• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

KMM: జిల్లా కలెక్టర్ అనుదీప్ తన క్యాంపు కార్యాలయం నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె. రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ సమీక్ష నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని గురించి ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

March 11, 2026 / 07:05 AM IST

ఉమ్మడి జిల్లాలో 2100 మందికి ఉద్యోగాలు

ADB: ఆదిలాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 7500 మంది పాల్గొన్నట్లు చెప్పారు. రూ.13 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం ఉన్న ఉద్యోగాలకు యువత ఎంపికైందని వెల్లడించారు. 67 కంపెనీలు పాల్గొనగా వివిధ రంగాలలో 2100 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

March 11, 2026 / 07:05 AM IST

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

BHNG: రామ‌న్న‌పేట మండలం వెల్లంకికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని కోసం ఐదేండ్ల క్రితం భువనగిరిలోని ఫ‌య్ స్టార్ ఫైనాన్స్‌లో రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. 2 నెలలుగా చేనేత పనులు లేకపోవడంతో EMI కట్టలేదు. దీంతో మనస్థాపానికి గురై మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. SI నాగరాజు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు.

March 11, 2026 / 07:02 AM IST

వరంగల్ NIT డైరెక్టర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

WGL: నగరంలోని NIT డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సుబూధికి నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (NAAI) ‘డిస్టింగ్విష్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్ అవార్డు’ లభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ కంట్రోల్, రోబోటిక్స్ రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. దీంతో ఆయనకు కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు శుభాకాంక్షలు తెలిపారు.

March 11, 2026 / 07:02 AM IST

ఆటో ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు

SRPT: కోదాడ పట్టణంలో మంగళవారం రాత్రి కోదాడ-మేళ్లచెరువు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తోగర్రాయి గ్రామానికి చెందిన హరీష్, అభిలాష్, లక్ష్మీనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 11, 2026 / 07:02 AM IST

మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

NZB: జిల్లా కేంద్రంలోని బూరుడుగల్లీలో సతీష్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లారెడ్డిలో ఇల్లరికం ఉన్న సతీష్, భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇటీవల నగరానికి తిరిగి వచ్చి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

March 11, 2026 / 07:01 AM IST

మంత్రి వివేక్ నేటి పర్యటన వివరాలు

MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో ఇవాళ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు జైపూర్ మండలం ఇందారంలో మహిళ భవన్‌కు భూమిపూజ, అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. 9.30 గంటలకు ఫుడ్ గ్రైన్ స్టోరేజ్ నూతన బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు చెన్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్నారు.

March 11, 2026 / 06:41 AM IST

‘కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి’

SDPT: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించి రుచికరంగా వండాలని వంట సిబ్బందిని జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశించారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు.

March 11, 2026 / 06:38 AM IST

‘ఇరాన్ పై యుద్ధాన్నివిరమించుకోవాలి ‘

WGL: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం కూడలిలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో SKM నాయకులు రాచర్ల బాల రాజు, ఇసంపల్లి బాబు, సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 11, 2026 / 06:34 AM IST

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: సీపీ

NZB: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీస్ శాఖ అమలు చేయాల్సిన 99 రోజుల కార్యక్రమాలపై సీపీ సాయి చైతన్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని మంగళవారం ఆదేశించారు.

March 11, 2026 / 06:33 AM IST

జడ్చర్ల నియోజకవర్గంలో రెండు ఆసుపత్రుల స్థాయి పెంపు

MBNR: జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రెండు ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 పడకల స్థాయిలో ఉన్న బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలకు పెంచుతూ, అలాగే 23 పడకల స్థాయిలో ఉన్న బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 11, 2026 / 06:31 AM IST

సీఎం ప్రజావాణిలో 345 దరఖాస్తులు

HYD: బేగంపేట్ ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 345 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 127, రెవెన్యూ శాఖకు 50, ఇందిరమ్మ ఇళ్ల కోసం 90, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు రాగా ఇతర శాఖలకు సంబంధించి 77 దరఖాస్తులు అందాయని సీఎం ప్రజావాణి ఇంఛార్జ్ జి.చిన్నారెడ్డి వెల్లడించారు.

March 11, 2026 / 06:31 AM IST

పెద్దపులి అడుగులు.. జిల్లాలో భయాందోళనలు..!

సిరిసిల్ల జిల్లా వైపు పెద్దపులి అడుగులు వేస్తున్నట్లు అంచనాలు వెలువడడంతో అటవీ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం జిల్లాను వదిలి నిజామాబాద్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్న పులి, దిశ మార్చి సిరిసిల్ల జిల్లా వైపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రైతులు, పాడి పశువుల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు.

March 11, 2026 / 06:30 AM IST

నేడు, రేపు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ, రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. ఈ పర్యటనలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.

March 11, 2026 / 06:28 AM IST

ఓటరు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

GDWL: ప్రజా సమస్యలపై వచ్చే ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫార్మ్ 6, 7, 8 దరఖాస్తులను పూర్తి చేస్తూ కనీసం 85% పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు.

March 11, 2026 / 06:28 AM IST