• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

NRPT: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రథంగ్ పాండు రెడ్డి అన్నారు. అమృత్ పథకంలో భాగంగా నారాయణపేట పట్టణంలోని 17వ వార్డులో చేపట్టిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులను ఛైర్ పర్సన్ శ్వేతతో కలిసి ప్రారంభించారు. మున్సిపాలిటీకి రూ.22 కోట్ల, 66 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.

May 5, 2026 / 04:29 PM IST

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

NZB: గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు తగ్గేదేలే అంటున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లో 45°C, మంచిప్ప 44.9, మెండోరా, మోస్రా 44.8, జక్రాన్ పల్లి, సాలూరా 44.7, NZB (సౌత్) 44.6,భీమ్ గల్, కమ్మర్ పల్లి 44.3, పెర్కిట్ 44.2,°C ల ఉష్ణోగ్రతలు నమోదు కాగా KMR జిల్లాలో భిక్కనూరు 44°C, ఎల్పుగొండ 44.7, బిచ్కుంద 44.6°Cగా రికార్డయ్యాయి.

May 5, 2026 / 04:29 PM IST

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని చేనుగోనిపల్లి, అనంతపురం, బసల్‌చెరువు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలన్నారు.

May 5, 2026 / 04:28 PM IST

నీటిలో మునిగి బాలిక మృతి

KMM: మధిర మండలం వంగవీడు గ్రామంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో దీక్షిత(12) అనే విద్యార్థిని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో కలిసి బ్రిడ్జిని చూడటానికి వెళ్లిన ఆమె, నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. మృతురాలు జితేంద్ర కుమార్తెగా గుర్తించారు.

May 5, 2026 / 04:26 PM IST

వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయాలి: SP

ADB: వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం పట్టణంలోని భరోసా, షీ టీం కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, మహిళలకు అండగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా 100 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

May 5, 2026 / 04:24 PM IST

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

KMR: దోమకొండ మండలంలోని లింగుపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ విక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో లింగుపల్లి సర్పంచ్ పట్నం లక్ష్మీ, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

May 5, 2026 / 04:23 PM IST

మక్కలు బిల్టీ క్వింటాకి రూ.1,940

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం పసుపు, మొక్కజొన్న తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.13,811 ధర, మక్కలు బిల్టీకి రూ.1,940 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. కాగా ఎండ తీవ్రత నేపథ్యంలో హమాలీ కార్మికుల విజ్ఞప్తి మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బుధవారం మార్కెట్ కు సెలవు ప్రకటించారు.

May 5, 2026 / 04:22 PM IST

జనగామలో రైతుల సమస్యలు తెలుసుకున్న కేటీఆర్

JN: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని, రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై నిరసన తెలుపుతున్న రైతులను కేటీఆర్ మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి నిరసనకు మద్దతు తెలిపారు. రైతులకు BRS పార్టీ అండగా ఉంటుందన్నారు.

May 5, 2026 / 04:21 PM IST

చండూరులో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం తనిఖీలు

NLG: చండూరు మున్సిపాలిటీలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’ ఆన్ ఫీల్డ్ అసెస్మెంట్ కొనసాగింది. ప్రతి వార్డులో డోర్ టు డోర్ చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడం, గృహస్థులు హోమ్ కంపోస్టింగ్ చేస్తున్న తీరును అధికారులు సుధాకర్ రెడ్డి, దేవి రెడ్డి పరిశీలించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణను తనిఖీ చేసి, మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు పలు సూచనలు చేశారు.

May 5, 2026 / 04:21 PM IST

‘గోల్డ్ షాపుల వద్ద పటిష్ట భద్రత ఉండాలి’

SRPT: గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులతో డీఎస్పీ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. వ్యాపారులు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని, షాపుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విలువైన నగలను సేఫ్ లాకర్లలోనే ఉంచాలన్నారు. రాత్రి వేళల్లో పోలీస్ బీట్ పెంచామని, ముందస్తు జాగ్రత్తలతోనే నేరాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.

May 5, 2026 / 04:17 PM IST

మట్టి మాఫియాపై పోలీసుల కొరడా

BHNG: మోట కొండూరు మండల పరిధిలోని వర్టూరు చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. అనుమతులు ఉన్న వాహనాలకు, క్షేత్రస్థాయిలో నడుస్తున్న వాహనాల నంబర్లకు పొంతన లేకపోవడంతో సీఐ శంకర్ గౌడ్ ఈ చర్యలు తీసుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

May 5, 2026 / 04:17 PM IST

అల్వాల్‌లో పీస్ కమిటీ సమావేశం

MDCL: బక్రీద్ పండుగను శాంతియుతంగా, ఐకమత్యంతో జరుపుకోవాలని అల్వాల్ సీఐ ప్రశాంత్ సూచించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ.. ఉత్సవాల సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, మత పెద్దలు పాల్గొని శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

May 5, 2026 / 04:12 PM IST

బాధిత రైతును పరామర్శించిన మాజీ ఎంపీ కవిత

MHBD: కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య అనే రైతుకు చెందిన కాడెడ్లు పిడుగుపాటుకు గురై, మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.

May 5, 2026 / 04:11 PM IST

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

WGL: నర్సంపేట సమ్మెలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో ఆర్డీవో ఉమారాణి, ఛైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, కమిషనర్ భాస్కర్ చెక్కు అందించారు. శంకర్ కుమారుడు హేమంత్‌కు RTC కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

May 5, 2026 / 04:10 PM IST

పాపయ్యపల్లిలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

MLG: వెంకటాపూర్ రామప్ప మండలం పాపయ్యపల్లి గ్రామంలో మంగళవారం హనుమాన్ మహా శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే పూజలు చేసి నగర సంకీర్తనలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో గ్రామం మారుమోగింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామ సుభిక్షం కోసం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

May 5, 2026 / 04:09 PM IST