SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరుకు చెందిన మోతే ఐలేశ్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స ఖర్చుల నిమిత్తం అతనికి మంజూరైన రూ. 2 లక్షల LOC చెక్ను మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ సునీత మధు ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.