MLG: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో మంగళవారం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. చుంచుపల్లి, కొత్త మల్లూరు, మల్లూరు, నరసింహసాగర్, శనగకుంట హ్యాబిటేషన్, పూరేడుపల్లి గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
BHPL: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని మాజీ MLA గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పట్టణంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి, సీఎంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి “యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి” అని, ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల ప్రభావంతో సీఎం పదవికి చేరుకున్నారన్నారు. అందరూ ఆయనలా “తొక్కుకుంటూ” ఎదగలేరని వ్యాఖ్యానించారు.
VKB: వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి పర్యాటకులు తండోపతండాలుగా వచ్చి అనంతగిరి అడవుల్లో, కోట్పల్లి ప్రాజెక్టు పరిసరాల్లో సేద తీరుతుంటారు. కాగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగానే రూ.250 కోట్లతో ఎకో అర్బన్ పార్కును ఏర్పాటు చేసింది. అటవీ శాఖ సరికొత్త హంగులతో అనేక వసతులను ఇక్కడ ఏర్పాటు చేసింది.
RR: సైబరాబాద్లో చెరువుల పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోంది. 12 చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టి దోమల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్లమ్మ చెరువు, చిన్న చెరువులో గడ్డిని తొలగిస్తూ, పరిసర ప్రాంతాలలో తగిన చర్యలు చేపడుతున్నట్లుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక అధికారులు తెలిపారు.
WG: నర్సంపేట కేంద్రంలోని పాకాల సరస్సలోని బుడుగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చెరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప ఖానాపూర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
WNP: తాడిపర్తి నుంచి చెన్నూరుకు వెళ్లే రహదారికి బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మించాలని చెన్నూరు సర్పంచ్ శారద సురేష్ నాయక్ కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. 2023 ఎన్నికల ముందు మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేసిన, నేటికీ పనులు మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు, బ్రిడ్జి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
MBNR: చిన్న చింతకుంట మండలం ఫర్దీపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము పార్టీ మారుతున్నట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NZB: జిల్లా సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో బోధన్లో నిర్వహించిన ‘మన ఊరు-మన బాధ్యత’ కార్య క్రమంలో చందూర్ సర్పంచ్ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. యువత అతివేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు పాటిస్తేనే భద్రత ఉంటుందనిపేర్కొన్నారు.
NLG: నల్లగొండ ఇందిరా భవన్లో మంత్రి కోమటిరెడ్డి యాసంగి వరి ధాన్యం సేకరణపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బంది లేకుండా లారీలు, వెలుతురు సౌకర్యాలు కల్పించి, యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమైందని, 2039 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
KMR: రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్, స్టీఫెన్ రవీంద్ర వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, ప్యాడీ కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు. ప్యాడీ కొనుగోలులో భాగంగా పని చేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ADB: జైనథ్ మండలంలోని కరంజి గ్రామస్తులు DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ను పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఈనెల 26న నిర్వహించనున్న బాజీరావు బాబా సప్తహ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందజేశారు. గ్రామస్తులందరూ కలిసి సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని నరేష్ జాదవ్ పేర్కొన్నారు.
WGL: నర్సంపేటలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆమె పోస్ట్ కార్డులపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు చట్టసభలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
NRML: సోన్ మండలంలోని పాక్పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్స్ సంస్థ CSR కింద రూ. 1 లక్ష విలువైన ఐదు కంప్యూటర్లను మంగళవారం అందజేసింది. విద్యార్థులు సాంకేతిక విద్యలో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
HNK: ఈనెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించే నూతన పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి నడికూడ మండలం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని జాగృతి నేతలు అన్నారు. నడికూడ మండల కేంద్రంలో నూతన పార్టీ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్లను జాగృతి నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దండు సుధాకర్, రమేష్, ప్రభాస్, మధుకర్, చందు ఉన్నారు.
MDCL:HYDలో 325కి పైగా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నప్పటికీ నిబంధనలు అమలు కావడం లేదు. నియమాల ప్రకారం కనీసం 25 గంటల ప్రాక్టికల్ ట్రైనింగ్, రోడ్డు భద్రతపై క్లాసులు తప్పనిసరి. కానీ.. చాలా స్కూల్స్ వారం, పది రోజుల్లోనే కోర్సు ముగిస్తున్నాయి. సరైన శిక్షణ లేకుండా “అన్నీ మేమే చూసుకుంటాం” అంటూ వేలు వసూలు చేసి బ్రోకర్ దందా నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.