేవరకొండ పట్టణ కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

April 20, 2026 / 05:30 PM IST

రుద్రసముద్రంలో అంబలి కేంద్రం ప్రారంభం

NRPT: మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో దత్త గురుస్వామి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అంబలి కేంద్రంని ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాలుగా నారాయణరెడ్డి స్వంత ఖర్చులతో ఈ అంబలి సేవను నిర్వహిస్తూ వస్తున్నారు. నిరుపేదలకు అంబలి పంపిణీ చేయడం ఎంతో పుణ్యకార్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం, గ్రామస్థులు పాల్గొన్నారు.

April 20, 2026 / 05:30 PM IST

జనగణన తరగతులను తనిఖీ చేసిన కలెక్టర్

MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జనగణన 2027 శిక్షణ తరగతులను నర్సాపూర్ ఆర్డీవోతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిజిటల్ విధానంలో జరగనున్న ఈ గణన ప్రక్రియలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆదేశించారు.

April 20, 2026 / 05:30 PM IST

‘విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం’

ADB: గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని మాజీ మంత్రి BRS జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. రూరల్ మండలంలోని కాచికంటిలో ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సోమవారం పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఐక్యత భావం పెంపొందుతుందని పేర్కొన్నారు.

April 20, 2026 / 05:27 PM IST

‘పారిశుధ్యం ప్రాధాన్యంతో వ్యాధులకు అడ్డుకట్ట’

KMM: పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు ముందస్తుగా అడ్డుకట్ట వేయవచ్చని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో డెంగ్యూ, మలేరియా వ్యాధుల నియంత్రణపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వెక్టర్ బార్న్ ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

April 20, 2026 / 05:26 PM IST

అంగన్వాడి టీచర్లకు ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట రైతు వేదికలో సోమవారం 134 మంది టీచర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అందించారు. మహిళా శిశు సంక్షేమానికి అంగన్వాడి సేవలు ఎంతో కీలకమని, వారికి సాంకేతిక సదుపాయాలు అందించడం ద్వారా అంగన్వాడి టీచర్లు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని తెలిపారు. డిజిటల్ సేవల వినియోగంతో లబ్ధిదారులకు వేగవంతమైన సేవలు అందుతాయని అన్నారు.

April 20, 2026 / 05:24 PM IST

అమ్మ తరువాత అమ్మ అంగన్వాడీ టీచర్..!

BDK: టేకులపల్లి మండలం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ఆడబిడ్డలను ఆశీర్వదించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మ తర్వాత అంతటి పాత్ర వహించేది అంగన్వాడీ టీచర్ అని కొనియాడారు.

April 20, 2026 / 05:20 PM IST

బసవేశ్వరా విగ్రహ ఆవిష్కరణ చేసిన TPCC స్టేట్ జనరల్ సెక్రటరీ

కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని రాజంపేట్ మండల్ పెద్దాయిపల్లి గ్రామంలో మహాత్మా బసవేశ్వరా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్, నరేష్,ఉప సర్పంచ్, సౌందర్య, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, మహేశ్వర్, బసవన్న, రాజు, శ్రీనివాస్ ఉన్నారు.

April 20, 2026 / 05:17 PM IST

దేవాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి

MLG: దేవాలయాల సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో పెద్దమ్మతల్లి గుడి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ములుగు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు.

April 20, 2026 / 05:16 PM IST

ఇంద్రవెల్లి అమరవీరులకు ఆత్రం సుగుణ ఘన నివాళి

ASF: అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. భూమికోసం, భుక్తి కోసం, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

April 20, 2026 / 05:10 PM IST

స్ఫూర్తి సేన యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం

NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో స్ఫూర్తి సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఉచిత మంచినీటి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మట్టి కుండల ద్వారా స్వచ్ఛమైన చల్లని నీటిని అందించే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు.

April 20, 2026 / 05:10 PM IST

సమ్మర్ యాపిల్.. గిరాకీ సూపర్!

SRPT: సమ్మర్ యాపిల్‌గా పేరొందిన తాటి తాటిముంజెల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తుంగతుర్తి, తదితర ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న తాటి తోపులు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్నాయి. ప్రస్తుతం డజను ముంజెల ధర రూ.70 పలుకుతోంది. ఎండల దృష్ట్యా ముంజలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడిందని విక్రయదారులు చెబుతున్నారు.

April 20, 2026 / 05:05 PM IST

ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారం: కలెక్టర్

VKB: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ హాలులో జరిగిన కార్యక్రమంలో భూసమస్యలు, విద్యుత్, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహనిర్మాణం, వ్యవసాయం, ఉపాధి అంశాలపై 125 వినతులు అందాయి. ఈ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా తీర్చాలని సూచించారు.

April 20, 2026 / 05:00 PM IST

ఆర్టీసీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

NGKL: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ డిపో మేనేజర్ యాదయ్య ఆదేశాల మేరకు అధికారులు ఆర్టీసీ కార్మికులకు సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడవద్దని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

April 20, 2026 / 05:00 PM IST