సిరిసిల్ల జిల్లా వైపు పెద్దపులి అడుగులు వేస్తున్నట్లు అంచనాలు వెలువడడంతో అటవీ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం జిల్లాను వదిలి నిజామాబాద్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్న పులి, దిశ మార్చి సిరిసిల్ల జిల్లా వైపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రైతులు, పాడి పశువుల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు.
KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ, రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. ఈ పర్యటనలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.
GDWL: ప్రజా సమస్యలపై వచ్చే ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫార్మ్ 6, 7, 8 దరఖాస్తులను పూర్తి చేస్తూ కనీసం 85% పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు.
RR: సైబరాబాద్ సీపీ రమేశ్ 1,016 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. IMEI ద్వారా ఫోన్ల గుర్తింపు ఇప్పుడు CEIR పోర్టల్తో సులభమైందని, మునుపటిలా మాన్యువల్ ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. పోయిన ఫోన్ను వేరే వ్యక్తి వాడిన వెంటనే అలర్ట్ వస్తుందని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక ఆపరేషన్లో 100 మందికిపైగా అరెస్ట్ చేశామన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ సంబంధిత సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు నరేష్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
HNK: కాజీపేట మండలం భట్టుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు అధ్యాపకులు గాయపడ్డారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం సాయంత్రం మళ్లీ గొడవగా మారగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధ్యాపకుల్లో ఒకరికి తలకు గాయం, మరొకరికి చేయి విరిగింది. ఈ ఘటనపై మడికొండ ఎస్సై రాజ్కుమార్ విచారణ చేపట్టారు.
NGKL: నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని దేవుని పడకల్లుకు చెందిన రాజమోని ప్రవీణ్కు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.38,500 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంగళవారం లబ్ధిదారునికి అందజేశారు. నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PDPL: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా సుల్తానాబాద్ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
NRPT: ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు సరైన లబ్ధిదారులకు సులభంగా చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అదనపు కలెక్టర్లు ఫణీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈనెల 12న ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
KNR: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గుంతల మరమ్మతులు చేపట్టినట్లు కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. ప్రజా భద్రత దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
VKB: తాండూరు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని పట్టణ అభివృద్ధి శాఖ నోడల్ అధికారి ఎన్. విశాల్ రాజు ఆదేశించారు. మంగళవారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పన్ను వసూళ్లలో వెనుకంజలో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
HYD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఓయూ పరిధిలోని ఓల్డ్ డైరీ ఫారం ప్రాంతంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ పంపిణీ చేశారు. రంజాన్ మాసం త్యాగం, సేవా భావం సహనానికి ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై మోతే మండలం మామిళ్లగూడెం టోల్ గేట్ వద్ద మంగళవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్సై అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు.
PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల నగర్, శాస్త్రి నగర్ ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సేవలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ఏఈ కిషోర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పూసాల 11 KV ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగించే పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.
జనగామ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మాదారపు విజయ్, ఉపాధ్యక్షులుగా గాదె కృష్ణ వంశీ, ప్రధాన కార్యదర్శిగా జీడి అనుఫ్, కార్యనిర్వాహణ కార్యదర్శిగా రడపాక అరుణ్, సంయుక్త కార్యదర్శిగా గాదెపాక ప్రశాంత్లు ఎన్నికైనట్లు స్వేరోస్ నెట్వర్క్ జిల్లా అధ్యక్షులు ప్యాట రాజు తెలిపారు.