NGKL: సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకమని విమర్శించారు. అంబేడ్కర్ చౌరస్తాలో కట్టెల పొయ్యితో వినూత్న ధర్నా నిర్వహించారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల జీవన వ్యయం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
GDWL: అయిజ సింగిల్ విండో ఛైర్మన్గా పోతుల మధుసూదన్ రెడ్డి మంగళవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. గతంలో పాలకవర్గాల గడువు ముగిసిందనే కారణంతో ప్రభుత్వం ఇన్ఛార్జ్లను నియమించగా, దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం 597 జీవోను ఉపసంహరించుకోవడంతో, కోర్టు ఆదేశాల మేరకు పాత పాలకవర్గమే మళ్లీ కొలువుదీరింది.
MBNR: జడ్చర్ల బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మే 7న ఉదయం 10 గంటలకు కొహేన్స్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించనున్నారు. బీ.ఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని ప్రిన్సిపల్ జి. సుకన్య, ప్లేస్మెంట్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు మరిన్ని వివరాల కోసం కళాశాలను సంప్రదించాలన్నారు.
MDK: కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్తో కలిసి 96 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
KMM: మధిర మండలంలో ప్రజాపాలనలో భాగంగా రైతు వారోత్సవాల్లో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగుపై కార్యక్రమం నిర్వహించారు. AMC ఛైర్మన్ బండారు నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. పంట అవశేషాలు కాల్చవద్దని సూచించారు. వ్యవసాయ అధికారులు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, బిందు సేద్యం ప్రాముఖ్యత వివరించారు.
SRD: గ్రామంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు సాఫీగా జరుగుతాయని ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. మంగళవారం కంగ్టి మండల పరిషత్ ఆఫీసులో సర్పంచ్, కార్యదర్శి, ఈజీఎస్ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న EGS అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని MPDO సూచించారు. ప్రతి గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలన్నారు.
JGL: జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) మరియు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, ప్రతినిధి సుజన్ దాస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ప్లేస్మెంట్ ఆధారిత శిక్షణ అందించనున్నారు.
SDPT: రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన కేసీఆర్, నిరసన తెలిపిన అన్నదాతలకు సంకెళ్లు వేయించిన చరిత్రను మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద సరిపడా గన్ని సంచులు ఉన్నాయని, రాజకీయ లబ్ధి కోసమే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
KNR: సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పర్సన్ ఇంఛార్జ్గా బిల్లా వెంకట్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 12మంది డైరెక్టర్లు పర్సన్ ఇన్ఛార్జ్ మెంబర్లుగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది వీరి పదవి కాలం పూర్తి కాగా, మరోసారి ఆరు నెలలు పొడిగించారు. తరువాత ప్రత్యేక అధికారి పాలన సాగింది.
SRCL: గడ్డితో బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఆదాయం సంపాదించవచ్చనే ఆలోచన ఇక్కడ నుంచే మొదలవడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గంభీరావుపేటలో మంగళవారం ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంట వ్యర్థాలను కాల్చి నిరుపయోగంగా మార్చుతున్నారని తెలిపారు. తద్వారా కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటల గురించి ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాల గురించి బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని హనుమాన్ నగర్ వద్ద గల భగవాన్ రెడ్డి ఆయిల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు.
WGL: రాష్ట్రంలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రేపు వరంగల్లో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు వర్దన్నపేట మాజీ MLA ఆరూరి రమేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను గాలికి వదిలేసిందని, ధాన్యం కొనకుండా అన్నదాతలను ఇబ్బంది చేస్తున్నారన్నారని మండిపడ్డారు. BRS రైతు సదస్సుకు రైతులు భారీసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
జనగామ DROగా రాజన్న సిరిసిల్ల జిల్లా RDOగా పని చేస్తున్న సీహెచ్.వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన రేపు(బుధవారం )బాధ్యతలు స్వీకరించనున్నారు. డీఆర్వో నియామకంతో కొంత మేర రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యే ఆస్కారం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
BHPL: నిన్న కాటారం మండలంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ నేతలు అన్నారు. అనునిత్యం మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై కావాలనే బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, BRS నేతల మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.