జగిత్యాల జిల్లా ప్రముఖ డాక్టర్ భీ. శంకర్ కు జాతీయ ఫిజీషియన్ల సదస్సులో పాల్గొనే ఆహ్వానం లభించింది. ఆయన రచించిన “శ్వాసకోశ ఉబ్బసం వ్యాధులు- ఆధునిక చికిత్సా పద్ధతులు” వ్యాసం “మెడిసిన్ అప్డేట్-2026” లో ప్రచురితమై ఉంది. డాక్టర్ శంకర్ ఈ నెల 29న పాట్నాలో పుస్తక ఆవిష్కరణలో పాల్గొని, 30న జాతీయ వేదికపై ప్రసంగం చేస్తారు.
WGL: హై రిస్క్ గర్భిణులను సమయానికి గుర్తించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO డా. సాంబశివరావు సూచించారు. వరంగల్ DMHO కార్యాలయంలో అర్బన్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదకర లక్షణాలను ముందుగా గుర్తించి నిపుణుల సలహాతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాతా-శిశు మరణాలను తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
PDPL: తెలంగాణ ప్రజలకు BRS పార్టీ అధినేత కెసిఆర్ శ్రీరామ రక్ష అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కార్పొరేషన్ 13వ డివిజన్లో సామాజిక కార్యకర్త కటుకు స్వాతి- ప్రవీణ్ తో పాటు 100 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.
KNR: ఐదు రోజుల విరామం అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ఇవాళ ప్రారంభమైంది. పత్తి ధరలు ఆశాజనకంగా నమోదై గరిష్ఠంగా క్వింటాల్కు రూ.8 వేల వరకు పలికాయని పలువురు రైతులు తెలిపారు. మార్కెట్లో 14 వాహనాల ద్వారా మొత్తం 102 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. గత కొన్ని రోజులతో పోల్చితే ధరలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ డ్రైవింగ్పై ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పలువురు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ డ్రైవింగ్ నేరమని, ఇకపై కేసులు నమోదు చేస్తామని, వాహన యజమానులు, తల్లిదండ్రులు కూడా భాగస్వాములవుతారని తెలిపారు. ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ రాదని, 18 ఏళ్లు నిండిన వారికి లైసెన్సులు తీసుకోడానికి సహాయం చేస్తామని చెప్పారు.
ADB: సాధారణ బదిలీల్లో భాగంగా బోథ్ నూతన ఎస్సైగా పురుషోత్తం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇచ్చోడ ఎస్సైగా విధులు నిర్వహించి ప్రస్తుతం బోథ్ SHOగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు.
KMR: ప్రతి మహిళ ఒక పారిశ్రామిక వేతగా ఎదగాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇవాళ కళాభారతి ఆడిటోరియంలో వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు.
NLG: ఈ నెల 25,26,27,28, తేదీలలో హైదరాబాద్ మహానగరంలో జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధని పిలుపునిచ్చారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఊరుకో బస్సు ఇంటికో మహిళా అనే నినాదాన్ని ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆమె ఖండించారు.
NZB: సహచర మహిళా ఉద్యోగిపై అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. NZB విద్యుత్ శాఖలోని డీఈఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కార్తీక్ పై ఐదవటౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదు చేశారు. డీఈఈ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.
BHPL: జిల్లా కేంద్రంలోని భరత్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి చెస్ పోటీలు ఇవాళ రసవత్తరంగా ముగిసాయి. నిన్న అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఈ టోర్నమెంట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో విశ్వజిత్ సాయి 1వ స్థానం (రూ.10,000), అభిషేక్ 2వ స్థానం (రూ.5,000), మధుశ్రీ 3వ స్థానం (రూ.3,000) సాధించినట్లు చెస్ అసోసియేషన్ తెలిపింది.
WGL: నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లికి చెందిన గాదే హరి ప్రసాద్ (35) ఆదివారం సాయంత్రం ఒర్లాపూర్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన హరి ప్రసాద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MBNR: జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం ఇచ్చే ఐదు నెలల ఉచిత శిక్షణ కరపత్రాలను కలెక్టర్ విజయేందిర బోయి ఆవిష్కరించారు. డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30లోగా https://www.tsstudycircle.co.in దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
SRPT: మంత్రి ఉత్తమ్ రేపు హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గడ్డిపల్లిలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ పనులను పరిశీలించి, అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాక, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్నారు.
MLG: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం డిప్యూటీ CM అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో MLG జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
NLG: తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన క్యాలెండర్ ను ఇవాళ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… చేనేత వృత్తి పరికరాల గురించి తెలియజేస్తూ క్యాలెండర్ను ముద్రించడం అభినందనీయమన్నారు. సంక్షేమ పథకాలు కార్మికులకు అందేలా సంఘం కృషి చేయాలని సూచించారు. జిల్లా కార్యదర్శి మురళీధర్ పాల్గొన్నారు.