KMM: బోనకల్ PHC ఎదుట CITU ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల పారితోషకాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ డాక్టర్ స్రవంతికి వినతిపత్రం అందజేశారు. వేసవిలో ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వస్తోందని, వెంటనే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని సీఐటీయూ నాయకులు వీరబాబు, నరేష్ డిమాండ్ చేశారు.