NZB: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో వైద్యులు మొట్టమొదటిసారిగా ఓ ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ (45) అనే మహిళకు సర్జరీ విభాగాధిపతి డా. విజయ్ కుమార్ పర్యవేక్షణలో, ప్లాస్టిక్ సర్జన్ డా. శివాని ఆధ్వర్యంలో ‘రొటేషన్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్’ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
MBMR: దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR పై సన్నాహక సమావేశాన్ని కొత్తకోటలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అద్వర్యలో నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. సభ్యత్వం వలన లాభాలను కార్యకర్తలకు వివరించారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం బడిబాట, విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం 33 వేల నోట్ పుస్తకాలను మంజూరు చేసింది. ఇవాళ్టి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇండెంట్ ప్రకారం వీటిని అందజేయడం జరుగుతుందని రామాయంపేట మండల విద్యాధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
SRPT: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ‘బడి బాట’ కార్యక్రమంపై గ్రామ సభల్లో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గ్రామాల్లోని పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
ADB: గుడిసెలు లేని తెలంగాణాను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామ, వార్డు సభల నిర్వహణ, ఏర్పాట్లు, సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
SRD: హత్నూర మండలం బోర్పట్ల చివరిలో నూతనంగా నిర్మించిన బయోలాజికల్ పరిశ్రమను రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
JGL: రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు న్యాతగిరి సంజన, దోనిపాల రాజ్దీపక్ పదో తరగతిలో ప్రతిభ కనబర్చి బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ETCA) సభ్యులు విరాళాల ద్వారా రూ.50 వేల సహాయం అందించారు.
KMR: జుక్కల్ మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో హైబ్రిడ్ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం సొసైటీ ఛైర్మన్ శివానంద్, కార్యదర్శి రాకేష్ గౌడ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ మరియు కార్యదర్శి మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు.
SRPT: రైతు డిస్కం నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) నేత టి.సాగర్ డిమాండ్ చేశారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. సబ్సిడీల ఎత్తివేతతో రైతులు, పేదలకు నష్టం వాటిల్లుతుందన్నారు. వ్యవసాయ ఇన్పుట్ల సరఫరా, కౌలు రైతులకు రుణాలు, కార్మిక చట్టాల రక్షణ మరియు ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.
ములుగు జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగరాజు ఫిట్నెస్ కోసం ప్రారంభించిన సైక్లింగ్లో విశేషప్రతిభ చూపిస్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్పై ప్రయాణించి ఆయన రికార్డు సాధించారు. వారాంతాల్లో సుదూర ప్రాంతాలకు సైక్లింగ్ చేస్తూ వృత్తితో పాటు క్రీడల్లోనూ ప్రశంసలు అందుకుంటున్నారు. నేడు వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా ఆయన సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరులోని గోపి చెరువులో అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బర్డ్ వాచ్ కార్యక్రమం నిర్వహించారు. వలస పక్షుల ప్రాధాన్యం, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సహజ వ్యవసాయం, భూసార పరీక్షలు, వాననీటి సంరక్షణ, సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు పలు సూచనలు చేశారు.
SRD: అందోల్ నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి-పోల్కంపల్లి రోడ్డుపై ఈరోజూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న అఫ్రోజ్ (23) అనే యువకుడు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో అతని కుడి కాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు సమాచారం అందించడంతో మునిపల్లి 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, జిల్లా ఆసుపత్రికి తరలించారు.
WNP: ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 5న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు దేవేంద్రనాథ్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 50 ఏళ్లు పైబడిన దృష్టిలోపం గలవారు రావచ్చున్నారు. ఆత్మకూరు, అమరచింత, నర్వ, మదనాపురం మండలాల పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
RR: హఫీజ్పేట్ రైల్వే బ్రిడ్జిపై మియాపూర్ వైపు వెళ్తున్న వాహనం బ్రేక్ డౌన్ కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వాహనదారులు గమనించి అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని, లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా గమ్యాన్ని చేరాలని కోరారు.
BDK: ములకలపల్లి మండలం, జగన్నాధపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త షఫీ ఇవాళ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం వారి గ్రామానికి చేరుకుని షఫీ బౌద్ధకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.