• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆత్మకూర్ కోఆప్షన్‌కు దరఖాస్తులు ప్రారంభం

WNP: ఆత్మకూర్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల కోసం ఇవాళ ఒకరు దరఖాస్తు చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శశిధర్ తెలిపారు. కోఆప్షన్‌లో ఒక స్థానం జనరల్, మరోటి మహిళకు రిజర్వ్ చేసినట్లు చెప్పారు. పట్టణానికి చెందిన సుదర్శన్ శెట్టి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

April 17, 2026 / 04:03 PM IST

ఆ ఎంపీ రాజీనామా చేయాలి:DCC

ADB: తెలంగాణ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాజీనామా చేయాలని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. తెలంగాణ విభజన ఆశాస్త్రీయంగా ఉందన్న వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 17, 2026 / 04:01 PM IST

‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

SRCL: సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చందుర్తి మండల సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎడ్ల కిషన్, రమాదేవి అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ లాగిశెట్టి భూపతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 2023 కమిషన్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాన్నారు.

April 17, 2026 / 04:01 PM IST

క్రికెట్ టోర్నీ సీజన్-2 ప్రారంభం

JGL: జగిత్యాలలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర భీష్మ క్రికెట్ టోర్నీ సీజన్-2 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ సమిండ్ల వాణి ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందిస్తాయని అన్నారు. ఈ టోర్నీ యువత ప్రతిభను వెలికితీసే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జట్లకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

April 17, 2026 / 04:01 PM IST

ఇస్రో ‘యువిక-2026’కు శ్రీనిత్య ఎంపిక

JGL: జిల్లాకు చెందిన చిలివేరి శ్రీ నిత్య ఇస్రో ప్రతిష్టాత్మక ‘యువిక-2026’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఎంపికైన 15 మంది విద్యార్థుల్లో ఆమె ఒకరు. ఈ అరుదైన అవకాశంతో జిల్లా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బీ. ఎస్ లత ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

April 17, 2026 / 04:01 PM IST

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

MNCL: ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల దీర్ఘకాల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం టీజీ జెఎసీ ఆధ్వర్యంలో మంచిర్యాల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు బండి రమేష్ మాట్లాడుతూ.. 2023 జూన్ నుంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలు, బిల్లులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.

April 17, 2026 / 04:00 PM IST

జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

NZB: జిల్లాలో వరిధాన్యం సేకరణ, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్ రూం 08462-220183 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని సూచించారు.

April 17, 2026 / 04:00 PM IST

రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

WNP: రహదారి భద్రత నియమాలను పాటించడం అత్యంత ముఖ్యమని ప్రతి ఒక్కరూ రహదారిపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో గత నాలుగు నెలల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదలలో ఇప్పటికే 20 మందికి పైగా దుర్మరణం చెందారని అది అత్యంత బాధాకరమన్నారు.

April 17, 2026 / 03:55 PM IST

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

NGKL: పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట సాయినగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు నినదించారు. ప్రస్తుత పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.

April 17, 2026 / 03:54 PM IST

సంగారెడ్డి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ అభ్యర్థుల ఎంపిక

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ కో ఆప్షన్ అభ్యర్థులను ఎంపిక చేశారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ తూర్పు నిర్మలజగ్గారెడ్డి సూచనల మేరకు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ వెల్లడించారు. రాంనగర్ మాజీ కౌన్సిలర్ శివశంకర్ (శివుడు), శివాజీనగర్ మాజీ కౌన్సిలర్ కల్వకుంట యశోద, మైనార్టీ నుంచి రిక్షా కాలానికి చెందిన మహమ్మద్ సలావుద్దీన్ పేర్లు ఖరారయ్యయని తెలిపారు.

April 17, 2026 / 03:53 PM IST

‘​విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు తీర్చాలి’

MBNR:  విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ మెదక్ ఇంఛార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్‌లో 10వ రోజు సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని, ప్రభుత్వం స్పందించకుంటే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు కార్యాలయం ముందు వంటా వార్పు నిర్వహించారు.

April 17, 2026 / 03:49 PM IST

బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: MLA

HNK: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని, ఇది ఒక కుట్రగా ప్రజలకు ఇప్పుడు బహిర్గతమవుతోందని, దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపడం మానుకుని సమానత్వంతో వ్యవహరించాలని అన్నారు.

April 17, 2026 / 03:47 PM IST

సిద్ధిపేట కేవీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

SDPT: జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 25 వరకు పాఠశాలలో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం 40 సీట్లకు గాను, మొదట కేవిలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

April 17, 2026 / 03:44 PM IST

తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం

RR: రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కడ్తాల్ మండల కేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మండల అధ్యక్షుడు బోసు రవి ఆధ్వర్యంలో ఎంపీ తేజస్వి సూర్య దిష్టి బొమ్మను ఇవాళ దహనం చేశారు. క్యామ రాజేష్, ఎం.డి. షాబుద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఎన్నో త్యాగాల ఫలితమని, దాన్ని అవమానించడం ఖండిస్తున్నామన్నారు.

April 17, 2026 / 03:44 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుక్ ఎగ్జిబిషన్

KMM: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుక్ ఎగ్జిబిషన్ నేడు నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు, వివిధ విభాగాలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించేందుకు ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల పుస్తకాలు పరదర్శించినట్లు పేర్కోన్నారు.

April 17, 2026 / 03:42 PM IST