MLG: మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ తదితరులు ఉన్నారు.
VKB: బంట్వారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుల్లోని స్టాక్ రిజిస్టర్లను, విత్తన నిల్వలను ఆయన పరిశీలించారు. రైతులకు విత్తన కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్లు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను కలెక్టర్ హెచ్చరించారు.
RR: కొత్తూరు మండలం మల్లాపూర్లో అన్ని వీధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధులతో గ్రామంలోని అన్ని వీధుల్లో నూతన టెక్నాలజీతో సుమారు 200 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
BDK: బూర్గంపాడు మార్కెట్ యార్డును మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి ధాన్యం కొనుగోలు, తూకం, చెల్లింపుల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక రైతులు తమ సమస్యలు వివరించారు. వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులు పరిశీలించి తగు సూచనలు చేశారు.
MDCL: మాయూర్ పూరోహిత్ (7) అనే బాలుడు నిన్న సాయంత్రం కనిపించకపోవడంతో పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి, బాలుడు మిలిటరీ డెయిరీ ఫారం రోడ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కేవలం 45 నిమిషాల్లో శోభా గార్డెన్స్ వద్ద బాలుడిని గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
BHPL: ఉపాధి హామీ కూలీలకు గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని CPI(ML) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. టేకుమట్లలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ గుర్తింపుతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాత పద్ధతిలోనే కూలీలకు హాజరు వేసి వేసవి అలవెన్సెస్ ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
NRML: నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షలతో S.H.G V.O భవన,షెడ్ నిర్మాణానికి రూ.18 లక్షలతో MPPS ,హై స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీ రాజం మాట్లాడుతూ.. చలివేంద్రాన్ని ప్రయాణికులు ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. వేసవి ఎండల దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సమీర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
JGL: ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా జగిత్యాల మండలం తిప్పన్నపేటలో ‘బడిబాట’ నిర్వహించారు. సర్పంచ్ తిరుపతి, ప్రధానోపాధ్యా యులు వెంకటరమణ, సుచరిత ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలను బడికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
PDPL: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల రైల్వే స్టేషన్ను సందర్శించి అమృత్ భారత్ పథకం పనులను పరిశీలించారు. నాణ్యత, సమయపాలనపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్, పార్కింగ్ మెరుగుపరచాలని, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
JN: లింగాల ఘన్పూర్ (M )కుందారం, నెలపోగుల,వనపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని, ఈ క్రమంలో రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాల నిర్వహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ADB: ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ రావు మంగళవారం కలెక్టర్ రాజర్షి షాను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.
WGL: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును APRIL 23 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి డా. శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి డా. శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ.. ఫెయిలైన విద్యార్థులు, మార్కులు మెరుగుపరచుకోవాలని ఆశించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
WGL: పర్వతగిరి మండలం చెరువుముందు తండాలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలు సమాజ ఐక్యతకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. తండా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కరావ్ అలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామం కాల్వపల్లిలో మంగళవారం అడుగుపెట్టి తల్లిని కలిశారు. దళ కమాండర్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, అంచెలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగింది. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన అనంతరం స్వగ్రామానికి రావడం ఇదే తొలిసారి.