KMM: జిల్లా కారేపల్లి మండలంలో బుధవారం ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా పలు గ్రామపంచాయతీలలో సర్పంచులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని భాజ్య తండాలో రహదారుల వెంట ఉన్న చెత్తను మల్టీపర్పస్ వర్కర్లతో తొలగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు జరుగుతున్నాయని సర్పంచ్ వి. హనుమంతరావు తెలిపారు.