• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పంచాయతీ సమావేశంలో ఉద్రిక్తత..!

SDPT: దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో సర్పంచ్ తోడంగి సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ పాలక మండలి సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమావేశం జరుగుతుండగా కొందరు వ్యక్తులు, యువకులతో కలిసి వచ్చి సర్పంచ్, పాలక మండలి సభ్యులపై దాడికి యత్నించినట్లు సమాచారం. గ్రామస్థులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సర్పంచ్ భర్తపైనా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది.

June 3, 2026 / 04:41 PM IST

సీఎం పర్యటన అడ్డుకుంటాం: ABVP

NGKL: విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా రేపు జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని ఏబీవీపీ హెచ్చరించింది. ఈ మేరకు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శాంతన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సొంత జిల్లాలోనే విద్యా రంగ సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 

June 3, 2026 / 04:36 PM IST

ఈనెల 5వ తేదీన మినీ జాబ్ మేళా

MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఈనెల 5వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. శ్రీ ఆర్యవర్త ఇన్ఫోటెక్‌లో 20 ఖాళీలు ఉన్నాయన్నారు. 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్న జాబ్ మేళాలో ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు హాజరై జాబ్ మేళా విజయవంతం చేయాలని కోరారు.

June 3, 2026 / 04:35 PM IST

తెలంగాణ రక్షణ సేనలో చేరికలు

KNR: కరీంనగర్‌లో బుధవారం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు, యువకులు పార్టీలో చేరారు. జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతంకు కృషి కృషి చేస్తామన్నారు.

June 3, 2026 / 04:35 PM IST

ఎండల నుంచి కాస్త ఉపశమనం

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈదురుగాలులు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. ఆకాశం అంతా మేఘావృతమైనప్పటికీ వర్షం మాత్రం కురవలేదు. అయినప్పటికీ, చల్లటి గాలులు వీయడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు.

June 3, 2026 / 04:33 PM IST

ఐటీఐలో ప్రవేశాల నోటిఫికేషన్

SRPT: హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరవచ్చు. అభ్యర్థులు జూన్ 8లోపు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8247506920, 9160284139 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన అన్నారు.

June 3, 2026 / 04:32 PM IST

జిల్లా కార్యవర్గంలో చిట్యాల జర్నలిస్టులు

NLG: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ) నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గంలో చిట్యాలకు చెందిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఏళ్ల బయన్న, సహాయ కార్యదర్శిగా పెద్ది నరేందర్‌లను రాష్ట్ర నాయకులు ప్రకటించారు. గతంలో జిల్లా ప్రెస్ క్లబ్‌లో బాధ్యతలు నిర్వహించిన వీరి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

June 3, 2026 / 04:32 PM IST

గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్‌గా తాన్య

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా తాన్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ అధికారికంగా పదవి బాధ్యత చేపట్టిన ఆమె ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి పారిశుద్ధ్యం మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు.

June 3, 2026 / 04:28 PM IST

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

SRCL: ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణకు ప్లాస్టిక్ తగ్గించాలన్నారు.

June 3, 2026 / 04:25 PM IST

గద్వాల పర్యటనపై బీఆర్ఎస్ నేతల విమర్శలు

GDWL: నడిగడ్డలోని ప్రాజెక్టులను ప్రక్షాళన చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి గద్వాల జిల్లా పర్యటన ఎందుకని బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు, బీఎస్ కేశవ్, నాగర్ దొడ్డి వెంకట్రాములు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గట్టు ఎత్తిపోతల, నెట్టెంపాడు, తుమ్మిళ్ల ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

June 3, 2026 / 04:22 PM IST

ఖమ్మం పోలీస్ వెల్ఫేర్ స్కూల్లో ఉద్యోగావకాశాలు

ఖమ్మం పోలీస్ వెల్ఫేర్ హైస్కూల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఛైర్‌పర్సన్ నిష్ఠ శర్మ తెలిపారు. బయాలజీ టీచర్, సంగీత ఉపాధ్యాయులు, మహిళా సహాయక సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 8లోగా తమ బయోడేటాను ఇ- మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.

June 3, 2026 / 04:20 PM IST

‘మోడల్ మార్కెట్‌ను వెంటనే ప్రారంభించాలి’

MHBD: పట్టణంలో నిర్మాణం పూర్తై నెలలు గడిచినా మోడల్ మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై CPI నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కూరగాయల తోపుడు బండిని ముందుంచి, కూరగాయలతో తయారు చేసిన దండలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం గాంధీ పార్కులో తాత్కాలికంగా కొనసాగుతున్న కూరగాయల దుకాణాలను వెంటనే నూతన మోడల్ మార్కెట్‌కు తరలించాలన్నారు.

June 3, 2026 / 04:19 PM IST

అకాల వర్షంతో రైతుల అవస్థలు

ADB: బోథ్, సొనాల మండలాలలో బుధవారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. సోనాల మండల కేంద్రంతో పాటు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్, దన్నూర్ ( బి ), మర్లపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన జొన్నల కొనుగోలు కేండ్రాలలో రైతులు నిలువ చేసుకున్న ధాన్యపు బస్తాలను వర్షం నుంచి కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డారు.

June 3, 2026 / 04:17 PM IST

కరీంనగర్ ఆర్డీవోగా నల్ల వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరణ

KNR: కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారిగా నల్లా వెంకట్ రెడ్డి బుధవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. గత ఆర్డీవో మహేశ్వర్ రిటైర్డ్ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో భూ సర్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన నల్ల వెంకటరెడ్డిని కరీంనగర్ ఆర్డీవోగా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెంకట్ రెడ్డి తెలిపారు.

June 3, 2026 / 04:16 PM IST

పిల్లలందరినీ బడికి పంపించాలని ర్యాలీ

ASF: పిల్లలందరినీ బడికి పంపించాలని వాంకిడి మండలం బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. బుధవారం బడిబాట కార్యక్రమంను ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పాఠశాల వయసున్న ప్రతి ఒక్కరినీ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

June 3, 2026 / 04:14 PM IST