NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 21వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, కాన్సిలర్ మబ్బు రాములు, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.