ADB: నేరడిగొండ మండలంలోని రాజుర గ్రామంలో చెరువు నిర్మాణంతో భూమి కోల్పోయిన రైతులకు మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నష్ట పరిహారం అందజేశారు. గత BRS ప్రభుత్వ హయాంలో 50 శాతం నిధులు విడుదల అయ్యాయని పేర్కొన్నారు. మిగతా నష్టపరిహారాన్ని విడుదల చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కోరగా రూ.1 కోటి 18 లక్షల నిధులు విడుదల అయ్యాయని తెలిపారు.
NRML: వెంకటాపూర్ కాలనీలో మహాగణపతి, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అంగారక సంకష్ట చవితిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో గణపతి హోమం వేద పండితులు అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో గణపతి అభిషేకం, గణపతి హోమం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు.
NZB :మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన జనాభా లెక్కలు ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల శిక్షణ తరగతుల మంగళవారం ముగిశాయి. PRTU NZB జిల్లా అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ.. 3 రోజుల పాటు నిర్వహించిన ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల శిక్షణ తరగతుల సెంటర్లో ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కల్పించిన కలెక్టరు ధన్య వాదాలు తెలిపారు.
ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత ఐడీఓసీలోని డీసీఓ, ఏడీఎస్ఎల్ఆర్ కార్యాలయాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ రిజిస్టర్లను, సిబ్బంది హాజరును క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు సేవలను వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు. క్రమశిక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
MNCL: వ్యవసాయ సాగులో శాస్త్రీయ విధానాలు అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ రైతు వారంలో భాగంగా మంగళవారం చెన్నూర్లో పంటల సాగుపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంట సాగు కాకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని తెలిపారు.
KMM: వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రాధాన్యతనివ్వాలని,అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని సూచించారు.
జనగామ పట్టణంలోని విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను కట్టడి చేసినందుకుగాను సత్యనారాయణ రెడ్డికి ప్రశంసలు దక్కాయి. విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టిన ఆయనను CP సన్ప్రీత్ సింగ్ ఇవాళ ప్రత్యేకంగా అభినందించారు. CP కార్యాలయంలో నగదు రివార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
KNR: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలోని అమ్మ ఫంక్షన్ హాల్ (నియోజకవర్గ స్థాయి)లో ఆయిల్ పామ్ అవగాహనపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
WGL: ఖానాపూర్(M )అశోక్నగర్ సమీపంలో కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ ఆవరణలో ఉన్న శిలాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేశారు. పురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి లేకుండా ఇష్టానుసారం గుడిని నేలమట్టం చేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించిన సాయి స్మృతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
MLG: BRS జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తమ్ముడు ప్రవీణ్ రావు మామ పల్లెపాటి దేవేందర్ ఇటీవల మరణించగా నేడు ఆయన దశదినకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ బాబు పాల్గొని, దేవేందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
GDWL: గద్వాల మండలం కాకులారం గ్రామానికి చెందిన బండారి భరత్కు వైద్య చికిత్స కోసం రూ.1.25 లక్షల సీఎం సహాయనిధి మంజూరైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో LOC లేఖను కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కా
NGKL: విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి (డీఎస్సీడీవో) ఉమాపతి పిలుపునిచ్చారు. మంగళవారం పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రిత్విక్ పూలేను ఆయన తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగాలని సూచించారు.
MHBD: ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితుడై కాంగ్రెస్ మాజీ జిల్లా జాయింట్ సెక్రటరీ సూర్నేని రాము మంగళవారం బీజేపీలో చేరారు. జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు. పేదల సంక్షేమ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
SRD: నారాయణఖేడ్ మండలం కంజీపూర్కు చెందిన నర్సమ్మకు మంజూరైన రూ. 31,000 CMRFచెక్కును ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం తన నివాసంలో అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ప్రభుత్వం ఈ సాయం అందించింది. పేదలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పండరెడ్డి, అశోక్, లక్ష్మణ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.