• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య: హెచ్ఎం

NZB: ధర్పల్లి మండలం రేకులపల్లిలో హెచ్ఎం అంకం నరేశ్ ఆధ్వర్యంలో శనివారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వం విద్యను అందిస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని, ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యా అందుతుందన్నారు.

April 18, 2026 / 11:10 AM IST

నేడే IPL మ్యాచ్.. భారీగా ఏర్పాట్లు

HYD: ఉప్పల్లో ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. SRH VS CSK జట్లు తలపడనున్నాయి. అభిమానుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉత్కంఠ భరిత పోరుకు నగరం సిద్ధమైంది. SRH సహా భారీగా CSK ఫాన్స్ సైతం తరలిరానున్నారు. మరోవైపు డిజిటల్ టికెటింగ్ కొనసాగుతోంది.

April 18, 2026 / 11:02 AM IST

కోయిలకొండ కోటకు చారిత్రక ప్రాధాన్యం

MBNR: ఏడు గిరిదుర్గాల్లో ఒకటైన కోయిలకొండ కోట చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. 14వ శతాబ్దంలో అళియ రామరాయల కాలంలో వడ్డెరాజులు నిర్మించిన ఈ కోట తరువాత వెలమ రాజుల వశమైంది. కొండపై దేవాలయం ఉండటంతో ‘కోవెలకొండ’గా పిలిచేవారని, తరువాత కోయిలకొండగా మారిందని చెబుతారు. ఈ కోట నిర్మాణ కౌశలం నేటికీ ఆకట్టుకుంటోంది.

April 18, 2026 / 11:00 AM IST

బస్టాండ్ లేకపోవడంతో.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

BHPL: కాటారం మండల కేంద్రంలో RTC బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CPI(ML) లిబరేషన్ నేత ఆత్కూరి శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగానైనా ఈ సమస్యకు పరిష్కారం చూపి, తక్షణమే బస్టాండ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో CPI(ML) నేతలు ఉన్నారు.

April 18, 2026 / 10:49 AM IST

‘భూ అక్రమణదారులను శిక్షించాలి’

BDK: పినపాక మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలెం కోటి మాట్లాడుతూ.. గుట్ట మల్లారం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 38, 39, 49 చెరువులు కుంటలు నాళాలు కబ్జాకు గురి అయ్యాయని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

April 18, 2026 / 10:47 AM IST

రోడ్ల పై గార్బేజ్ కనిపించిందా..? ఫిర్యాదు చేయండి

MDCL: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై ఎక్కడైనా చెత్త కనిపిస్తే వెంటనే స్పందించండి. పరిశుభ్రత కోసం ప్రజల సహకారం అవసరం అని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. చెత్తను రోడ్లపై పడేయకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడైనా గార్బేజ్ కనిపిస్తే 9063421300 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

April 18, 2026 / 10:44 AM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS నేతలు

JN: దేవరుప్పుల మండలం నిర్మలా గ్రామానికి చెందిన BRS పార్టీ వార్డు సభ్యుడు కల్వల నగేష్, సీనియర్ నాయకుడు కడబోయిన సోమన్న BRS పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవ పట్ల ఆకర్షితులై చేరుతున్నట్లు తెలిపారు.

April 18, 2026 / 10:44 AM IST

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

SRPT: పెన్‌పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్ వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరేసుకొని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 18, 2026 / 10:44 AM IST

HYDకి బయలుదేరిన.. రేగొండ ఉద్యమకారులు

BHPL: రేగొండ మండల కేంద్రం నుంచి హైదరాబాద్‌లోని తార్నాకలో మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి ఉద్యమకారులు ఈరోజు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రేగొండ తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, తిరుపతి గౌడ్, దాసరి తిరుపతి రెడ్డి, ఐలి శ్రీధర్ గౌడ్, వడ్లకొండ రమేష్ గౌడ్, కానుగంటి శ్రీనివాస్, బట్టు శ్రీనివాస్ ఉన్నారు.

April 18, 2026 / 10:38 AM IST

వికారాబాద్ మెయిన్ రోడ్డులో అధ్వానం

వికారాబాద్ జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రధాన రోడ్డు ఎన్నేపల్లి వద్ద మురుగునీటి గుంట ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ప్రధాన రహదారి అయిన మెయిన్ రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లి ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అన్నింటికీ తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

April 18, 2026 / 10:37 AM IST

నేటి నుంచి జనగణనపై సిబ్బందికి శిక్షణ

MDK: చిన్నశంకరంపేట మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జనగణన శిక్షణ కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి ఇవాళ పరిశీలించారు. ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 78 మందిని రెండు బృందాలుగా విభజించి, ఒక్కో బృందానికి మూడు రోజుల పాటు శిక్షణ అందిస్తామన్నారు.

April 18, 2026 / 10:34 AM IST

ఆలయ అభివృద్ధికి భారీ విరాళం జీతం

MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఈనెల 20వ తేదీన జరగనుంది. ఈ మహోత్సవానికి రావాలని BRS జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలతలను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం లక్ష్మణ్ బాబు రూ. 35,000 విరాళం అందజేసి తన భక్తిని చాటుకున్నారు.

April 18, 2026 / 10:34 AM IST

గోమాతకు అమావాస్య పూజలు

GDWL: శాంతినగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఇవాళ గాయత్రి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గో ప్రచారక్ సేవా సమితి ఆధ్వర్యంలో అర్చకులు వినయ్ శర్మ అష్టోత్తర పూజలు గావించారు. అనంతరం గోమాతకు గ్రాసం తినిపించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తురాలు కృష్ణవేణి సమర్పించిన వస్త్రాలతో గోమాతను అలంకరించి ప్రసాద వితరణ చేశారు.

April 18, 2026 / 10:30 AM IST

ఆసుపత్రుల్లో మంచినీటి కొరతతో రోగుల ఇబ్బందులు

WGL: జిల్లాలోని CKM, నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచినీటి కొరత తీవ్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులు, వారికి ఆసుపత్రి ఆవరణంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో నీటి సౌకర్యం లేకపోవడంతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి తక్షణమే మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని కోరారు.

April 18, 2026 / 10:27 AM IST

లింగగిరి PHCలో 14 ఏళ్ల బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీ

SRPT: హుజూర్‌నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక ‘గార్డసిల్’ టీకాను ఇవాళ్టీ నుంచి ఉచితంగా అందిస్తున్నారు. అర్హులైన బాలికల తల్లిదండ్రులు వెంటనే స్థానిక ANM లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించి, టీకాను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.

April 18, 2026 / 10:27 AM IST