• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఆయిల్ పామ్ సాగుతో రైతుకు 30 ఏళ్ల భరోసా’

JN: బచ్చన్నపేట ఆయిల్ పామ్ సాగు రైతుకు 30 ఏళ్ల భరోసా ఇస్తుందని జంగా రాఘవ రెడ్డి అన్నారు. బచ్చన్నపేటలో జరిగిన రైతు మహాసదస్సులో ఆయన మాట్లాడాతు. ఖమ్మం రైతులు 30 ఏళ్లు ముందున్నారని, అక్కడ కౌలు లక్ష ఉందన్నారు. 4 ఏళ్ల తర్వాత స్థిరాదాయం వస్తుందని, నెలకు రెండుసార్లు ఆదాయం ఉంటుందని తెలిపారు.

May 5, 2026 / 04:08 PM IST

రైతు వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల వేడుకల్లో భాగంగా, చేవెళ్లలోని అట్లాస్ ఫంక్షన్ హాల్‌లో రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు.

May 5, 2026 / 04:04 PM IST

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ

NGKL: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి CMRF, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

May 5, 2026 / 04:03 PM IST

వానాకాలం సాగుపై రైతులకు అవగాహన సదస్సు

KNR: కరీంనగర్ రూరల్ మండలం ముక్దంపూర్ గ్రామంలోని రైతు వేదికలో వానకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి, సిబ్బంది రైతులకు తగిన పంటల ఎంపిక, విత్తనాల నాణ్యత, ఎరువుల వినియోగం, పురుగు మందుల నియంత్రణపై సూచనలు ఇచ్చారు. వర్షాధారిత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు పాటించాలని వివరించారు.

May 5, 2026 / 04:02 PM IST

రైతు వారోత్సవాల్లో పాల్గొన్న ఛైర్‌పర్సన్

BDK: ఇల్లందు మండలం సుదిమళ్ళ గ్రామ రెవిన్యూ క్లస్టర్ రైతు వేదికలో రైతు వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ కిరణ్ మిత్ర, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొని మాట్లాడారు. పోడు రైతులంతా మొక్కజొన్న సాగు మాత్రమే కాకుండా ప్రత్నమాయ పంటల వైపు మారాలన్నారు. అయిల్ పామ్ పంట ఆదాయం, ఉత్పత్తిపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు.

May 5, 2026 / 04:01 PM IST

అమిస్తాపూర్లో సీసీ రోడ్లు ప్రారంభం

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్మన్ మూడవత్ బాలకోటి సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

May 5, 2026 / 04:01 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

PDPL: కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ జిల్లాలో ఎలిగేడు మండలం నర్సాపూర్, మంథనిలోని గంగాపురిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. లోడింగ్, అన్లోడింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. గన్ని సంచులు, తార్ పాలిండ్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

May 5, 2026 / 04:01 PM IST

‘కారల్ మార్క్స్ సిద్ధాంతాలతోనే సమానత్వం’

NRML: సమానత్వం కారల్ మార్క్స్ సిద్ధాంతాలతోనే సాధ్యమని సీపీఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నూతన్ కుమార్ అన్నారు. ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ 209వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో ఉన్న సీపీఎం గద్దె వద్ద కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఉన్నారు.

May 5, 2026 / 04:00 PM IST

‘స్కాలర్షిప్ విధానాన్ని రద్దు చేయడం సరైనది కాదు’

ADB: జీవో నెంబర్ 7ని తీసుకువచ్చి ప్రైవేట్ విద్య సంస్థల్లో స్కాలర్షిప్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయటం సరైన నిర్ణయం కాదని భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు షకీల్ అన్నారు. మంగళవారం పట్టణంలో పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. స్కాలర్షిప్ విధానాన్ని రద్దు చేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు విద్యకు దూరమవుతారని పేర్కొన్నారు.

May 5, 2026 / 04:00 PM IST

‘పేదల దుకాణాలను ఏకపక్షంగా తొలగించవద్దు’

RR: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భరత్ నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ పేరుతో పేదల దుకాణాలను ఏకపక్షంగా తొలగించవద్దని అధికారులను ఆదేశించారు. జీవనాధారం కోల్పోయే నిరుపేదలకు ముందే ప్రత్యామ్నాయం చూపాలని ఆయన స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.

May 5, 2026 / 04:00 PM IST

రేపు ఎస్సీ రుణాల దరఖాస్తుల పరిశీలన

BHPL: మొగుళ్లపల్లి మండలంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.11 గం.కు ఎంపీపీ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుదారులు తమ వెంట అసలు పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసిన అర్హుల జాబితాను జిల్లా అధికారులకు పంపిస్తామని వెల్లడించారు.

May 5, 2026 / 03:52 PM IST

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి

JGL: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుపై ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లకు రైతుల నుంచి నష్టం జరిగితే ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు.

May 5, 2026 / 03:51 PM IST

జిల్లాలో 4 రోజులు పర్యటించనున్న హుస్సేన్ నాయక్

MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 6 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 6న మహబూబాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ వారితో ఫీల్డ్ విజిట్, 7న మహబూబాబాద్ జిల్లా ఎస్టీ సంబంధిత కేసుల విచారణ, 8న రైతులకు స్ప్రేయర్స్ పంపిణీ, 9న గిరిజన ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లనున్నారు.

May 5, 2026 / 03:48 PM IST

కోదాడ పశు వైద్యశాలలో గొర్రెకు అరుదైన సర్జరీ.!

SRPT: కోదాడ పట్టణంలోని పశు వైద్యశాలలో ఈరోజు ఓ గొర్రెకు పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెంలో ఓ గొర్రె తొంటి జాయింట్ పగిలిపోగా, వైద్యులు పెంటయ్య, చంద్రమోహన్ రాడ్లు అమర్చి ఆపరేషన్ చేశారు. సర్జరీ తర్వాత గొర్రె వెంటనే లేచి నిలబడటంతో యజమాని సంతోషం వ్యక్తం చేశారు.

May 5, 2026 / 03:48 PM IST

‘ఆర్మూర్ మున్సిపాలిటీని జాతీయస్థాయిలో నిలపాలి’

NZB: స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో జాతీయస్థాయిలో ఆర్మూర్ మున్సిపాలిటీని ముందంజలో నిలపాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ లహరి రఘు ప్రజలను కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్‌పై ఆన్‌లైన్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ పోర్టల్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగం కావాలన్నారు.

May 5, 2026 / 03:47 PM IST