• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మే 4వ తేదీన హిందూ ధర్మ సమ్మేళనం

HNK: మే 4వ తేదీన హనుమకొండలోని శ్రీనగర్, ఇంద్రానగర్, రాఘవేంద్ర నగర్, కేయూ బస్తీ కాలనీల ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ మేర హిందూ ధర్మ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను సమ్మేళన సమితి అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, నేతలు ఆవిష్కరించారు. మే 4వ తేదీన జరగబోయే హిందూ ధర్మ సమ్మేళనానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.

April 25, 2026 / 10:25 AM IST

‘గర్భిణీ మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి’

ADB: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని వార్డ్ కౌన్సిలర్ పవర్ సూచిక మనోజ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్, రవీంద్ర నగర్ లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలో పిల్లల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

April 25, 2026 / 10:24 AM IST

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రత వివరాలు

KMR: జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. టీజీడీపీఎస్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 24 ఉ. 8:30 నుంచి ఏప్రిల్ 25 ఉ.8:30 వరకు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలుచోట్ల 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. బాన్సువాడ మండలం కొల్లూర్, పాల్వంచ,మద్నూర్, మెనూరు ప్రాంతాల్లో 43.8°Cగా నమోదైంది. పిట్లం, గాంధారి, భిచ్కుంద, KMR వంటి ప్రాంతాల్లో కూడ 43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

April 25, 2026 / 10:17 AM IST

తంగళ్ళపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మకు శుక్రవారం రాత్రి ఘనంగా పెద్దమ్మ బోనాలు తీశారు. పెద్ద ఎత్తున మహిళలు పెద్దమ్మకు బోనాల సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం రోజున గావు పట్టుతో పెద్దమ్మ పండుగ ముగుస్తుందని ముదిరాజ్ సంఘ సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై పెద్దమ్మ పండుగను విజయవంతం చేయాలని కోరారు.

April 25, 2026 / 10:16 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు యూటీఎఫ్ మద్దతు

NGKL: సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు టీఎస్ యూటీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపో వద్ద నిరసన చేపట్టిన కార్మికులను కలిసి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు ఏపీ మల్లయ్య, నెహ్రూ ప్రసాద్ డిమాండ్ చేశారు.

April 25, 2026 / 10:15 AM IST

ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుకూలంగా తీర ప్రాంతం

MNCL: జన్నారం మండలంలోని గోదావరి తీర ప్రాంతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుకూలంగా మారింది. మండలంలోని కలమడుగు, బాదంపల్లి, చింతగూడ దండేపల్లి మండలంలోని ద్వారకా ప్రాంతాలలో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించేందుకు అనుకూలంగా ఉంటుందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు గతంలో ప్రకటించారు. గోదావరిలో విస్తరంగా నీటి ప్రవాహం ఉండటం, ప్రాజెక్టులకు బలం చేకూర్చే బండ ప్రాంతం ఉంది.

April 25, 2026 / 10:12 AM IST

వింజమూరులో హిందూ సమ్మేళనం

MBNR: కోయిల్ కొండ మండలం వింజమూరు గ్రామంలో శుక్రవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామీజీ పాల్గొని హిందువుల ఐక్యత, ధర్మ జాగృతి, సంస్కృతి బలోపేతమే లక్ష్యమని తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 25, 2026 / 10:12 AM IST

మహిళా కానిస్టేబుల్ వేధింపులతో యువకుడి సూసైడ్

NZB: నగరంలో డోల అనిల్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.చనిపోయే ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. NZB కు చెందిన ఓ యువతి, 1 టౌన్ మహిళా కానిస్టేబుల్ తనను మానసిక వేధింపులకు గురిచేశారని అనిల్ అందులో ఆవేదన వ్యక్తం చేశాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 25, 2026 / 10:11 AM IST

WOW.. జిల్లాలో మలేరియా కేసులు ‘0’

VKB: జిల్లాలో మలేరియా కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాయి. సుమారు నాలుగేళ్లుగా జిల్లా వ్యాప్తంగా మలేరియా కేసులు నమోదు కాలేదని గణంకాలు చెబుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారంతో పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో ప్రజల్లో మెరుగైన అవగాహన ఏర్పడి 2022-25 వరకు జిల్లాలో ఎక్కడా మలేరియా కేసు నమోదు కానట్లు అధికారులు చెబుతున్నారు.

April 25, 2026 / 10:11 AM IST

సేవాలాల్ ఆలయ నిర్మాణ కమిటీ ఎంపిక

MLG : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బానోతు రవిచందర్, గౌరవ అధ్యక్షునిగా పోరిక గోవింద్ నాయక్, ఉపాధ్య క్షులుగా భాస్కర్, రాజునాయక్, సీతారాం నాయక్, పి.రాజు నాయక్, జయరాం నాయక్, ప్రధాన కార్యదర్శిగా రాహుల్, సమన్వయకర్తలుగా మెహన్ లాల్, కిషన్‌లు ఎన్నికయ్యారు.

April 25, 2026 / 10:10 AM IST

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

RR: మియాపూర్ పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వల్లెపు వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన బంగారం, వెండి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుడైన ఇతనిపై గతంలో 45 కేసులు ఉన్నాయి. తాజా విచారణలో మియాపూర్, గచ్చిబౌలి పరిధిలోని 4 దొంగతనాలను ఒప్పుకున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

April 25, 2026 / 10:10 AM IST

‘రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు’

KMM: నెలకొండపల్లి మండలం రాయగూడెంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయన్నారు.

April 25, 2026 / 10:09 AM IST

జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు

GDWL: జిల్లాలో భానుడు భగభగడుతూ ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో గట్టు మండల కేంద్రంలో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నతండ్రపాడ్, గద్వాల 42.6°C, మల్దకల్ 42.2°C, పుల్లూరు 42.0°C, ధరూర్ 41.6°C, భీమవరం 41.5°C, వడ్డేపల్లి, వెంకటాపూర్ 42.4°C, మల్లపూర్ 41.2°C, జల్లపూర్, 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

April 25, 2026 / 10:08 AM IST

సింగరేణిలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం

PDPL: సింగరేణి RG-1లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల27 నుంచి మే21 వరకు విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తుందని యాజమాన్యం పేర్కొంది. ఫుట్ బాల్, వాలీ బాల్, బాక్సింగ్, కరాటే వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందే విద్యార్థులు, శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలంది. ఈ మేరకు GM కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

April 25, 2026 / 10:05 AM IST

ఏడవ రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు.. నేటి అలంకరణ ఇదే..!

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన నగరంలోని భద్రకాళి ఆలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడోవ రోజు ప్రాతః కాల విశేష దర్శనంలో శ్రీ భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.

April 25, 2026 / 10:02 AM IST