సిరిసిల్ల జిల్లా వైపు పెద్దపులి అడుగులు వేస్తున్నట్లు అంచనాలు వెలువడడంతో అటవీ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం జిల్లాను వదిలి నిజామాబాద్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్న పులి, దిశ మార్చి సిరిసిల్ల జిల్లా వైపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రైతులు, పాడి పశువుల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు.