నల్లగొండలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శేఖర్ ఈవోగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్లో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నాడు. ఆ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తోపాటు పలువురు అభినందించారు.
SRPT: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై సైదులు అనే యువ రైతు మృతి చెందాడు. మంగళవారం చివ్యెంల మండలం వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సైదులు, కరెంట్ సరఫరాను సరిచేసే క్రమంలో ప్రాణాలు వదలడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
HYD: మహిళా సాధికారతలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భూమిపూజ చేశారు. నగరంలో మంజూరైన 4 హాస్టళ్లలో భాగంగా దీనిని నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు, ఉద్యోగినులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
SRD: నారాయణఖేడ్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్ వారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం గ్రామపంచాయతీలో రోడ్లు శుభ్రత, మురికి కాలువల్లో పూడిక, చెత్తాచెదారం తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగాయి. మండలంలోని లింగాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి పనులను పర్యవేక్షించారు. గ్రామ స్వచ్ఛత కోసం ప్రజలు సహకరించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని KGBV, మూకమామిడి ఏకలవ్య పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, భోజన నాణ్యత, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. లక్ష్య సాధన కోసం కష్టపడి చదివి రాబోయే పరీక్షల్లో విజయం సాధించాలని ప్రోత్సహించారు.
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) ద్వారా యువతకు ఉత్తమ శిక్షణ, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఇవాళ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ITC కేంద్రాన్ని సందర్శించారు. 2D, 3D మిషన్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్, ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించారు.
HYD: సికింద్రాబాద్ కేంద్రంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సరోగసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద డాక్టర్ నమ్రత కుటుంబానికి చెందిన రూ.29.76 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
KNR: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలనూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సచివాలయంలో శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027 క్యాబినేట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.
WNP: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 12న నిర్వహించబోయే గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.
KMR: కన్నతండ్రే ముగ్గురు పసికందులను చెరువులో పడేసి ప్రాణాలు తీసిన అమానుష ఘటనపై సలహాదారు షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు బాధిత తల్లిని పరామర్శించిన ఆయన చిన్నారుల మరణాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బాధితురాలికి ఆర్థిక సాయం అందజేసి, ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఆమె జీవనోపాధి కోసం ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామన్నారు
NZB: TU పరిధిలోని డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలల ఖో-ఖో (పురుషుల, మహిళల) జట్ల ఎంపిక మంగళవారం ప్రారంభమైంది. వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జీ. బాలకిషన్ మాట్లాడుతూ.. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు కర్ణాటకలోని దావణగెరె యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ (2025-26) పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల కానుక రూపంలో వచ్చిన 28 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. అందులో నగదు రూ.1,86,44,511. మిశ్రమ బంగారం 57 గ్రాముల, 500 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 KG 750 గ్రాములు, స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
NLG: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్ మసీదులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని వారితో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండీ యూసుఫ్, వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా పాల్గొన్నారు.
VKB: తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ అనన్యతో కలిసి మంగళవారం షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. సాయిబాబాను కొలిస్తే అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
MDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. TNGO జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి కలిసి ఈ పోటీలను ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, టీఎన్జఓస్ యూనియన్, గెజిటెడ్ అధికారుల సంఘం మరియు క్రీడల శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.