BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల కానుక రూపంలో వచ్చిన 28 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. అందులో నగదు రూ.1,86,44,511. మిశ్రమ బంగారం 57 గ్రాముల, 500 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 KG 750 గ్రాములు, స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
NLG: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్ మసీదులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని వారితో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండీ యూసుఫ్, వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా పాల్గొన్నారు.
VKB: తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ అనన్యతో కలిసి మంగళవారం షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. సాయిబాబాను కొలిస్తే అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
MDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. TNGO జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి కలిసి ఈ పోటీలను ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, టీఎన్జఓస్ యూనియన్, గెజిటెడ్ అధికారుల సంఘం మరియు క్రీడల శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.
SRCL: ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వల్లంపట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ట్రాలీలో ఉన్న మరో వ్యక్తికి చేయి విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
JN: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. దేవరుప్పుల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులిగిల్ల వెంకన్న యాదవ్ హాజరై మాట్లాడారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు.
WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ మంగళవారం డిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆమెకు పదవి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈభేటీలో వరంగల్ ఎంపీ కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్వర్ణ పేర్కొన్నారు.
NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఈనెల 13,14 తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. 13న మహారుద్ర హోమం, శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, చిన్న రథోత్సవం, అన్నదానం నిర్వహిస్తారు. 14న చక్ర రథోత్సవం, అగ్ని గుండాలు, పెద్ద రథోత్సవం ఉంటాయి. అదేరోజు రాత్రి ఫోక్ సింగర్స్చే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
KNR: 99 రోజుల కార్యాచరణపై స్థానిక ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సీఎస్కే.రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం సీఎస్ కె.రామ కృష్ణా రావు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు.
SDPT: ABVP స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తను ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు కలిసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రకృతి తీవ్రంగా నష్టపోతుందని పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు.
SRPT: మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతకాయల అరుణ్ తన గొర్రెల మందను చెరువు వద్దకు నీరు తాగించడానికి తీసుకువెళ్లగా, విద్యుత్ షాక్తో 23 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. చెరువులో వ్యవసాయ మోటార్లకు ఉన్న విద్యుత్ వైరు నీళ్లలో పడి చెరువు నీటిలో విద్యుత్ సరఫరా కావడంతో ఈ ఘటన జరిగింది.
HYD: చార్మినార్ టాస్క్ ఫోర్స్, అంబర్పేట పోలీసులు 2వ భార్య హత్య కుట్రను ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరుణ్ తన 2వ భార్యపై అనుమానంతో హత్య చేయడానికి పథకం వేశాడు. మహమ్మద్ అబ్బు, మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్ సహకారంతో బీహార్ నుంచి దేశవాళీ పిస్టల్, 6 రౌండ్లు, మ్యాగజైన్ కొనుగోలు చేశాడు. 9న అలీ కేఫ్ వద్ద సమావేశమైన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.
KMM: ఖమ్మం భూదాన్ భూముల వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు బాధితులకు ప్రభుత్వం సహకరించనుంది. ఈ నిర్ణయం భూదాన్ భూముల వివాదంలో బాధితులకు ఊరట కలిగించే పరిణామం.
జగిత్యాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సత్యప్రసాద్ పరీక్షలపై దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వారిని ఎలాంటి స్ట్రెస్కు గురి కావద్దని, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలకు సన్నద్ధం కావాలని జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, మంచి ఆహారం తీసుకోవాలని, ఫోన్లు, టీవీలకు దూరంగా మంచిగా ప్రిపేర్ కావాలన్నారు.
BHPL: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఐడీవోసీ కార్యాలయంలో మెడికవర్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి ఉన్నారు.