BHPL: రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాలలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో MLA పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట మార్పిడి పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు పొందాలన్నారు.