SRPT: హుజుర్నగర్ రామస్వామి గుట్టలో నిర్మిస్తున్న 2,160 సింగిల్ బెడ్ రూమ్ మోడల్ హౌసింగ్ కాలనీలో పాఠశాల, కమ్యూనిటీ హాల్, అంగన్వాడి, షాపింగ్ కాంప్లెక్స్ వంటి మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ విషయం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని చెత్తాచెదారం, పాత వస్తువులను తొలగించి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె తెలిపారు.
MLG: ఈనెల 14 నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO సిధార్ధరెడ్డి చెప్పారు. 102 పాఠశాలల నుంచి 3290 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, వీరిలో 1696 మంది బాలురు, 1594 బాలికలు ఉన్నారన్నారు. 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసామని, నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు.
KNR: గంగాధర మండలంలోని రంగరావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు పెంపకందారులు తమ పశువులకు టీకాలు వేయించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సర్పంచ్ శంకరయ్య మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 491 మంది అర్హులను గుర్తించినట్లు MRO కృష్ణ బుధవారం తెలిపారు. మొత్తం 160 ఇళ్లకు గానూ, ప్రస్తుతం 108 ఇళ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. అర్హుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
GDWL: జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ‘పై గురువారం ఒకరోజు జిల్లా స్థాయి ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతం, పాలనలో పారదర్శకత లక్ష్యంగా ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
NZB:పెరిగిన రైలు సర్వీసులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైల్వేగేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. వాటి స్థానంలో ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని ఇందల్వాయి, సిర్నాపల్లి, డిచ్పల్లి, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో అధికారులు గతంలో సర్వే పూర్తి చేశారు. కానీ ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది.
SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టారు. సర్పంచ్ బోయిని సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి క్లోరిన్ కలిపి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని కునారం రోడ్ పబ్లిక్ టాయిలెట్ల వద్ద ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య మొక్కలు నాటారు. చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
KMM: అట్టడుగు స్థాయి ఉనికిని బలోపేతం చేయడానికి ఖమ్మం జిల్లా కమిటీని నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది. జిల్లా కన్వీనర్గా స్వర్ణ సుబ్బారావు, కో కన్వీనర్గా పసుమర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గంధం పుల్లయ్య, సభ్యులుగా రవి కుమార్, నరసింహారావు, నవీన్, సూర్యదేవర సంగమేశ్వర ప్రసాద్, మురళిలను నియమించారు.
MNCL: బెల్లంపల్లి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ వద్ద AITUC ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 2025 సెప్టెంబర్లో అందజేయాల్సిన పంప్ ఆపరేటర్ల ప్రమోషన్లను యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని కార్మికులు ఆగ్రహించారు. మైన్స్ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలుమార్లు విన్నవించినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆందోళన చేపట్టామన్నారు.
వనపర్తి జిల్లాలో ఎండల తీవ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా పానగల్ మండలం రేమద్దులలో 36.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి 36.4, వెలుగొండ 36.2, మదనపూర్ 35.8, రేవల్లి 35.7, వీపనగండ్ల, కన్నాయిపల్లి 35.5, గణపూర్ 35.4, గోపాల్ పేట 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా ఆరవ రోజు హోటల్ను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యత గల ఆహారాలు విక్రయించే విధంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హోటలలో శుభ్రత పాటించాలని సూచించారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా ఆరవ రోజు పలు హోటల్స్ను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యత గల ఆహారాలు విక్రయించే విధంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హోటల్లలో శుభ్రత పాటించాలని సూచించారు.
RR: షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ భర్త జంగయ్య మృతి చెందాడు. లాల్ పాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. జంగయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.