NZB: భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో భారీ చోరీ జరిగింది. ఎల్లమ్మ వాగు సమీపంలో మరియు సికింద్రాపూర్ రోడ్డు పరిసరాల్లో ఉన్న సుమారు 30 మంది రైతుల వ్యవసాయ మోటర్ల కేబుల్ వైర్లు, స్టార్టర్లు, బాక్సులను దొంగలు కత్తిరించుకుపోయారు. బుధవారం ఉదయం పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
BHNG: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలడుగు వద్ద జాతీయ రహదారిపై రైతులు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు బుధవారం సామూహిక ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పేరుకుపోయినప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
KNR: మానకొండూర్ మండలం, మద్దికుంట గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, జాతర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
MNCL: మంచిర్యాల జిల్లా ఇరిగేషన్ శాఖ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. ప్రభాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు శ్రావణ్ కుమార్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, తదితరులు పాల్గొన్నారు.
JGL: ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు కృషి చేయాలని ఒడ్యాడ్ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ అన్నారు. భీమారం మండలంలోని ఈ గ్రామంలో బుధవారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాకేష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
SRD: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలీసు ఎక్సైజ్ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సంబంధిత అధికారులకు MLA మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు శివారు కంపెనీలు, పారిశ్రామికవాడలో వీటి వినియోగం ఎక్కువగా సాగుతుందని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
ADB: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశానికి లక్కీ డ్రా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతాపూర్లో ఒకటవ తరగతిలో ఉట్నూర్కు చెందిన కుమారి శిర సందిత ఎంపికయ్యారని అన్నారు. వెయిటింగ్ లిస్ట్లో ఆదర్శ్, విజ్ఞాన్ విహారిలను ఎంపిక అయినట్లు వెల్లడించారు.
HYD: హైదరాబాద్ను అధునాతన వైద్య పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బోర్పట్లలో రూ.1,200 కోట్ల థెరానిమ్ బయోలాజిక్స్ యూనిట్ను ప్రారంభించిన ఆయన, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్లు, క్యాన్సర్ చికిత్సల రంగాల్లో తెలంగాణను ప్రపంచస్థాయి గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
NRML: ఖానాపూర్ మండలం కొత్తపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు. సర్పంచ్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
HNK: వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడతాయని కాజీపేట ట్రాఫిక్ సీఐ హెచ్చరించారు. WGL ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని సీఐ కోరారు.
JGL: రాయికల్ మండల కేంద్రానికి చెందిన చిదుమల్ల సాన్విక హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ( క్రీడా పాఠశాల)కు ఎంపికైంది. మొదటిసారి క్రీడా పాఠశాలకు ఎంపికైన విద్యార్థిని సాన్వికను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వీటీఏడీఏ (వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) ఆద్వర్యంలో రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు, ప్రధాన రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు.
KNR: మానకొండూర్ మండలం, వెల్ది గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల కుటుంబాల సొంతింటి కల నెరవేరుతుందని ఆయన అన్నారు.
SRD: ఖేడ్ RTC డిపోలోని TJMU, EU అధ్యక్షులు, సహచర బృందం దాదాపు 50 మంది కార్మికులు నేడు హైదరాబాదులో TMUలో చేరారు. ఈ మేరకు స్థానిక డిపో యూనియన్ సెక్రటరీ నెహ్రూ మాట్లాడుతూ.. డిపోలోని ఇతర యూనియన్ నాయకులు సభ్యులు, TMU లో చేయడం వల్ల సింగల్ యూనియన్ డిపోగా TMU అవతరించిందని తెలిపారు. చేరిన వారందరికీ TMU కృతజ్ఞతలు తెలిపారు.
BHNR: రామన్నపేట బస్టాండ్ నుండి వేములకొండకు నూతన బస్సు సేవలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ బస్సు సేవలు అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తొలగి, రాకపోకలు సులభతరం కానున్నాయి.