ADB: నార్నూర్ మండలం మధ్యాహ్న భోజన కార్మికులు గౌరవవేతనాలు 5 నెలల నుంచి సకాలంలో అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బిల్లులు కూడా చెల్లించలేక, వంటకార్యాల్లో అవరోధాలు ఏర్పడ్డాయి. స్థానికులు నిర్లక్ష్యం లేకుండా మధ్యాహ్న భోజన గౌరవవేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.
NZB: సాలుర మండలం సాలాంపాడ్ గ్రామంలో నేడు బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ సాలూర మండల అధ్యక్షుడు మంధర్నా రవి సోమవారం తెలిపారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రేపు 11 గంటలకు ఆయన ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి సాలుర, బోధన్ మండలాల కాంగ్రెస్ నాయకులు, పాల్గొనాలన్నారు.
WNP: అమరిచింత పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయం నుంచి జములమ్మ అమ్మవారి పట్టు వస్త్రాలను భక్తులు ఊరేగింపుగా తరలించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పట్టు వస్త్రాలను దర్శించుకోవడం సుకృతమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో మొత్తం సీట్లు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని DEO యాదయ్య తెలిపారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 6వ తరగతికి ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు, మిగతా తరగతుల వారికి మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ఉంటుందన్నారు.
PDPL: కమాన్పూర్ మండలంలో 2025 GP ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను JAN 23లోగా అందజేయాలని MPDO ప్రియాంక తెలిపారు. 5 వేల జనాభాకు పైగా గ్రామాల్లో సర్పంచు రూ. 2.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 50 వేలు, తక్కువ జనాభా గ్రామాల్లో సర్పంచ్కు రూ. 1.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 30 వేలు పరిమితిగా నిర్ణయించారు.
JGL: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ నాగం భూమయ్య సోమవారం ప్రారంభించారు. ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని గ్రామంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోకతోట లింబాద్రి, వార్డు సభ్యులు, సంస్థ ప్రతినిధులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
KNR: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా KNR-1 డిపోలో జిల్లా రవాణా శాఖ అధికారులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకై రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్లపై ఏర్పాటు చేసిన సంకేతాలను గమనిస్తూ వాటికి అనుగుణంగా డ్రైవింగ్ చేయాలన్నారు.
ADB: ఇంద్రవెల్లి మండలం ఆందునాయక్ తండా పీఠాధిపతి రామ్ సింగ్ మహారాజ్ సోమవారం ప్రతినిధులతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. నాందేడ్లో నిర్వహించనున్న హింద్కి చాదర్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించగా హోం మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రామ్ సింగ్ మహారాజ్ తెలిపారు. ధర్మగురువు బాబుసింగ్ మహారాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
KMM: బోనకల్ మండలం బిక్కుమల్లలో మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటనలో వెంకటాపురానికి చెందిన యువరాజు, రాజేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 12న బైక్పై వెళ్తున్న మహిళను అడ్డగించి దొంగతనానికి పాల్పడినట్లు సీఐ నరసింహారావు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
SRPT: నూతనకల్ మండల పరిధిలోని బిక్కుమల్ల గ్రామంలో గత వారం రోజుల కింద జరిగిన మహిళ మెడలోని మంగళసూత్రం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నరసింహారావు, సీసీఎస్ సీఐ శివకుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.
SRPT: ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులందరూ ముఖ్యఅతిథి సందేశానికి శాఖల అభివృద్ధి కార్యక్రమాల నివేదికలను పంపించాలన్నారు.
NLG: చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుంచి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు సోమవారం పోలేపల్లిలో ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటల పాటు రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
SRCL: జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సాగు పద్ధతులు, ఫ్యాక్టరీ పనితీరుపై అవగాహన కోసం పలు మండలాల రైతులు బయలుదేరిన బస్సు యాత్రను ఆమె సోమవారం ప్రారంభించారు. ప్రణాళికాబద్ధంగా సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా రైతులు ఆధునిక సాగు మల్లుతారు.
PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో కేజీ వీల్ ట్రాక్టర్తో రోడ్డుపై అక్రమంగా ప్రయాణిస్తూ రహదారి ధ్వంసానికి పాల్పడిన ఓ ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. ట్రాక్టర్ నడిపిన వ్యక్తి మాతంగి హరీశ్ అనే వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్ శ్రీరాంపూర్కు అప్పగించారు. కేజీ వీల్స్తో రోడ్లపైకి చర్యలు తప్పవన్నారు.
జగిత్యాల పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇందిరమ్మ చీరల పంపిణీరుణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో కార్యక్రమాలను పకడ్బందీగ అమలు చేస్తామన్నారు.