• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రశాంతంగా జీజీ కళాశాల సెమిస్టర్ పరీక్షలు

NZB: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తిలో సోమవారం 6వ, 2వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 6వ సెమిస్టర్ పరీక్షకు 935 మందికి గాను 913 మంది 22 మంది గైర్హాజరైయ్యారు. 2వ సెమిస్టర్ పరీక్షలకు 1484 మందికి గాను 1449 మంది 35 మంది గైర్హాజరైనట్లు పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, ప్రిన్సిపల్ ఆచార్య పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.

April 20, 2026 / 07:39 PM IST

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా విషయాన్నీ డీఈవో శారద తెలిపారు. టెన్త్‌లో 972 మంది హాజరు కావలసి ఉండగా 883 మంది (90.84%) హాజరయ్యారని తెలిపారు. ఇంటర్మీడియట్ లో 1542 మందికి గాను 1402 మంది (90.63%) హాజరయ్యారని పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

April 20, 2026 / 07:38 PM IST

రేపు జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం MLA కేఆర్ నాగరాజు విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో నూతన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు.10 గంటలకు రావూర్ ఐకేపీ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 11 గంటలకు దమ్మన్నపేట గ్రామంలో ఐకేపీ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

April 20, 2026 / 07:38 PM IST

‘దోపిడీకి వ్యతిరేక హక్కు’పై గ్రామస్తులకు అవగాహన

MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ICFAI లా స్కూల్ & నారీ మణి కలెక్టివ్ ఆధ్వర్యంలో ‘దోపిడీకి వ్యతిరేక హక్కు’పై అవగాహన సదస్సు నిర్వహించారు. DLSA చీఫ్ కౌన్సెల్ ఎస్. కరుణాకర్ అక్రమ రవాణా నిర్మూలన, కనీస వేతనాలు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. నాల్సా హెల్ప్‌లైన్ 15100 గురించి వివరించారు. IFHE సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

April 20, 2026 / 07:36 PM IST

పీఆర్ ఇంజినీరింగ్ ఆఫీస్‌లను తనిఖీ చేసిన కలెక్టర్

ASF: వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించి, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

April 20, 2026 / 07:35 PM IST

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

HNK: బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో 29, 11వ డివిజన్లకు సంబంధించి 29 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 29,03,364 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MLA నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

April 20, 2026 / 07:32 PM IST

ప్రశాంతంగా ఓపెన్ స్కూల్ ఇంటర్ టెన్త్ పరీక్షలు

NLG: జిల్లాలో సోమవారం ఓపెన్ స్కూల్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ తెలుగు పరీక్షకు 10 కేంద్రాల్లో 1759 మందికి గాను 1512 మంది హాజరుకాగా, 247 మంది గైర్హాజరయ్యారు. అరబిక్ పరీక్షకు 14 మందికి 13 మంది హాజరయ్యారు. పదవ తరగతి తెలుగు పరీక్షకు 8 కేంద్రాల్లో 1334 మందికి గాను 1141 మంది హాజరుకాగా, 193 మంది గైర్హాజరయ్యారని వివరించారు.

April 20, 2026 / 07:31 PM IST

దేశ ప్రజల ప్రయోజనం కోసమే జనాభా గణన: ట్రైనర్

SRD: దేశ ప్రజల ప్రయోజనం కోసం, వివిధ సంక్షేమ పథకాల రూపకల్పనకు జనాభా గణన ఉపయోగపడుతుందని ట్రైనర్ రహీం అన్నారు. కంగ్టిలో ఇవాళ ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. జనాభా గణన కార్యచరణ ప్రక్రియలో ఎన్యుమరేటర్లకు , సూపర్వైజర్ల బాధ్యత కీలకమని చెప్పారు. సెన్సస్ 2027 HLO మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సమాచారం సేకరిస్తారని తెలిపారు. ఇందులో ఎన్యుమరేటర్స్, ఉన్నారు.

April 20, 2026 / 07:30 PM IST

ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలి: సీఐ

MHBD: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో సర్పంచ్ రామలింగం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా తొర్రూరు సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్‌లు పాల్గొన్నారు. అనంతరం సీఐ గణేష్ మాట్లాడుతూ.. ప్రాణ రక్షణ కోసం ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

April 20, 2026 / 07:30 PM IST

‘విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి’

MNCL: ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల రాజీవ్ నగర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు గదుల నిర్మాణ పనులు, వంటశాల, సామాగ్రి నిల్వ గదిని పరిశీలించి పలు సూచనలు చేశారు.

April 20, 2026 / 07:30 PM IST

ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

GDWL: గట్టు మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా నా వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు.

April 20, 2026 / 07:30 PM IST

అంగన్వాడీ కేంద్రంలో పాఠశాల సంసిద్ధత మేళా

MDCL: భరత్ నగర్ అంగన్వాడీ సెంటర్‌లో పి & జి ప్రథమ్ ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత మేళా నిర్వహించారు. సూపర్వైజర్ సుధా కీర్తి ముఖ్య అతిథిగా హాజరై, ఐదు అభివృద్ధి అంశాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటలు, పాటలు, ప్రదర్శనలతో ఆకట్టుకోగా, రిపోర్ట్ కార్డులు అందజేసి నర్సరీ నుంచి 1వ తరగతికి ప్రమోషన్లు ఇచ్చారు.

April 20, 2026 / 07:30 PM IST

కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక

KMR: సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(DCC ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాలోని నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి AICC అబ్జర్వర్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల అభీష్టం మేరకే నియామకం ఉంటుందన్నారు.

April 20, 2026 / 07:29 PM IST

నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు సీపీ పి.సాయి చైతన్య సోమవారం ఉత్తర్వులు జారీ చేసి, వారిని అభినందించారు. పదోన్నతి పొందిన వారిలో కె.ఆనంద్ (వర్ని), వి.సతీష్ (టౌన్-2), కె.నవీన్ కుమార్ (ధర్పల్లి), శశి ప్రసాద్ (టౌన్-1) ఉన్నారు.

April 20, 2026 / 07:16 PM IST

‘జనాభా గణనను నిబంధనల ప్రకారం నిర్వహించాలి’

SRPT: జనాభా గణనను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అధికారులను ఆదేశించారు. కోదాడ పట్టణంలోని KRR డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గణన శిక్షణ తరగతులను ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు శిక్షణలో అప్రమత్తంగా ఉండి,తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జనాభా గణనను ఏ ఇంటిని విడిచిపెట్టకుండా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలన్నారు.

April 20, 2026 / 07:15 PM IST