SRD: హత్నూర మండలం బోర్పట్ల చివరిలో నూతనంగా నిర్మించిన బయోలాజికల్ పరిశ్రమను రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.