NLG: శాలిగౌరారం మండలం మాదారంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పరుశురాం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సేకరణ చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
HNK: ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామపంచాయతీలో ఆదివారం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కొత్తపల్లి కనకయ్యకు రెండున్నర లక్షల ఎల్ఓసీ పత్రాలను సర్పంచ్ తోడ నాగరాజు అందజేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో కనకయ్య వైద్య శిక్షణ నిమిత్తం ఎల్ఓసి ప్రభుత్వం మంజూరు చేసినట్లు సర్పంచ్ ప్రకటించారు.
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కొబ్బరికాయలు,పూజా సామాగ్రి విక్రయించే లైసెన్స్ హక్కుల కోసం ఈనెల 13న (సోమవారం) బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ ప్రక్రియ జరుగుతుందని EO బాపిరెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
NZB: రహదారులపై ధాన్యం ఆరబెట్టే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు. వడ్ల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష, జరిమానా తప్పదని స్పష్టం చేశారు. రైతులు రోడ్లకు బదులు ప్రత్యామ్నాయ ప్రదేశాల్లోనే ధాన్యం ఆరబోసుకోవాలని ఆయన సూచించారు.
KMR: లింగంపేట మండలంలోని మంబాజీపేట్ తండాకు చెందిన మహిళలు శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు సంపత్ గౌడ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బేగరి సాయిలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
BHNG: వలిగొండ పట్టణ కేంద్రంలో బహుళ నవమి సందర్బంగా ఆదివారం పట్టాభి సీతరామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సములో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రలు అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలిగొండ పట్టణంలో పట్టాభి సీతారాములవారి కళ్యాణ ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ కలిసి జరుపుకోవాలని ఆయన కోరారు.
KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్ వృక్ష శాస్త్ర విభాగాధిపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ అనుమతితో ఎంఎస్సీ చదువుతున్న విద్యార్థులకు నిర్వహించారు. ఈ క్షేత్ర పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో పాలంపేట చెరువు, పాకాల చెరువులో ఆల్గే సేకరణతో పాటు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.
MHBD: కురవి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ డి. వీరన్న నాయక్ టీపీసీసీ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ చేతుల మీదుగా కురవిలో నియామక పత్రాన్ని అందుకున్నారు. వారికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
SRD: జిల్లా జంలాతండాకు చెందిన దేవ సోప్ రానే రాథోడ్ UPSC NDA ఫలితాల్లో ఆలిండియా 409వ ర్యాంకు సాధించి ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. న్యాయవాది దేవిదాస్, ఉపాధ్యాయురాలు అనిత దంపతుల కుమారుడైన రాథోడ్, గ్రామీణ నేపథ్యం నుంచి రక్షణ రంగంలో ఉన్నత స్థాయికి చేరి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
BDK: పాల్వంచ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో సీపీఐలో 80 కుటుంబాలు చేరాయి. సయ్యద్ యాకుబ్ అమీర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SRCL: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏప్రిల్ 13న ఉదయం 9 గంటలకు కేసీఆర్ క్రికెట్ కప్ నిర్వహించనున్నారు. మొదటి బహుమతి రూ. 50 వేలు, రెండోది రూ. 25 వేలు. 14 టీంలకు మాత్రమే అవకాశం కల్పించారు. పాల్గొనేవారు నిర్వాహకులను సంప్రదించాలన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. కూచనపల్లిలో రూ. 21.30 లక్షల చెక్ డ్యామ్ ఫీడర్ ఛానల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హుస్నాబాద్లోని ఎల్లమ్మ, ఆరెపల్లి, కొత్త చెరువులను, జిల్లెల్లగడ్డలో అర్బన్ ఫారెస్టు పనులను పరిశీలించనున్నారు.
VKB: తాండూర్ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. శనివారం జరిగిన జాతర ఉత్సవాల సందర్భంగా వివిధ పార్టీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఫ్లెక్సీలు గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. బద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో ఏటా ఓ వివాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చుతుంటాయని పలువురు విమర్శిస్తున్నారు.
MLG: వెంకటాపూర్ (M) జవహర్నగర్ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు HM కృష్ణ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉ. 10 గంటల నుంచి మ.12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన అన్నారు.
NLG: జిల్లా వ్యాప్తంగా రబీ ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాలకు పోటెత్తాయి. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో సుమారు 140 కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, పలుచోట్ల కొనుగోళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. అకాల వర్షాల భయం, నిల్వ సౌకర్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం సేకరణను ప్రారంభించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.