MNCL: బెల్లంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) ఇంటర్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య మాట్లాడుతూ.. కృషి, క్రమశిక్షణ ఉంటే విజయం తప్పక సొంతమవుతుందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు.
HNK: ఈనెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని జాగృతి జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. డాక్టర్ బోడ అనిల్ కుమార్, పృద్వి ఉన్నారు.
NLG: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయనున్నా. ఈ నెల 22 నుంచి సమ్మెకు పిలుపునిచ్చినారు. ఈ సమ్మె పిలుపు నేపథ్యంలో నల్గొండ రీజియన్ లోని 7 డిపోల పరిధిలో 2,500 మంది కార్మికులు విధులకు దూరం కానున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనంచేయాలని, 2017 పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు.
JGL: వెల్గటూర్లోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై స్వామివారి ఆశీస్సులు కోరారు. పూజారులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ఇవాళ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోఆపరేటివ్ బ్యాంకును రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో పాటు అధికారులు పాల్గొన్నారు.
NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంట అమ్ముకోవడానికి ఆరబెట్టిన మొక్కజొన్న వర్షాలకు తడుస్తుండడంతో రైతులు దిగాలు పడుతున్నారు. మ్యాచర్ వచ్చి తమ మొక్కజొన్న పంట అమ్ముడుపోతుంది. చేతికి డబ్బులు వస్తాయని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ ఎదురవుతుంది.
HNK: మంత్రి పొన్నం ప్రభాకర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రతినిధులు పూజలు నిర్వహించారు. అనంతరం నేతలు కేక్ కట్ చేశారు. అనునిత్యం హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రదాన లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని నేతలు అన్నారు. నేతలు కనకయ్య, వెంకటేష్, సమ్మయ్య, శ్రీనివాస్ ఉన్నారు.
JN: చిల్పూరు మండలంలోని కృష్టాజీగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. అనంతరం రైతులతో ప్రజాప్రతినిధులు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
KMM: చింతకాని మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల అధ్యక్షుల మార్పుకు వ్యూహరచన జరగుతుంది. ముఖ్యంగా ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై నాయకులు, కార్యకర్తలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు, కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో గెలిపిస్తుంది.
KMR: ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. పాల్వంచ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
GDWL: రైతులు దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్డప్ప, కుమార్, మధు నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.
NRPT: మద్దూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. బి. వెంకటేశ్ గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం సేకరించి కర్ణాటకకు తరలిస్తుండగా పల్లెర్ల శివారులో పట్టుబడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
MLG: ఏటూరునాగారం గ్రామంలోని పలు వార్డులలో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రదీప్ రావు, తదితరులు పాల్గొన్నారు.
GDWL: సమాజాభివృద్ధికి జనగణ కీలకమని అయిజ మున్సిపల్ కమిషనర్ సైదులు అన్నారు. జడ్పీహెచ్ఎస్లో ఫీల్డ్ ట్రైనర్ కళిముల ఆధ్వర్యంలో ఎమ్మునరేటర్లు, సూపర్వైజర్లకు హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్పై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని సూచించారు. మొదటి విడతలో గృహాల జాబితా, గణన పూర్తి చేయాలన్నారు.
SRD: కంగ్టి మండలం దెగులువాడి గ్రామాన్ని మంగళవారం ఎంపీడీవో సత్తయ్య సందర్శించారు. స్థానిక శివారులో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పనులను ఆయన పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. కూలీల హాజరు, ఫోటో క్యాప్చరింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. NMMS ప్రక్రియ సజావుగా కొనసాగడంపై ఆయన సంతృప్తి చెందారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరని సూచిచారు.