• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

108 సిబ్బందికి ఆరు నెలలు అందని వేతనాలు

BHNG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడి ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవలైన 108 అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జీతాలు త్వరగా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

March 13, 2026 / 10:01 AM IST

రైలు దిగుతుండగా కాలు తెగింది..!

MDK: మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు దిగే ప్రయత్నంలో మధ్య ప్రదేశ్ వాసి తీవ్రంగా గాయపడ్డాడు. రామాయంపేటలోని ఓ కంపెనీలో పనిచేసే బిహారీ లాల్ (50), గురువారం రాత్రి మనోహరాబాద్ స్టేషన్లో దిగుతుండగా ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య ఇరుక్కుపోకి కుడి కాలు తెగింది. గమనించిన స్థానికులు అతడిని తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 13, 2026 / 09:59 AM IST

జిల్లా రైతాంగంపై రూ.35 కోట్ల అదనపు భారం!

NLG: పెట్టుబడి కష్టాలతో సతమతమవుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు దెబ్బ తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఈ తాజా నిర్ణయంతో ఎరువుల బస్తాపై ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు ధరలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి లెక్కగడితే, సుమారు రూ.35 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.

March 13, 2026 / 09:56 AM IST

జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు: సీపీ

SDPT: టెన్త్ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం నిషేధమన్నారు.మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతి పరీక్షా రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.

March 13, 2026 / 09:53 AM IST

నల్లాలకు ఆన్‌ఆఫ్ స్విచ్‌లు బిగింపు

NRML: సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో ప్రతి ఇంటి నల్లాకు ఆన్ఆఫ్ బటన్‌లు బిగించారు. గ్రామంలో నీటి వృథా అరికట్టేందుకు సర్పంచ్ కరిపే రవళి విలాస్ ఆధ్వర్యంలో ఈ ఆన్‌ఆఫ్‌లు బిగించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కుళాయిలకు ఆన్‌ఆఫ్ స్విచ్‌లు లేని వాటికి బిగించారు. వారితో మాట్లాడుతూ.. నీటిని వృథా చేయరాదని తెలిపారు. వేసవి కాలం నీటిని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు.

March 13, 2026 / 09:50 AM IST

74 కేసుల్లో 117 మంది అరెస్ట్: అదనపు సీపీ

HYD: సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫిబ్రవరిలో 74 కేసులకు సంబంధించి 117 మందిని అరెస్ట్ చేసినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులందరినీ 16 రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతనెలలో అరెస్టైన 117 మందిపై దేశంలోని వివిధ ఠాణాల్లో నమోదైన 1,081 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.

March 13, 2026 / 09:50 AM IST

శ్రీలంక క్రికెట్ టూర్ కి పవన్, వైష్ణవ్ ఎంపిక

WGL: ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా జరగబోయే 4 T-20 మ్యాచ్‌లు, 3 వన్-డే టోర్నమెంట్లో పాల్గొనబోయే HCA కంబైన్డ్ జిల్లాల జట్టులో వరంగల్ జిల్లా క్రీడాకారులు జి. పవన్, వి. వైష్ణవ్ ఎంపికయ్యారు. శ్రీలంకలో జరగబోయే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.

March 13, 2026 / 09:46 AM IST

పాఠశాల మొదటి అంతస్తు నుంచి పడి విద్యార్థికి గాయాలు

MBNR: జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో HYDకు చెందిన సర్కార్(13) అనే బాలుడు ఆరో తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. కాగా గురువారం సాయంత్రం పాఠశాలలో మొదటి అంతస్తుపై నుంచి కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 13, 2026 / 09:40 AM IST

నిబంధనలు పాటించాల్సిందే: కలెక్టర్

KMR: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 65 కేంద్రాల్లో 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్, పెన్నులు మినహా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.

March 13, 2026 / 09:39 AM IST

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని సన్మానించిన మంత్రి

MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మారం సుమన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని శాలువతో ఘనంగా సన్మానించి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ ఉన్నారు.

March 13, 2026 / 09:38 AM IST

వరంగల్ జిల్లాలో 9,492 మంది విద్యార్థులు

WGL: జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపటి నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 4,932, బాలికలు 4,560 మంది ఉన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసారు.

March 13, 2026 / 09:37 AM IST

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

SRPT: రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. మొత్తం పట్టణంలో 11 పరీక్షా కేంద్రాల్లో 1,485 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలియజేశారు.

March 13, 2026 / 09:33 AM IST

ఆత్మ ఆధ్వర్యంలో రైతులతో చర్చా గోష్టి

KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులతో శాస్త్రవేత్తలు నిన్న చర్చా గోష్ఠి నిర్వహించారు. నూతన వంగడాలు, ఆయిల్ పామ్ సాగు, ఉద్యానవన పంటలు, పంటల్లో వచ్చే కీటకాలు తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ చత్రునాయక్, హుజూరాబాద్ ఏడీఏ జీ. సునీత పాల్గొన్నారు.

March 13, 2026 / 09:33 AM IST

హైదరాబాద్‌లో IHCL గేట్వే హోటల్

HYD: ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ IHCL, నగరంలోని సోమాజిగూడలో కొత్త గేట్వే హోటల్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లు డి.శివరామరాజు, డీవీఎస్ సోమరాజులతో ఒప్పందం కుదుర్చుకుంది. 225 గదులతో నిర్మితమయ్యే ఈహోటల్‌లో అత్యాధునిక రెస్టారెంట్లు ఉంటాయి. దీంతో తెలంగాణలో IHCL హోటళ్ల సంఖ్య 8కి చేరగా, గేట్వే బ్రాండ్ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరనుంది.

March 13, 2026 / 09:32 AM IST

ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి మహాయాగం

PDPL: రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో 30వ వార్షికోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లోక కళ్యాణార్థం 108 మంది పుణ్య దంపతులతో శ్రీ ఆంజనేయ స్వామి మహా యాగం కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా యాగం,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ సతీశ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

March 13, 2026 / 09:32 AM IST