VKB: రోడ్డు నియమాలపై అవగాహన ఉండాలని కుల్కచర్ల ఎస్సై రమేశ్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలపై పాఠశాల విద్యార్థులకు శనివారం పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రోడ్డుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాహనదారులు ఎలా డ్రైవింగ్ చేయాలి? పాదాచారులు రోడ్డు ఎక్కడ క్రాస్ చేయాలని ఏ గుర్తుల దగ్గర ఆగి రోడ్డు దాటాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
HYD: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో TGSPDCL పరిధిలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ORR ప్రాంతాల్లో ఒక్కరోజు వినియోగం 95 మిలియన్ యూనిట్లను దాటినట్లు అధికారులు తెలిపారు. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వినియోగం అధికంగా ఉండటంతో డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతోంది. ప్రజలు విద్యుత్ను ఆదా చేస్తూ జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.
SRD: న్యాల్కల్ మండలంలోని ముంగి శివారులో స్థానిక శివారులో నిమ సేకరించిన భూములను స్వాధీనం చేసుకుంటున్న అధికారులను శనివారం తండా ప్రజలు అడ్డుకున్నారు. ఇక్కడ శివారులో నిమ్జ్ కోసం సేకరించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక తండావాసులు ఆగ్రహించగా, ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.
జగిత్యాల జిల్లాలో 20వ తేదీ నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని DEO తెలిపారు. ఓపెన్ టెన్త్కు 659 మంది, ఇంటర్కు 980 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. టెన్త్కు 4, ఇంటర్కు 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 99 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రశ్నపత్రాల రవాణా భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని అడిషనల్ డీజీపీ సుధీర్ బాబు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు సుధీర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో SP అక్షాన్స్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
SDPT: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బెజ్జంకిలో శనివారం బీజేపీ నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం కాంగ్రెస్ మహిళా వ్యతిరేకతకు నిదర్శనమని మండల అధ్యక్షుడు కొలిపాక రాజు విమర్శించారు. మహిళా సాధికారతకు BJP కట్టుబడి ఉందని, అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ‘సి-లాంగ్వేజ్’పై శనివారం వన్డే వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు సి, జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో పట్టు సాధించి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
GDWL: ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలని ఎంపీడీవో అజర్ మోహియుద్దీన్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రం శివారులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి, హాజరు పట్టికను తనిఖీ చేశారు. కూలీలు సమయపాలన పాటించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేశ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దోమల ఎక్కువగా ఉన్నాయన్న సమాచారం అందుకున్న 8వ వార్డు కౌన్సిలర్ ఉదయశ్రీ తక్షణమే స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా హాస్టల్ ప్రాంగణం అంతటా ఈరోజు దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన కౌన్సిలర్ను విద్యార్థులు, సిబ్బంది అభినందించారు.
BHPL: కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర CM రేవంత్ రెడ్డి, మంత్రులు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మహాదేవపూర్ మండలం నుంచి కాటారం మండలం వరకు ఉన్న 353 (C) జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను ట్రాక్టర్ల సహాయంతో తొలగించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా రహదారి అంచులను లెవలింగ్ చేయించారు.
BDK: కొత్తగూడెం డా.ఏపీజే అబ్దుల్ కలాం కాలేజీలో నారి శక్తి సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని తమ మద్దతును వ్యక్తం చేశారు. భారతదేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత కీలకమని తెలిపారు. కాంగ్రెస్ కూటమి ఈ మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
NGKL: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సాకర్ కోళ్ల బ్రిడ్జి (ఎల్లికల్ రోడ్) నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరైన ఈ పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ రత్నమాల, వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. వంతెన నిర్మాణంతో గ్రామస్తులు, రైతుల రవాణా కష్టాలు తీరనున్నాయని వారు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి చరిత శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, వార్డుల్లోని ప్రజా సమస్యలపై చర్చించారు. నియోజకవర్గ ప్రగతికి హరీష్రావు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని చరిత పేర్కొన్నారు.
MDCL: మేడ్చల్ జిల్లా పరిధి ఉప్పల్, బోడుప్పల్, నాచారం, చిలుకా నగర్, కీసర సహాపలు ప్రాంతాలలో రేషన్ బియ్యం పంపిణీ సంబంధించి లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కసారిగా లబ్ధిదారులు రావడంతో డీలర్లు టోకెన్ సిస్టం అమలు చేస్తున్నారు. ఉదయం టోకెన్లు అందజేసి, ఉదయం, సాయంత్రం రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. రోజుకు ఒక్కోచోట 200 మంది చొప్పున అందిస్తున్నారు.