SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామిని సోమవారం నటి పూనంకౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ప్రపంచ శాంతిలో భారత్ అగ్రగామిగా నిలవాలని, ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక మళ్ళీ స్వామి వారిని దర్శించుకుంటనని తెలిపారు.
MDK: తూప్రాన్ మండలం కోనాయిపల్లి (పిబి) గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపట్టారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు మూడు ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించినట్లు ఎంపీడీవో సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంకణాల నాగమణి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్, ఏఈ స్మైలీ పాల్గొన్నారు.
BDK: రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని సూచించారు.
KNR: హుజూరాబాద్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏఈఓ నిఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనాల ప్రాముఖ్యత సేకరించే పద్ధతి, సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, సాయిల్ హెల్త్ కార్డ్ ఉపయోగాలపై వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే సాయంత్రం మూడు గంటలకు సీఎం రెండో విడత రైతు భరోసా విడుదలపై ప్రత్యక్ష ప్రసారం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు.
MBNR: మానవత్వానికి బసవన్న నిలువెత్తు రూపమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా కేంద్రంలో బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. సమానత్వం, నీతి, ధర్మం కోసం బసవన్న చేసిన బోధనలు నేటికీ ఆచరణీయమని, ప్రతి మనిషిలోని మంచితనాన్ని వెలికితీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ మమత, నాయకులు పాల్గొన్నారు
PDPL: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను ఇవాళ ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఈశ్వర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నాయకులు బలరాంరెడ్డి, మోహన్ రెడ్డి, మిట్ట తిరుపతి, బుచ్చిరెడ్డి, రాంబాబు, చిన్న లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
KMR: రాజంపేట్ మండలం పెద్దాయిపల్లిలో ఇవాళ బసవేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. బసవేశ్వర స్వామి బోధనలు సమాజానికి మార్గదర్శకమని అన్నారు.
NLG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై సిమెంట్ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి సిమెంట్ బస్తాకు రూ. 30 నుంచి రూ. 50 వరకు ధరలు పెరగడంతో, పేద లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 34 వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
SRD: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధి బస్ డిపో వెనకాల ఏర్పాటు చేసిన జగద్గురు పంచాచార్య జంగమ భవనం నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ శెట్కార్ సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగమ సమాజ్ సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర శైవ జంగమ గౌరవాధ్యక్షుడు శంకరయ్య, సిద్దయ్య, శివకుమార్ రేవణయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
MNCL: మంచిర్యాలలో సోమవారం హెచ్ఎంఎస్ అనుబంధ జిల్లా ఆటో అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో యూనియన్ను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
వరంగల్ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈనెల 23 నుంచి క్రయవిక్రయాల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7:05 గంటలకు మిర్చి విక్రయాలు, 8:05కు పత్తి, 8:15కు పల్లికాయ, 8:30కు పసుపు, 8:45 గంటలకు ధాన్యం, అపరాల బీటు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రైతులు విషయాన్ని గమనించాలని సూచించారు.
BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో వివేరా హాస్పిటల్ సౌజన్యంతో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనిని సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ప్రారంభించి మాట్లాడుతూ.. పేదలకు ఇలాంటి శిబిరాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు నెలకు ఒకసారి గ్రామాల్లో వీటిని నిర్వహించాలని కోరారు. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
HNK: సీతంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు.
KMM: TSRTC SWF CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 22 నుంచి జరగబోయే ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈరోజు మధిర డిపో ఉద్యోగులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై డిమాండ్ డే పాటించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె కార్మికుల హక్కు సమ్మెను నిర్వీర్యం చేసే చర్యలలో విడనాడాలని హెచ్చరించారు.
BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండల తహసీల్దార్ అంబటి రజిత స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున ఘనంగా సత్కరించారు.