• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక

SRPT: ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ పశ్య సుబ్బరామి రెడ్డి సూచించారు. గడ్డి వాములు, ఎండిన చెత్త, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి కారణాలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.

May 5, 2026 / 02:39 PM IST

రసాయనాల వినియోగంతో అనారోగ్యం: ఎమ్మెల్యే

KMM: పంటల సాగులో ఎరువులు, పురుగు మందులు, రసాయనాల అధిక వినియోగంతో అనారోగ్యం బారిన పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. మంగళవారం సత్తుపల్లిలో ఉద్యాన పంటల సాగుపై నిర్వహించిన‌ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మన పూర్వీకులకు లాభాలతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రైతు అవలంభించాలని కోరారు.

May 5, 2026 / 02:39 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

VKB: నిబంధన ప్రకారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకొవలని తెలిపారు.

May 5, 2026 / 02:38 PM IST

బస్టాండ్ సమీపంలో ఆక్రమణల తొలగింపు

సూర్యాపేటలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీస్, మున్సిపల్ అధికారులు నడుం బిగించారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో ‘ఆపరేషన్ రోప్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రోడ్లపై ఉన్న ఆక్రమణలను పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తొలగించారు. వ్యాపారులు తమ పరిమితికి లోబడే సామగ్రిని ఉంచుకోవాలని అన్నారు.

May 5, 2026 / 02:37 PM IST

ఎంపీడీవో ఆఫీసులో పాత బోర్డులే.. కొత్తవెప్పుడు?

VKB: దోమ మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టి కాలం చెల్లుతున్నా, కార్యాలయంలోని సూచిక బోర్డులపై మాత్రం ఇంకా పాత పేర్లే దర్శనమిస్తున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధికారులకు కనీసం సమాచార బోర్డును మార్చాలనే ఆలోచన లేకపోవడంపై విమర్శించారు.

May 5, 2026 / 02:36 PM IST

భద్రాద్రి కొత్తగూడెం కొత్త డీఆర్వోగా పద్మావతి

BDK: రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారి (DRO)గా ఎస్. పద్మావతి నియమితులయ్యారు. స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ఈమె, ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG)లో డెప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

May 5, 2026 / 02:35 PM IST

కురవి ఆలయంలో ప్రభుత్వ విప్ దంపతుల పూజలు

MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోతు రామచంద్రనాయక్ కురవి దేవాలయాన్ని సందర్శించారు. ఈరోజు ఆయన పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్బంగా తన సతీమణి ప్రమీలతో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటుచేసిన కేక్ ను కట్ చేసి, వేడుకల్లో పాల్గొన్నారు.

May 5, 2026 / 02:35 PM IST

పేదలకు సొంతిల్లు ఆత్మగౌరవానికి నిదర్శనం: ఎమ్మెల్యే

PDPL:పేదలకు సొంతిల్లు ఆత్మగౌరవానికి నిదర్శనమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట, కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లిలో మంగళవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్య క్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ మేరకు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

May 5, 2026 / 02:33 PM IST

‘లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి’

KMR: ధాన్యం సేకరణలో లారీల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ అడిషనల్ పీడీ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. మంగళవారం బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని ఆమె దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

May 5, 2026 / 02:32 PM IST

ఈ నెల 7న జిల్లాలో జాబ్ మేళా

NZB: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీన న శ్రీరామ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.

May 5, 2026 / 02:32 PM IST

గన్ని బ్యాగుల కొరతపై రైతుల వినతి

NRPT: జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత ఉందని రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం డీటీ బీబీ హజ్రాకు వినతి పత్రం అందజేశారు. రైతులకు గన్ని బ్యాగులు సరఫరా చేయాలని, అలాగే లారీలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో తిరుపతయ్య, రవికుమార్, కృష్ణారెడ్డి, నర్సింలు, విష్ణు కాంత్ రెడ్డి, శివ, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

May 5, 2026 / 02:31 PM IST

బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా హారతి

MNCL: మంచిర్యాలలోని దుర్గామాత దేవాలయంలో మంగళవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 10న హైదారాబాద్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ చేస్తున్న కృషికి ప్రజల నుంచి ఆదరణ వస్తోందని తెలిపారు.

May 5, 2026 / 02:31 PM IST

BRS రైతు సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీలు

HNK: రేపు జరగబోయే BRS రైతు సదస్సును విజయవంతం చేయాలని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావులు కోరారు. సభ ఏర్పాట్లను ఈరోజు వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ నమ్మక ద్రోహంపై BRS సమర శంఖం పూరిస్తుందని తెలిపారు.

May 5, 2026 / 02:31 PM IST

జిల్లాలో ముమ్మరంగా నాలాల పూడికతీత పనులు

SRPT: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ నివేదితా తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ప్రధాన నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను మున్సిపల్ చైన్ వెహికల్ మిషన్ ద్వారా తొలగిస్తున్నట్లు తెలిపారు. నాలాల్లో చెత్త వేయవద్దని, పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

May 5, 2026 / 02:25 PM IST

దొంగల బారి నుంచి జాగ్రత్త… వేసవిలో అప్రమత్తత అవసరం: సీఐ

NLG: వేసవిలో దొంగల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఐ రాజు సూచించారు. శుభకార్యాల కోసం ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి వేళల్లో ఆరుబయట నిద్రించేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దని హెచ్చరించారు. భద్రత కోసం ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు.

May 5, 2026 / 02:22 PM IST