ASF: పెంచికలపేట్ మండలం కొండపల్లిలో దశాబ్దాల క్రితం నిర్మించిన పురాతన భావి శనివారం అకస్మాత్తుగా కుంగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సర్పంచ్ రుక్మాబాయి బావిని పరిశీలించారు. మంచినీటి బావి కుంగిపోవడంతో నీటి కష్టాలు తప్పవని స్థానికులు తెలిపారు. స్పందించిన ఆమె త్వరలోనే బావికి అవసరమైన మరమ్మతులు చేపట్టి పునరుద్ధరిస్తామన్నారు.
WGL: జిల్లాలో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా,సత్య శారద అధికారులను ఆదేశించారు. MGM ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
KMM: బోనకల్ మండలంలో కార్తికేయ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని గమనించిన నానమ్మ కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గొర్రెల కాపరిగా పనిచేస్తున్న అతను రాత్రి స్నేహితులతో వెళ్లి వచ్చిన తర్వాత అద్దె షెడ్డులో విగతజీవిగా పడి ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
NLG: చిట్యాల మండలం నేరడలో ప్రభుత్వ భూమిలో గత నాలుగు రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు గుర్తించిన తహసీల్దార్ విజయ్కుమార్, శనివారం సాయంత్రం రెండు జేసీబీలు, ఒక టిప్పర్ను సీజ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు.
KMR: తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశ నిర్ణయాలపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని పోడు రైతుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ విక్టర్ ఉన్నారు
MDK: మనోహరాబాద్ మండలం కూచారం కేజీబీవీ విద్యాలయాన్ని సర్వ శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాడ్యులర్ కిచెన్ను పరిశీలించి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ గౌతమి, ఎంఈవో వెంకటస్వామి, ఈఈ మధుసూదన్ పాల్గొన్నారు.
SRD: జిల్లా దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న స్కూటీలు రెండు నెలలుగా కలెక్టర్ కార్యాలయంలో వృథాగా ఉన్నాయి. ఫిబ్రవరిలో 50 మంది దివ్యాంగుల కోసం దివ్యాంగుల శాఖ స్కూటీలను తెప్పించింది. వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్యాలయంలో మూలకు చేరాయి. ఎంపిక చేసిన దివ్యాంగులకు వెంటనే పంపిణీ చేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
MDK: తూప్రాన్ టోల్గేట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సామర్థ్యానికి మించి పశువులను తరలిస్తున్న డ్రైవర్, క్లీనర్, యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పశువులను గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.
NRPT: మక్తల్ మండలంలోని మంథన్గోడ్-జక్లేర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణం నాణ్యతతో ఉండేలా, పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ వంతెనతో రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
JN: కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్కు ఝాన్సీరెడ్డి హాజరై మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.
KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి మొత్తం 26 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. నాలుగు పదవులకు జనరల్ విభాగంలో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. మైనారిటీ విభాగంలో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ త్వరలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
MNCL: మందమర్రికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా ఈ-మ్యాగజైన్లో చోటు సంపాదించడంతో పాటు అంబేద్కర్ రాష్ట్రీయ సమ్మాన్-2026 పురస్కారాన్ని సైతం అందుకున్నారు. పాఠశాల యూనిఫాంలో విద్యార్థులతో పాటు ధరించి, బోధించడం ద్వారా క్రమశిక్షణను, సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ యూనిఫామ్ టీచర్గా ప్రాచుర్యం పొందారు.
MBNR: లాభార్జన మాత్రమే కాదు వ్యాపారులు విలువలతో కూడిన వ్యాపారం చేయాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్లో శనివారం మహబూబ్ నగర్ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాపారులను ప్రజలు నమ్మితే మరోవైపు చూడరని వెల్లడించారు.
NZB: నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను చీఫ్ ఆఫీస్కు బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్కు బాధ్యతలు అప్పగించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శుభం ప్రకాష్ గతంలో కరీంనగర్ రూరల్ ఏసీపీగా పనిచేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోనూ విధులు నిర్వర్తించారు.