JN: జాఫర్ ఘడ్ మండలంలోని కూనూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ దేవేంద్ర మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సర్పంచ్ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య పాల్గొన్నారు.
GDWL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ సేవలను స్మరించుకుని, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.
ADB: పర్దాన్ జనజాతి ఉత్తన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షుడిగా గెడమ్ జగన్నాథ్ నియమించినట్లు సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగన్నాథ్ మాట్లాడుతూ.. మండల పర్దాన్ సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్దాన్ సమాజ్ నాయకులు పాల్గొన్నారు.
SRD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మండల స్థాయి సమావేశం ఈనెల 16 నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్తయ్య మంగళవారం తెలిపారు. కంగ్టిలోని బసవ ప్రదీప్ ఫంక్షన్ హాల్లో మండల ప్రత్యేక అధికారి నూతన కుమార్ అధ్యక్షతనలో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు సకాలంలో రావాలని ఆయన కోరారు.
MDK: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగు జాడలలో నడుస్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నా రు. అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో నిర్వహించగా, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
BHNG: పోచంపల్లి మండలం గౌస్ కొండలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా షికారుకు వెళ్లి గల్లంతైన శివ అనే యువకుడి మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఆరుగురు స్నేహితులు నాటు పడవపై వెళ్తుండగా, పడవలోకి నీరు చేరడంతో ప్రమాదం సంభవించింది. ప్రాణభయంతో అందరూ నీటిలోకి దూకగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈత రాని శివ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
NZB: ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన మహానేత అని కొనియాడారు.
BHPL: రేగొండ మండలంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ పార్లమెంటు కో-కన్వీనర్ ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
KMM: భక్తిశ్రద్ధలు ఆధ్యాత్మిక పరిమళాల మధ్య కల్లూరు మండలం నారాయణపురం గ్రామం పులకించిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగృహంలో హనుమాన్ చాలీసా పారాయణ ఘట్టం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణంతో మంత్రి నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యావత్ రాష్ట్ర ప్రజలపై అంజన్న ఆశీస్సులు ఉండాలని మంత్రి తెలిపారు.
MHBD: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మంచి ధర పొందాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటో రామచంద్రనాయక్ సూచించారు. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
NGKL: తమ సమస్యల పరిష్కారం కోసం 9 కార్మిక సంఘాల జేఏసీ పిలుపుతో ఆర్టిజన్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా బాబాసాహెబ్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. ఉమ్మడి MBNR జిల్లాలో సుమారు 2,500 మంది పాల్గొంటూ, డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోమని నేతలు తెలిపారు.
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని మానసపల్లిలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి స్థానికులు పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు అన్నారు. కృష్ణవేణి, రామకృష్ణ, లాలూ, ప్రతాప్, తదితరులు ఉన్నారు.
MBNR: మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. అధ్యాపక బృంద కృషిని ప్రశంసిస్తూ, విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.
HNK: అంబేద్కర్ ఆశయ సాధనే కాంగ్రెస్ లక్ష్యమని DCC అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. వెంకట్రామ్ రెడ్డి నేతృత్వంలో స్థానిక కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
NRPT: కృష్ణ మండలం కాన్ దొడ్డి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రైతు ఎద్దులను అపహరించారు. కుమ్మరి హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పొలంలో కట్టిన ఎద్దులు సోమవారం కనిపించలేదు. ఉదయం లింగంపల్లి శివారులో చెట్టుకు కట్టిన స్థితిలో లభించాయి. చీకటి లేదా భయంతో దొంగలు వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. ఎద్దులు దొరకడంతో రైతు ఊపిరి పీల్చుకున్నాడు.