భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని KGBV, మూకమామిడి ఏకలవ్య పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, భోజన నాణ్యత, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. లక్ష్య సాధన కోసం కష్టపడి చదివి రాబోయే పరీక్షల్లో విజయం సాధించాలని ప్రోత్సహించారు.